తెలుగు టీవీ చరిత్రలోనే ట్రెండ్ సెట్టింగ్ షోల్లో ఆట ఒకటి. అప్పటికే వేరే ఛానెళ్లలో కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాములు ఉన్నప్పటికీ. జీ తెలుగులో వచ్చిన ఈ డ్యాన్స్ షో సంచలనం రేపింది. చాలా ఏళ్ల పాటు అలరించిన ఈ షోకు మధ్యలో బ్రేక్ పడింది. ఓవైపు ఈటీవీలో ఢీ షో నిరాటంకంగా సాగిపోతుండగా.. ఆట మాత్రం ఆగిపోవడం దాని అభిమానులకు నిరాశ కలిగించింది.
ఐతే కొన్నేళ్ల విరామం తర్వాత ఆట షోను మళ్లీ జీ తెలుగులో పునఃప్రారంభిస్తుండడం విశేషం. ఈ వీకెండ్లోనే ఈ షో కొత్త సీజన్ ఆరంభం కాబోతోంది. మరి ఒకప్పుడు ఈ షోను నడిపించిన యాంకర్ ఓంకారే మళ్లీ దీన్ని హోస్ట్ చేయబోతున్నాడా.. వేరే యాంకర్లు తెరపైకి వస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ముందు కంటే గ్రాండ్గా ఈ షోను రన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త కాన్సెప్ట్లు ప్రవేశపెడతారట.
యాంకర్ ఓంకార్ తన ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ప్రొడ్యూస్ చేసిన ఈ షో అప్పట్లో భారీ టీఆర్పీలు తెచ్చుకుంది. సుందరం మాస్టర్ శివశంకర్ మాస్టర్ లాంటి లెజెండరీ డ్యాన్స్ మాస్టర్లు న్యాయ నిర్ణేతలుగా ఈ షోలకు ఎంతో ఆకర్షణ తీసుకొచ్చారు. ఓంకార్ తర్వాతి కాలంలో ఇంకెన్నో షోలు చేయడానికి, ఏకంగా దర్శకుడిగా మారి రాజు గారి గది లాంటి హిట్ సినిమాలు తీయడానికి పునాది వేసింది ఈ షోనే.
ఈ షోల ద్వారా ఎంతోమంది డ్యాన్సర్లకు పేరొచ్చింది. సినీ అవకాశాలు కూడా దక్కాయి. సంక్రాంతి సినిమా మన శంకర వరప్రసాద్ గారులో హుక్ స్టెప్తో గొప్ప పేరు సంపాదించిన సందీప్ సైతం ఈ షో నుంచి వచ్చినవాడే. ఆట అన్నది అతడి ఇంటి పేరుగా కూడా మారిపోయింది. కొత్త సీజన్లో టీవీ సెలబ్రెటీ సుడిగాలి సుధీర్ సందడి చేస్తాడని తెలుస్తోంది. అతడి రోల్ ఏంటన్నది తెలియదు. మరి మళ్లీ ఆట ఒకప్పటిలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
This post was last modified on February 3, 2026 8:50 am
ఆచితూచి సినిమాలు చేసే సాయిపల్లవి నెంబర్ల కోసం ఎప్పుడూ పాకులాడలేదు. వచ్చిన ఆఫర్లన్నీ ఒప్పేసుకుని ఎక్కువ సంపాదించాలనే యావ చూపించలేదు.…
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు టారిఫ్లు విధించిన సంగతి…
భారత్, పాకిస్థాన్ మధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. గత ఏడాది పహల్గాం దాడితో అవి మరింత క్షీణించాయి.…
నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే ఎవరో కర్ణాటక అవతల సినీ ప్రేక్షకులకు తెలియదు. దర్శకుడిగా, నటుడిగా అప్పటికే కొన్ని…
పదేళ్ల ముందు రిలీజైన సినిమా.. దంగల్. కానీ ఇప్పటికీ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీ రికార్డు ఆ సినిమా పేరు…
వైసీపీ అధినేత జగన్ రెండు రోజులపాటు పరామర్శ యాత్ర సిద్ధమవుతున్నారు. బుధవారం గుంటూరులో, శుక్రవారం ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు,…