తెలంగాణలో బీఆర్ ఎస్ పార్టీ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారి స్తున్న విషయం తెలిసిందే. ఈ సిట్.. ఇప్పటికే చాలా మందిని విచారించింది. మరీ ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ను కూడా అధికారులు విచారించారు. అయితే.. సిట్ ఎప్పుడు ఎవరిని విచారణకు పిలిచినా.. వెంటనే వారు సిట్పై ఆరోపణలు చేయడం లేదా.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం కామన్గా మారింది.
అయితే.. తాజాగా బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, మాజీ సీఎం కేసీఆర్ తనయ కవిత మాత్రం.. సిట్ తనను కూడా విచారణకు పిలవాలని కోరుకున్నారు. సిట్ విచారణకు పిలిస్తే.. వెంటనే సహకరిస్తామని.. ఎంత సేపైనా విచారించుకోవచ్చని.. వాస్తవాలే చెబుతానని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన కవిత.. సిట్ ముందుకు వెళ్లిన కేసీఆర్… అన్నీ నిజాలే చెప్పి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు.
అయితే.. ఆయన ఏం చెప్పారో.. స్వయంగా ఆయన నోటి ద్వారానే ప్రజలకు కూడా చెప్పాలని కేసీఆర్ను కోరారు. గుంటనక్కల కుతంత్రాలకు కేసీఆర్ గురవుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. వారి మాయలో పడితే పార్టీ కూడా నాశనం అవుతుందన్నారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితురాలినేనని ఆమె చెప్పారు. తన భర్త ఫోన్ను కూడా ట్యాప్ చేశారని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. ఈ విషయాలన్నీ సిట్ తమను విచారణకు పిలిస్తే వెళ్లి వివరిస్తానని చెప్పారు.
సిట్ అధికారులు, విచారణపై మాజీ మంత్రి, తన సోదరుడు కేటీఆర్ విమర్శల చేయడం తగదని కవిత సూచించారు. చట్టాన్ని ఇప్పుడైనా ఆయన గౌరవించాలని చురకలు అంటిచారు. చట్ట ప్రకారమే అధికారులు ఈ విచారణ చేస్తున్నారని.. త్వరలోనే ఈ కేసు ముగింపు దశకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. అయితే.. గుంటనక్కలు కొందరు కాంగ్రెస్ నేతలతో కలిసి ఈ కేసు విచారణ పూర్తికాకుండా అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు.
This post was last modified on February 3, 2026 10:55 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…