ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి ఇవ్వబోయే సంగీతం గురించి కేవలం టాలీవుడ్ లవర్సే కాదు వరల్డ్ వైడ్ సినీ ప్రియులు కోట్ల సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా నాటు నాటుని మించిన కంపోజింగ్ ఇందులో ఉండాలని కోరుకుంటున్నారు.
అయితే ఇలా లేనిపోని హైప్ ఇచ్చి అంచనాలు పెంచేసి, నిరాశ పరచడం కంటే, ముందే క్లారిటీ ఇస్తే బెటరనే ఉద్దేశంతో రెండు నెలల క్రితం ఒక ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి ఈ ప్రస్తావన తెచ్చారు. దాని ప్రకారం వారణాసిలో ఆరు పాటలు ఉంటాయి.
అలాని ఆర్ఆర్ఆర్ ని మించిపోయేలానో లేదా దాన్ని తలదన్నేలా ఉంటాయనో కీరవాణి హామీ ఇవ్వడం లేదు. రెండు ఏ కోణంలోనూ సంబంధం లేని వేర్వేరు కథలని, సంగీత ప్రియులను మెప్పించేందుకు అవసరమైన ఎపిసోడ్స్, సాంగ్స్, సీక్వెన్సెస్ అన్నీ ఉంటాయని, కాబట్టి పోలిక అవసరం లేదని తేల్చి చెప్పేశారు.
ఇప్పటికే సంచారి సాంగ్ జనాన్ని ఆకట్టుకోగా ఇది మెయిన్ ఆల్బంలో ఉంటుందా లేదానేది ఇంకా సస్పెన్స్ గానే ఉంచుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 విడుదల కాబట్టి ప్రమోషన్ల టైం దగ్గరపడినప్పుడు కీరవాణి మ్యూజిక్ కు సంబంధించిన మరిన్ని విశేషాలు పంచుకోబోతున్నారు.
ఇంత లేటు వయసులో బెస్ట్ ఇచ్చేందుకు కష్టపడుతున్న కీరవాణి వారణాసితో కనక మరోసారి మేజిక్ చేయగలిగితే అంతర్జాతీయ స్థాయిలో పేరు మళ్ళీ మారు మ్రోగుతుంది. ఈసారి ఆస్కార్ అవకాశాలను పెంచుకునేందుకు రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ ఇప్పటి నుంచే ప్రణాళికతో ఉన్నారు.
ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఏమేం చేయాలో, ఏమేం కావాలో అన్నీ సమకూర్చుకుంటున్నారు. వేసవికల్లా షూటింగ్ పూర్తి చేయాలనేది జక్కన్న స్కెచ్. అదే జరిగితే పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీకి ఎక్కువ సమయం దొరుకుతుంది. మహేష్ కూడా వేరే సినిమాలు, కథల గురించి ఆలోచించకుండా పూర్తిగా వారణాసికి అంకితమైపోయాడు.
This post was last modified on February 5, 2026 5:38 pm
భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ…
పెళ్లి చూపులు, జాతిరత్నాలు ఎంత పేరు తెచ్చినా ప్రియదర్శికి మంచి బ్రేక్ గా నిలిచింది బలగం సినిమానే. గత ఏడాది…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రఖ్యాత భద్రాచలం ఆలయాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తృటిలో…
కరోనా ప్రబలిన వేళ.. యావత్తు ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఎలాంటి విపత్కర సరిష్థితులను ఎదురు చూశామన్న…
రాయలసీమలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానముంది. భూమా, గంగుల కుటుంబాల మధ్య ఏళ్ల తరబడి సాగిన ఫ్యాక్షన్ రాజకీయాలు…