బాలీవుడ్ హీరోయిన్లలో ప్రేమకథలు, బ్రేకప్లు లేని వాళ్లు అరుదుగా కనిపిస్తారు. అక్కడ పెద్దగా దాపరికాలు కూడా ఏమీ ఉండవు. ఎక్కువగా సినిమా వాళ్లతోనే రిలేషన్షిప్లోకి వెళ్లే హీరోయిన్లు.. వారితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుంటారు. కొందరు తమ లవ్ స్టోరీలను దాచినా.. ఆ ప్రేమాయణం ముగిశాక దాని గురించి ఓపెన్ అవుతుంటారు.
సీతారామంతో తెలుగువారి మనసు దోచిన మృణాల్ ఠాకూర్ కూడా ఇప్పుడు తన పాస్ట్ లవ్ స్టోరీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తనకు ఒక ప్రేమకథ ఉందని చెప్పిన మృణాల్.. అప్పటి తన బాయ్ఫ్రెండ్ఎవరు,. అతను సినీ రంగానికి చెందిన వ్యక్తా, మరొకరా అన్నది చెప్పలేదు. ఐతే తన బాయ్ఫ్రెండ్ తనను తట్టుకోలేక పారిపోయాడంటూ ఆమె కామెంట్ చేసింది.
”అతను పారిపోయాడు. నువ్వు మరీ దూకుడుగా ఉన్నావు. నేను నీతో డీల్ చేయలేను.. నువ్వు నటివి, నిన్ను నేను డీల్ చేయలేను అన్నట్లుగా కనిపించాడతను. అతను ఒక మంచి సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడు. కాబట్టి తనను నేను అర్థం చేసుకున్నాను. అతణ్ని నిందించలేదు. అతడి పెంపకం అలా సాగింది. కానీ మేం కలిసి ఉండి రేప్పొద్దున మాకు పిల్లలు పుడితే.. నా పెంపకం తనలా ఉండదు. అప్పుడు పిల్లలు.. ఏంటిది అనుకుంటారు. అందుకే మేం విడిపోవడం మా మంచికే జరిగిందని అనుకుంటా” అని మృణాల్ పేర్కొంది.
సీతారామం తర్వాత తెలుగులోనే కాక ఏ భాషలోనూ సరైన విజయాన్ని అందుకోలేకపోయిన మృణాల్.. ఈ నెల 20న రిలీజయ్యే బాలీవుడ్ మూవీ దో దీవానా సెహర్ హైతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రవి ఉద్యవర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మృణాల్కు జోడీగా సిద్ధాంత్ చతుర్వేది నటించాడు. తెలుగులో అడివి శేష్ సరసన మృణాల్ నటిస్తున్న డెకాయిట్ వచ్చే నెల 19న విడుదల కానుంది. దానిపై భారీ అంచనాలే ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా కథానాయికల్లోనూ మృణాల్ ఒకరు.
This post was last modified on February 3, 2026 9:12 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…