ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్ నడుస్తున్న వేళ ఇండియా తన రూట్ మార్చింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పరిధిలోని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి ఆరు దేశాలతో భారీ వాణిజ్య ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ లేదా చైనా కంటే కూడా ఈ గల్ఫ్ దేశాలే మనకు అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్లుగా నిలుస్తున్నాయి. అందుకే ఈ దేశాలతో కుదుర్చుకోబోయే కొత్త ఒప్పందం మన ఆర్థిక వ్యవస్థకు ఒక టర్నింగ్ పాయింట్ కానుంది.
ఇప్పటికే యూఏఈ, ఒమన్ దేశాలతో మనకు స్పెషల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు జరగబోయే ఆరు దేశాల ఉమ్మడి ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతులపై ట్యాక్సులు భారీగా తగ్గుతాయి. ముఖ్యంగా మన దగ్గర తయారయ్యే ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, జెమ్స్ అండ్ జువెలరీకి గల్ఫ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ డీల్ ఓకే అయితే మన కంపెనీలకు అక్కడ వ్యాపారం చేయడం చాలా ఈజీ అవుతుంది. అటు నుంచి మనకు కావాల్సిన ముడి చమురు, గ్యాస్ సప్లైలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
గతేడాది లెక్కల ప్రకారం ఇండియా గల్ఫ్ మధ్య సుమారు 179 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. మనం ఎక్కువగా ఆ దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుంటే, మనవాళ్లు అక్కడికి బియ్యం, మాంసం, మెటల్స్ వంటివి పంపిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు, ఇది మనకు మరో ప్లస్ పాయింట్. కేవలం ఎనర్జీ సెక్యూరిటీ కోసమే కాకుండా, మన కుర్రాళ్ల టాలెంట్ను, సర్వీసులను అక్కడ వాడుకోవడానికి ఈ ఒప్పందం ఒక దారి చూపిస్తుంది.
నిజానికి ఈ చర్చలు 2006లోనే మొదలైనా కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ నేతృత్వంలో ఈ డీల్పై కసరత్తు వేగవంతమైంది. పెట్రో కెమికల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో ఉన్న మన కంపెనీలకు గల్ఫ్ దేశాల్లో భారీ అవకాశాలు దక్కనున్నాయి. అమెరికా మార్కెట్ మీద మాత్రమే ఆధారపడకుండా, పక్కనే ఉన్న గల్ఫ్ మార్కెట్ను మనం ఒడిసిపట్టుకుంటే ఇండియా గ్రోత్ రేట్ ఇంకో లెవల్లో ఉంటుంది.
గల్ఫ్ దేశాల దగ్గర బోలెడు డబ్బు ఉంది, మన దగ్గర స్కిల్డ్ వర్కర్లు ఉన్నారు. ఈ రెండింటినీ కలిపితే రెండు వైపులా లాభమే. అయితే దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ ఉండటం.. అనేది ఒక సవాలుగా ఉంది. సౌదీ, ఖతార్ వంటి దేశాల నుంచి మనం కొనే గ్యాస్, ఆయిల్ విలువ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఈ కొత్త ఒప్పందంతో మన ఎగుమతులు పెరిగితే ఆ గ్యాప్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అందుకే ఈ మెగా ట్రేడ్ డీల్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఒకవైపు రాష్ట్రంలో సొమ్ములు లేవని.. ఎవరూ డబ్బులు డిమాండ్ చేయద్దని సాక్షత్తూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అంతేకాదు.. బీఆర్…
వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా వచ్చిన 'రావు బహదూర్' ఒక సైకలాజికల్ డ్రామా. సినిమా మొత్తాన్ని సత్యదేవ్ తన…
బెంగాలీ నటి, మాజీ ఎంపీ నుస్రత్ జహాన్ మరోసారి తన లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా…
ఈ ఏడాది దసరా సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ కు మంచి కిక్కిచ్చే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ చివరి వారం నుంచి…
సందీప్ కిషన్ హీరోగా నెట్ ఫ్లిక్స్ మొదటిసారి నిర్మించిన టాలీవుడ్ స్ట్రెయిట్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' నిన్నటి నుంచి…
రాజమౌళి వారణాసి సినిమాలో రామాయణం బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన ఎపిసోడ్ పైనే అందరి ఫోకస్ ఎక్కువగా ఉంది. అయితే…