వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ మూవీ వెనుక తెలుసుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. దీనికి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ దర్శకత్వం వహించారు. గతంలో విశ్వక్ సేన్ మీద ఆరోపణలు చేసి, తనను తప్పించి వేరే హీరోని తీసుకోవడం జరిగింది ఈ ప్రాజెక్టులోనే.
ఇప్పుడు దీన్ని హిట్ చేసి చూపించడం ద్వారా తన నిర్ణయం రైటని రుజువు చేయాలి. కాకతాళీయంగా సీత పయనం రిలీజ్ కు ముందు రోజు విశ్వక్ సేన్ ఫంకీ రానుంది. ఒకరకంగా చెప్పాలంటే విభేదాలు తెచ్చుకున్న ఒక సీనియర్ జూనియర్ మధ్య డైరెక్ట్ క్లాష్ అన్నమాట.
ఎవరు గెలుస్తారనేది త్వరలో తేలిపోతుంది కానీ అర్జున్ అదృష్టవంతుడిని చెప్పాలి. ఎందుకంటే స్వంత కూతుళ్లను డైరెక్ట్ చేసే అవకాశం అందరు స్టార్లకు రాదు. శృతి హాసన్ అంత టాప్ పొజిషన్ కు వెళ్లినా కమల్ హాసన్ డైరెక్షన్ లో ఇప్పటిదాకా చేయలేదు. స్వర్గీయ కృష్ణ తన కొడుకుల కోసం మెగా ఫోన్ పట్టుకున్నారు కానీ కూతురు ఇందిర యాక్టర్ అయ్యాక ఆ ఛాన్స్ దొరకలేదు.
రజినీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళందరూ కేవలం నటనకే పరిమితం కావడం వల్ల బిడ్డలకు క్లాప్స్ కొట్టే భాగ్యం దక్కలేదు. కానీ అర్జున్ అలా కాదు. సీత పయనం ద్వారా ఆ ముచ్చటను తీర్చుకుంటున్నారు.
ఇక బజ్ విషయానికి వస్తే సీత పయనం మీద ఒకింత అంచనాలు ఉన్నాయి కానీ ప్రమోషన్ల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఐశ్వర్య అర్జున్, నిరంజన్ జంటగా నటించిన ఈ మూవీలో మార్టిన్ ఫేమ్ ధృవ సర్జ స్పెషల్ క్యామియో చేశాడు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశారు.
టెక్నీషియన్స్ విషయంలో అర్జున్ రాజీ పడలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్న సీత పయనం ఏ మేరకు మెప్పిస్తుందో ఫిబ్రవరి 14 తేలనుంది. చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టుకున్న అర్జున్ ఇది కనక సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు డైరెక్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
This post was last modified on February 5, 2026 11:18 pm
తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి,…
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…