మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ దాడిపై అంబటి రాంబాబు కూతురు మౌనిక మీడియాతో మాట్లాడారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని, దాడి సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని సంచలన ఆరోపణలు చేశారు. మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారా అని ప్రశ్నించారు.
కాపు మహిళలైన తమపై కూడా దాడులు చేశారని, లకారాలతో బండబూతులు తిడుతూ దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. తాను అన్నది చంద్రబాబును కాదని అంబటి రాంబాబు క్లియర్ గా చెప్పారని, గతంలో చంద్రబాబు కూడా జగన్ ను అనేక సార్లు అనరాని మాటలు అన్నారని చెప్పారు.
తాను అలా మాట్లాడినందుకు అంబటి రాంబాబు క్షమాపణ కూడా చెప్పారని గుర్తు చేశారు. 8 గంటలపాటు తమపై దాడి చేశారని, మహిళల క్షేమం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆయన బలాన్ని చూసుకునే వాళ్ళు ఇలాంటి దాడి చేశారని ఆరోపించారు.
తమ ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదని, టీడీపీ గూండాలను కంట్రోల్ చేస్తున్నట్టు పోలీసులు యాక్షన్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు.
తాగుబోతులను తమపైకి ఉసిగొల్పారని, ఆమెకు నైతిక విలువలున్నాయా అని ప్రశ్నించారు. ఇక, సినిమా చూపిస్తానని పెమ్మసాని అంటున్నారని, మహిళలపై ఇలా దాడులు చేయడమే సినిమా చూపించడమా అని ప్రశ్నించారు. దీనికి పెమ్మసాని భార్య సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
This post was last modified on February 2, 2026 7:03 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…