ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి ఇవ్వబోయే సంగీతం గురించి కేవలం టాలీవుడ్ లవర్సే కాదు వరల్డ్ వైడ్ సినీ ప్రియులు కోట్ల సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా నాటు నాటుని మించిన కంపోజింగ్ ఇందులో ఉండాలని కోరుకుంటున్నారు.
అయితే ఇలా లేనిపోని హైప్ ఇచ్చి అంచనాలు పెంచేసి, నిరాశ పరచడం కంటే, ముందే క్లారిటీ ఇస్తే బెటరనే ఉద్దేశంతో రెండు నెలల క్రితం ఒక ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి ఈ ప్రస్తావన తెచ్చారు. దాని ప్రకారం వారణాసిలో ఆరు పాటలు ఉంటాయి.
అలాని ఆర్ఆర్ఆర్ ని మించిపోయేలానో లేదా దాన్ని తలదన్నేలా ఉంటాయనో కీరవాణి హామీ ఇవ్వడం లేదు. రెండు ఏ కోణంలోనూ సంబంధం లేని వేర్వేరు కథలని, సంగీత ప్రియులను మెప్పించేందుకు అవసరమైన ఎపిసోడ్స్, సాంగ్స్, సీక్వెన్సెస్ అన్నీ ఉంటాయని, కాబట్టి పోలిక అవసరం లేదని తేల్చి చెప్పేశారు.
ఇప్పటికే సంచారి సాంగ్ జనాన్ని ఆకట్టుకోగా ఇది మెయిన్ ఆల్బంలో ఉంటుందా లేదానేది ఇంకా సస్పెన్స్ గానే ఉంచుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 విడుదల కాబట్టి ప్రమోషన్ల టైం దగ్గరపడినప్పుడు కీరవాణి మ్యూజిక్ కు సంబంధించిన మరిన్ని విశేషాలు పంచుకోబోతున్నారు.
ఇంత లేటు వయసులో బెస్ట్ ఇచ్చేందుకు కష్టపడుతున్న కీరవాణి వారణాసితో కనక మరోసారి మేజిక్ చేయగలిగితే అంతర్జాతీయ స్థాయిలో పేరు మళ్ళీ మారు మ్రోగుతుంది. ఈసారి ఆస్కార్ అవకాశాలను పెంచుకునేందుకు రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ ఇప్పటి నుంచే ప్రణాళికతో ఉన్నారు.
ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఏమేం చేయాలో, ఏమేం కావాలో అన్నీ సమకూర్చుకుంటున్నారు. వేసవికల్లా షూటింగ్ పూర్తి చేయాలనేది జక్కన్న స్కెచ్. అదే జరిగితే పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీకి ఎక్కువ సమయం దొరుకుతుంది. మహేష్ కూడా వేరే సినిమాలు, కథల గురించి ఆలోచించకుండా పూర్తిగా వారణాసికి అంకితమైపోయాడు.
This post was last modified on February 5, 2026 5:38 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి ప్రతి ప్రోమో బ్లాక్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై మరోసారి తన పట్టును గట్టిగా నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలోనూ ఆయన అనేక సందర్భాల్లో…
హఠాత్తుగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19కి ప్రీ పోన్ అయ్యిందన్న వార్త ఒక్కసారిగా నిన్న సాయంత్రం సోషల్ మీడియాని…
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న యుద్ధం.. భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందా? ప్రజలకు కష్టాలు ప్రారంభం కానున్నాయా? అంటే..…
ఎవడో యుద్దం చేసుకోవటం.. మరెవరో దానికి సంబంధించిన మూల్యాన్ని చెల్లించాల్సి రావటం. నిజానికి యుద్దంతో ఇదే తంటా. మనకు ఏ…
పరిమళ్ నత్వానీ. ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. కానీ, ఈయన పెద్ద పారిశ్రామిక వేత్త. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈయన…