Political News

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు.. అసలు వైసీపీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? హిందూ ధర్మం, ఆలయాల విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు ఎలా ఉంది? అనేది ఆయన వివరించారు. పాయింట్ల వారీగా చూస్తే సీఎం చంద్రబాబు లేవనెత్తిన అనేక అంశాలు వైసీపీని అత్యంత ఇరుకున పెట్టే అంశాలుగా మారాయి.

ప్రధానంగా:

1) అంతర్వేది:
వైసీపీ హయాంలో అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధమైంది. ఈ విషయాన్ని సీఎం ప్రస్తావించారు. నాడు వైసీపీ నేతలు ఈ విచారణకు కూడా అడ్డుపడ్డారని, సీబీఐకి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా తప్పించుకున్నారని అన్నారు. పైగా తేనెతుట్టెకు పొగ పెట్టడం వల్లే మంటలు వ్యాపించాయని, అందుకే రథం తగలబడిందని చెప్పారని తెలిపారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఈ విషయంపై గతంలో ఏమి చేసిందన్నది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

2) అనంతపురం ఘటన:
వైసీపీ హయాంలో అనంతపురం జిల్లాలో ఆంజనేయుడి విగ్రహాన్ని పగలగొట్టారు. దీనిపైనా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అయితే అప్పట్లో వైసీపీ నాయకులు లైట్ తీసుకున్నారు. “అదో బొమ్మే కదా, ఇంకోటి పెట్టుకోండి” అని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి చంద్రబాబు తీసుకువెళ్లనున్నారు. దీనిపై కూడా వైసీపీ అంతర్మథనంలో పడే అవకాశం కనిపిస్తోంది.

3) రామతీర్థం:
విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీరాముడి విగ్రహం శిరఛ్ఛేదనం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. హుటాహుటిన కొత్త విగ్రహం ప్రతిష్ఠించినా, ఆనాడు ఈ ఘటనపై వైసీపీ పాలకులు మసిపూసి మారేడు చేశారన్న వాదన ఉంది. అందుకే ఇప్పుడు మళ్లీ ఈ విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లనున్నారు. దీనిపై కూడా వైసీపీ ఇరుకున పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

4) బెజవాడ దుర్గమ్మ:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయ రథంలో ఉన్న వెండి సింహాలను దొంగిలించారు. ఈ వ్యవహారంపైనా వైసీపీ నాయకులు తూతూ మంత్రంగా విచారణ చేయించారని ఆరోపణ ఉంది. దీనిపైనా ఇప్పుడు కూటమి ప్రజల్లో ఎండగట్టనుంది. దీనికి వైసీపీ నాయకులు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

5) తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ:
ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి 2022లోనే గత వైసీపీ ప్రభుత్వానికి నివేదిక అందిందని చెబుతున్నారు. సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన నివేదికలో నెయ్యి కల్తీ జరుగుతోందని స్పష్టంగా ఉందని అంటున్నారు. కానీ ఆ నివేదికను అప్పట్లో పక్కన పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. అప్పట్లో ఏమి జరిగింది? ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే ప్రశ్నలకు వైసీపీ సమాధానం ఇవ్వాల్సి ఉంది. కానీ అలాంటి ప్రశ్నలకు ఆ పార్టీ వద్ద సమాధానం ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on February 5, 2026 10:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

3 minutes ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 minutes ago

తండ్రి దర్శకత్వంలో ‘సీతా పయనం’

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

54 minutes ago

వారణాసి సంగీతం మీద ఆర్ఆర్ఆర్ బరువు

ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…

3 hours ago

స్వయంభు సౌండ్ గట్టిగా వినిపించాల్సిందే

నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…

4 hours ago

తాప్సి నుంచి మరో స్ట్రాంగ్ మూవీ

తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్‌కు…

4 hours ago