మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ దాడిపై అంబటి రాంబాబు కూతురు మౌనిక మీడియాతో మాట్లాడారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని, దాడి సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని సంచలన ఆరోపణలు చేశారు. మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారా అని ప్రశ్నించారు.
కాపు మహిళలైన తమపై కూడా దాడులు చేశారని, లకారాలతో బండబూతులు తిడుతూ దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. తాను అన్నది చంద్రబాబును కాదని అంబటి రాంబాబు క్లియర్ గా చెప్పారని, గతంలో చంద్రబాబు కూడా జగన్ ను అనేక సార్లు అనరాని మాటలు అన్నారని చెప్పారు.
తాను అలా మాట్లాడినందుకు అంబటి రాంబాబు క్షమాపణ కూడా చెప్పారని గుర్తు చేశారు. 8 గంటలపాటు తమపై దాడి చేశారని, మహిళల క్షేమం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆయన బలాన్ని చూసుకునే వాళ్ళు ఇలాంటి దాడి చేశారని ఆరోపించారు.
తమ ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదని, టీడీపీ గూండాలను కంట్రోల్ చేస్తున్నట్టు పోలీసులు యాక్షన్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు.
తాగుబోతులను తమపైకి ఉసిగొల్పారని, ఆమెకు నైతిక విలువలున్నాయా అని ప్రశ్నించారు. ఇక, సినిమా చూపిస్తానని పెమ్మసాని అంటున్నారని, మహిళలపై ఇలా దాడులు చేయడమే సినిమా చూపించడమా అని ప్రశ్నించారు. దీనికి పెమ్మసాని భార్య సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
This post was last modified on February 2, 2026 7:03 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…