ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి ఇవ్వబోయే సంగీతం గురించి కేవలం టాలీవుడ్ లవర్సే కాదు వరల్డ్ వైడ్ సినీ ప్రియులు కోట్ల సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా నాటు నాటుని మించిన కంపోజింగ్ ఇందులో ఉండాలని కోరుకుంటున్నారు.
అయితే ఇలా లేనిపోని హైప్ ఇచ్చి అంచనాలు పెంచేసి, నిరాశ పరచడం కంటే, ముందే క్లారిటీ ఇస్తే బెటరనే ఉద్దేశంతో రెండు నెలల క్రితం ఒక ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి ఈ ప్రస్తావన తెచ్చారు. దాని ప్రకారం వారణాసిలో ఆరు పాటలు ఉంటాయి.
అలాని ఆర్ఆర్ఆర్ ని మించిపోయేలానో లేదా దాన్ని తలదన్నేలా ఉంటాయనో కీరవాణి హామీ ఇవ్వడం లేదు. రెండు ఏ కోణంలోనూ సంబంధం లేని వేర్వేరు కథలని, సంగీత ప్రియులను మెప్పించేందుకు అవసరమైన ఎపిసోడ్స్, సాంగ్స్, సీక్వెన్సెస్ అన్నీ ఉంటాయని, కాబట్టి పోలిక అవసరం లేదని తేల్చి చెప్పేశారు.
ఇప్పటికే సంచారి సాంగ్ జనాన్ని ఆకట్టుకోగా ఇది మెయిన్ ఆల్బంలో ఉంటుందా లేదానేది ఇంకా సస్పెన్స్ గానే ఉంచుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 విడుదల కాబట్టి ప్రమోషన్ల టైం దగ్గరపడినప్పుడు కీరవాణి మ్యూజిక్ కు సంబంధించిన మరిన్ని విశేషాలు పంచుకోబోతున్నారు.
ఇంత లేటు వయసులో బెస్ట్ ఇచ్చేందుకు కష్టపడుతున్న కీరవాణి వారణాసితో కనక మరోసారి మేజిక్ చేయగలిగితే అంతర్జాతీయ స్థాయిలో పేరు మళ్ళీ మారు మ్రోగుతుంది. ఈసారి ఆస్కార్ అవకాశాలను పెంచుకునేందుకు రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ ఇప్పటి నుంచే ప్రణాళికతో ఉన్నారు.
ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఏమేం చేయాలో, ఏమేం కావాలో అన్నీ సమకూర్చుకుంటున్నారు. వేసవికల్లా షూటింగ్ పూర్తి చేయాలనేది జక్కన్న స్కెచ్. అదే జరిగితే పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీకి ఎక్కువ సమయం దొరుకుతుంది. మహేష్ కూడా వేరే సినిమాలు, కథల గురించి ఆలోచించకుండా పూర్తిగా వారణాసికి అంకితమైపోయాడు.
This post was last modified on February 5, 2026 5:38 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…