హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు.. అసలు వైసీపీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? హిందూ ధర్మం, ఆలయాల విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు ఎలా ఉంది? అనేది ఆయన వివరించారు. పాయింట్ల వారీగా చూస్తే సీఎం చంద్రబాబు లేవనెత్తిన అనేక అంశాలు వైసీపీని అత్యంత ఇరుకున పెట్టే అంశాలుగా మారాయి.
ప్రధానంగా:
1) అంతర్వేది:
వైసీపీ హయాంలో అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధమైంది. ఈ విషయాన్ని సీఎం ప్రస్తావించారు. నాడు వైసీపీ నేతలు ఈ విచారణకు కూడా అడ్డుపడ్డారని, సీబీఐకి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా తప్పించుకున్నారని అన్నారు. పైగా తేనెతుట్టెకు పొగ పెట్టడం వల్లే మంటలు వ్యాపించాయని, అందుకే రథం తగలబడిందని చెప్పారని తెలిపారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఈ విషయంపై గతంలో ఏమి చేసిందన్నది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
2) అనంతపురం ఘటన:
వైసీపీ హయాంలో అనంతపురం జిల్లాలో ఆంజనేయుడి విగ్రహాన్ని పగలగొట్టారు. దీనిపైనా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అయితే అప్పట్లో వైసీపీ నాయకులు లైట్ తీసుకున్నారు. “అదో బొమ్మే కదా, ఇంకోటి పెట్టుకోండి” అని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి చంద్రబాబు తీసుకువెళ్లనున్నారు. దీనిపై కూడా వైసీపీ అంతర్మథనంలో పడే అవకాశం కనిపిస్తోంది.
3) రామతీర్థం:
విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీరాముడి విగ్రహం శిరఛ్ఛేదనం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. హుటాహుటిన కొత్త విగ్రహం ప్రతిష్ఠించినా, ఆనాడు ఈ ఘటనపై వైసీపీ పాలకులు మసిపూసి మారేడు చేశారన్న వాదన ఉంది. అందుకే ఇప్పుడు మళ్లీ ఈ విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లనున్నారు. దీనిపై కూడా వైసీపీ ఇరుకున పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
4) బెజవాడ దుర్గమ్మ:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయ రథంలో ఉన్న వెండి సింహాలను దొంగిలించారు. ఈ వ్యవహారంపైనా వైసీపీ నాయకులు తూతూ మంత్రంగా విచారణ చేయించారని ఆరోపణ ఉంది. దీనిపైనా ఇప్పుడు కూటమి ప్రజల్లో ఎండగట్టనుంది. దీనికి వైసీపీ నాయకులు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.
5) తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ:
ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి 2022లోనే గత వైసీపీ ప్రభుత్వానికి నివేదిక అందిందని చెబుతున్నారు. సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన నివేదికలో నెయ్యి కల్తీ జరుగుతోందని స్పష్టంగా ఉందని అంటున్నారు. కానీ ఆ నివేదికను అప్పట్లో పక్కన పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. అప్పట్లో ఏమి జరిగింది? ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే ప్రశ్నలకు వైసీపీ సమాధానం ఇవ్వాల్సి ఉంది. కానీ అలాంటి ప్రశ్నలకు ఆ పార్టీ వద్ద సమాధానం ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on February 5, 2026 10:06 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…