మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ దాడిపై అంబటి రాంబాబు కూతురు మౌనిక మీడియాతో మాట్లాడారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని, దాడి సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని సంచలన ఆరోపణలు చేశారు. మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారా అని ప్రశ్నించారు.
కాపు మహిళలైన తమపై కూడా దాడులు చేశారని, లకారాలతో బండబూతులు తిడుతూ దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. తాను అన్నది చంద్రబాబును కాదని అంబటి రాంబాబు క్లియర్ గా చెప్పారని, గతంలో చంద్రబాబు కూడా జగన్ ను అనేక సార్లు అనరాని మాటలు అన్నారని చెప్పారు.
తాను అలా మాట్లాడినందుకు అంబటి రాంబాబు క్షమాపణ కూడా చెప్పారని గుర్తు చేశారు. 8 గంటలపాటు తమపై దాడి చేశారని, మహిళల క్షేమం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆయన బలాన్ని చూసుకునే వాళ్ళు ఇలాంటి దాడి చేశారని ఆరోపించారు.
తమ ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదని, టీడీపీ గూండాలను కంట్రోల్ చేస్తున్నట్టు పోలీసులు యాక్షన్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు.
తాగుబోతులను తమపైకి ఉసిగొల్పారని, ఆమెకు నైతిక విలువలున్నాయా అని ప్రశ్నించారు. ఇక, సినిమా చూపిస్తానని పెమ్మసాని అంటున్నారని, మహిళలపై ఇలా దాడులు చేయడమే సినిమా చూపించడమా అని ప్రశ్నించారు. దీనికి పెమ్మసాని భార్య సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
This post was last modified on February 2, 2026 7:03 pm
గత ఏడాది విడుదలైన 'తెలుసు కదా' అంచనాలు అందుకోలేక సిద్ధూ జొన్నలగడ్డ ఖాతాలో మరో డిజాస్టర్ వేసిన తెలిసిందే. న్యూ…
బహుశా ఇలాంటి వెరైటీ భారీ బాక్సాఫీస్ క్లాష్ గతంలో చూసి ఉండం. ఒక హిందీ మూవీతో తెలుగు సినిమా కాంపీట్…
బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇరు…
గిరిజన ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలపై జనసేన ఉక్కుపిడికిలి బిగిస్తోంది. ఇటీవల కాలంలో ఆయా నియోజకవర్గాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్…
బీఆర్ఎస్ నాయకుడు, మాటల తూటాలను తనదైన శైలిలో ఎటైనా తిప్పగల నేర్పరిగా పేరొందిన నేత.. అన్నింటికీ మించి `అందరివాడు`గా గుర్తింపు…
వెండితెరపై సినిమా చూసే అనుభూతి మారుతోంది. ఒకప్పుడు తెల్లని తెరలు కట్టి ప్రింట్లు ఎంత మసకగా ఉన్నా, లైన్లు కనిపించి…