Political News

ఏం చేసినా కాపులు టెంప్ట్ కావట్లేదా?

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కాపులను కేంద్రంగా చేసుకుని నాయకులు కామెంట్లు కురిపిస్తున్నారు. దీనిలో భాగంగానే అంబటి రాంబాబు వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపే ప్రయత్నం చేశారు. ఇక, కాపు ఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సైతం సీఎం చంద్రబాబుకు భారీ లేఖ సంధించారు. కాపులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది సరికాదన్నారు. ఇక, దీనికి కౌంటర్‌గా ఆయన కుమార్తె క్రాంతి కూడా స్పందించారు.

మొత్తంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు కాపులకు మధ్య అవినాభావ సంబంధాన్ని ముడిపెట్టేలా పరిస్థితులు ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీతో కలిసి ఉన్న జనసేనను దూరం చేస్తే, తద్వారా ఓటు బ్యాంకు చీలిపోయి తమకు మేలు చేస్తుందనే అంచనాలో వైసీపీ నాయకులు ఉన్నట్టు చర్చ సాగుతోంది. ఇది ఏమేరకు ఆ పార్టీకి లాభం చేకూరుస్తుందన్నది చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం కాపులు చాలా వరకు నిలకడగానే ఉన్నారన్నది వాస్తవం.

ఎక్కడా కీలక నాయకులు పెద్దగా నోరు విప్పడం లేదు. కాపు నేతల్లో ఐకాన్‌లుగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు, తోట త్రిమూర్తులు, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపులను రెచ్చగొట్టినా వారిలో పెద్దగా మార్పు రావడం ఊహించలేమన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను భేరీజు వేసుకుని, ఏ వైపు మొగ్గు చూపినా ఇబ్బందులు తప్పవన్న ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది.

గతంలో తుని ఘటన జరిగినప్పుడు కాపులు బలంగా స్పందించారు. కానీ ఇప్పుడు జరుగుతున్న అంబటి ఎపిసోడ్‌కు, అప్పటి పరిస్థితులకు మధ్య స్పష్టమైన తేడా ఉంది. అందుకే నాడు కనిపించిన వేగవంతమైన ప్రతిస్పందన ఇప్పుడు కనిపించడం లేదు. ప్రతి విషయాన్నీ ఆచితూచి పరిశీలిస్తున్నారు. ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు.

అందుకే ఎన్ని రాజకీయ పరిణామాలు జరిగినా కాపులు ప్రస్తుతం నిలకడగానే ఉండాలనే స్థిర నిర్ణయంతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ముందెం జరుగుతుందన్నది చూడాలి.

This post was last modified on February 6, 2026 4:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యవంశీ

2026 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఆటాడుకుంటూ కేవలం 80…

1 hour ago

అమెరికా తర్వాత భారత్ డీల్ ఎవరితో మోడీజీ?

ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ వార్ నడుస్తున్న వేళ ఇండియా తన రూట్ మార్చింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పరిధిలోని…

2 hours ago

ప్ర‌జ‌లే మీకు ఓటేయ‌లేదు… ‘పీకే’కు సుప్రీం షాక్

రాజ‌కీయ మాజీ వ్యూహ‌క‌ర్త‌.. జ‌న్ సురాజ్ పార్టీ అధినేత ప్ర‌శాంత్ కిషోర్ ఉర‌ఫ్ పీకేను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీల‌క ప్ర‌శ్న‌లు…

3 hours ago

నిరసనల దెబ్బకు దిగి వచ్చిన నెట్ ఫ్లిక్స్

మనోజ్ బాజ్ పాయ్ హీరోగా రూపొందిన ఓటిటి మూవీ ఘుస్కోర్ పండత్ త్వరలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతున్న…

3 hours ago

హీరోలకు దర్శకులు లైఫ్ ఇస్తారా

మాములుగా ఈ స్టేట్ మెంట్ పలు సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఫలానా నటుడు స్టార్ కావడానికి ఒక దర్శకుడు కారణమనే…

4 hours ago

ప్యారడైజ్ దాటాల్సిన చిక్కులు ఎన్నో

పెద్ది మార్చి నుంచి తప్పుకుని ఏప్రిల్ చివరికి వెళ్ళిపోయాక మూవీ లవర్స్ దృష్టి ప్యారడైజ్ వైపు వెళ్తోంది. వాయిదా కన్ఫర్మ్…

5 hours ago