వైసీపీ అధినేత జగన్ పర్యటనలు ప్రజలకు గుదిబండలుగా మారాయా? ఆయన బయటకు వస్తుంటే.. తమకు ఇబ్బందిగా ఉందని ప్రజలు చెబుతున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం జగన్ పర్యటన పెట్టుకున్నారు. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు పై చేసిన దుర్భాషల నేపథ్యంలో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ గుంటూరు పర్యటన పెట్టుకున్నారు. కానీ, గత అనుభవాల నేపథ్యంలో గుంటూరును పోలీసులు అష్టదిగ్భంధం చేశారు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. బారికేడ్లు పెట్టారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ప్రజలు జగన్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ వస్తుంటే.. తమ గుండెల్లో దడ పుడుతోందని.. గుంటూరు వాసులు.. పలు ఆన్లైన్ మీడియా ఛానెళ్లకు ఇచ్చిన బైట్లలో చెబుతున్నారు.
ఇక, జగన్ పర్యటించనున్న మార్గాల్లోని అన్ని దుకాణాలను కూడా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు మూసి వేయించారు. దీంతో నిర్మానుష్య వాతావరణం నెలకొంది. మరోవైపు.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జగన్ పర్యటనను అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నాయకులు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు.. వారికి ముందస్తు హెచ్చరికలు, నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు.. బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ ఏసురత్నం వంటివారికి నోటీసులు ఇచ్చారు.
కాగా.. గతంలో జగన్ పర్యటించినప్పుడు.. ఆ పార్టీ కార్యకర్త ఒకరు.. జగన్ కాన్వాయ్ కింద పడి మృతి చెందారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. దీనిపై విచారణ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే స్థానికులు భయం గుప్పిట్లో ఉన్నారన్నది సమాచారం. ఒక నాయకుడు పర్యటించడం ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, ఈ పర్యటనను ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా చేయడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది.
This post was last modified on February 4, 2026 3:39 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…