Political News

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు.. అసలు వైసీపీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? హిందూ ధర్మం, ఆలయాల విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు ఎలా ఉంది? అనేది ఆయన వివరించారు. పాయింట్ల వారీగా చూస్తే సీఎం చంద్రబాబు లేవనెత్తిన అనేక అంశాలు వైసీపీని అత్యంత ఇరుకున పెట్టే అంశాలుగా మారాయి.

ప్రధానంగా:

1) అంతర్వేది:
వైసీపీ హయాంలో అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధమైంది. ఈ విషయాన్ని సీఎం ప్రస్తావించారు. నాడు వైసీపీ నేతలు ఈ విచారణకు కూడా అడ్డుపడ్డారని, సీబీఐకి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా తప్పించుకున్నారని అన్నారు. పైగా తేనెతుట్టెకు పొగ పెట్టడం వల్లే మంటలు వ్యాపించాయని, అందుకే రథం తగలబడిందని చెప్పారని తెలిపారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఈ విషయంపై గతంలో ఏమి చేసిందన్నది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

2) అనంతపురం ఘటన:
వైసీపీ హయాంలో అనంతపురం జిల్లాలో ఆంజనేయుడి విగ్రహాన్ని పగలగొట్టారు. దీనిపైనా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అయితే అప్పట్లో వైసీపీ నాయకులు లైట్ తీసుకున్నారు. “అదో బొమ్మే కదా, ఇంకోటి పెట్టుకోండి” అని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి చంద్రబాబు తీసుకువెళ్లనున్నారు. దీనిపై కూడా వైసీపీ అంతర్మథనంలో పడే అవకాశం కనిపిస్తోంది.

3) రామతీర్థం:
విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీరాముడి విగ్రహం శిరఛ్ఛేదనం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. హుటాహుటిన కొత్త విగ్రహం ప్రతిష్ఠించినా, ఆనాడు ఈ ఘటనపై వైసీపీ పాలకులు మసిపూసి మారేడు చేశారన్న వాదన ఉంది. అందుకే ఇప్పుడు మళ్లీ ఈ విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లనున్నారు. దీనిపై కూడా వైసీపీ ఇరుకున పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

4) బెజవాడ దుర్గమ్మ:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయ రథంలో ఉన్న వెండి సింహాలను దొంగిలించారు. ఈ వ్యవహారంపైనా వైసీపీ నాయకులు తూతూ మంత్రంగా విచారణ చేయించారని ఆరోపణ ఉంది. దీనిపైనా ఇప్పుడు కూటమి ప్రజల్లో ఎండగట్టనుంది. దీనికి వైసీపీ నాయకులు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

5) తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ:
ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి 2022లోనే గత వైసీపీ ప్రభుత్వానికి నివేదిక అందిందని చెబుతున్నారు. సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన నివేదికలో నెయ్యి కల్తీ జరుగుతోందని స్పష్టంగా ఉందని అంటున్నారు. కానీ ఆ నివేదికను అప్పట్లో పక్కన పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. అప్పట్లో ఏమి జరిగింది? ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే ప్రశ్నలకు వైసీపీ సమాధానం ఇవ్వాల్సి ఉంది. కానీ అలాంటి ప్రశ్నలకు ఆ పార్టీ వద్ద సమాధానం ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on February 5, 2026 10:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాహుబలి-2 రికార్డు… ఇంకొన్ని రోజులే

తొమ్మిదేళ్ల కిందట ‘బాహుబలి: ది కంక్లూజన్’ బాక్సాఫీస్ దగ్గర మామూలు ప్రభంజనం సృష్టించలేదు. అప్పటిదాకా ఉన్న అన్ని ఇండియన్ బాక్సాఫీస్…

44 minutes ago

‘బరి’ దర్శకుడు భలే చెప్పాడు

ఓటీటీల్లో మలయాళం సినిమాలను కొన్నేళ్లుగా విరగబడి చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అక్కడి సినిమాల్లో కంటెంట్ చూసి ఇలాంటివి తెలుగులో తీయరేంటి…

1 hour ago

పవన్ సినిమాలో బ్రహ్మి… నల్లమలలో జగన్?

ఏపీ అసెంబ్లీలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సినీ కమెడియన్…

2 hours ago

ధోని బిగ్ స్టేట్మెంట్‌కు రెడీగా ఉండాలా?

ఈ రోజు ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభం కాబోతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పెద్ద షాకే ఇచ్చింది. ఆ…

3 hours ago

”ఆ 11 మంది పశ్చాత్తాప పడతారనుకున్నా”

నవ్యాంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శనివారం సమావేశమైన అసెంబ్లీలో విపక్షం వైసీపీకి చెందిన 11 మంది సభ్యులపై అధికార…

4 hours ago

అమరావతి అగ్నిప్రమాదం వెనుక అసలు నిజం

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనలో కుట్ర కోణమేమీ లేదని తేలిపోయయింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన…

4 hours ago