Political News

ఏం చేసినా కాపులు టెంప్ట్ కావట్లేదా?

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కాపులను కేంద్రంగా చేసుకుని నాయకులు కామెంట్లు కురిపిస్తున్నారు. దీనిలో భాగంగానే అంబటి రాంబాబు వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపే ప్రయత్నం చేశారు. ఇక, కాపు ఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సైతం సీఎం చంద్రబాబుకు భారీ లేఖ సంధించారు. కాపులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది సరికాదన్నారు. ఇక, దీనికి కౌంటర్‌గా ఆయన కుమార్తె క్రాంతి కూడా స్పందించారు.

మొత్తంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు కాపులకు మధ్య అవినాభావ సంబంధాన్ని ముడిపెట్టేలా పరిస్థితులు ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీతో కలిసి ఉన్న జనసేనను దూరం చేస్తే, తద్వారా ఓటు బ్యాంకు చీలిపోయి తమకు మేలు చేస్తుందనే అంచనాలో వైసీపీ నాయకులు ఉన్నట్టు చర్చ సాగుతోంది. ఇది ఏమేరకు ఆ పార్టీకి లాభం చేకూరుస్తుందన్నది చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం కాపులు చాలా వరకు నిలకడగానే ఉన్నారన్నది వాస్తవం.

ఎక్కడా కీలక నాయకులు పెద్దగా నోరు విప్పడం లేదు. కాపు నేతల్లో ఐకాన్‌లుగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు, తోట త్రిమూర్తులు, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపులను రెచ్చగొట్టినా వారిలో పెద్దగా మార్పు రావడం ఊహించలేమన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను భేరీజు వేసుకుని, ఏ వైపు మొగ్గు చూపినా ఇబ్బందులు తప్పవన్న ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది.

గతంలో తుని ఘటన జరిగినప్పుడు కాపులు బలంగా స్పందించారు. కానీ ఇప్పుడు జరుగుతున్న అంబటి ఎపిసోడ్‌కు, అప్పటి పరిస్థితులకు మధ్య స్పష్టమైన తేడా ఉంది. అందుకే నాడు కనిపించిన వేగవంతమైన ప్రతిస్పందన ఇప్పుడు కనిపించడం లేదు. ప్రతి విషయాన్నీ ఆచితూచి పరిశీలిస్తున్నారు. ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు.

అందుకే ఎన్ని రాజకీయ పరిణామాలు జరిగినా కాపులు ప్రస్తుతం నిలకడగానే ఉండాలనే స్థిర నిర్ణయంతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ముందెం జరుగుతుందన్నది చూడాలి.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

28 minutes ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

1 hour ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

1 hour ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

12 hours ago