మంత్రి నారా లోకేశ్ పై మాజీ మంత్రి జోగి రమేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేేపిన సంగతి తెలిసిందే. వాడు వీడు అంటూ లోకేశ్ ను ఏకవచనంతో సంబోధించడమే కాకుండా…లోకేశ్ కు కొవ్వు తగ్గలేదు, లోకేశ్ మెదడుకు చిప్ దొబ్బింది అంటూ అసభ్యకర పదజాలంతో లోకేశ్ ను జోగి విమర్శించారు. దీంతో, ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు జోగి రమేశ్ ఇంటికి నిప్పు పెట్టి..ఇంటిని ధ్వసం చేశాయి.
అయినా సరే జోగి తీరు మారలేదు. తానేం తప్పు మాట్లాడాను? తానేం రెచ్చగొట్టాను అంటూ మీడియా ప్రతినిధులను జోగి రమేశ్ అడగడం ఆశ్చర్యకరంగా ఉంది. తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను జోగి రమేశ్ సమర్థించుకున్నారు.
ఇక, జోగి రమేశ్ పారిపోడని, మళ్లీ అరెస్టుకు సిద్ధమని పోలీసులకు పరోక్షంగా సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే జోగి రమేశ్ కు నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు షాకిచ్చారు. ఈ కేసులో జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముల బెయిల్ రద్దు చేయాలని విజయవాడ ఎక్సైజ్ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది.
జోగి రమేష్ సోదరుల కండిషనల్ బెయిల్ రద్దు చేయాలని కోరింది. ఈ కేసులో జోగి బ్రదర్స్ కీలక నిందితులని, వారికి బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని ఆ పిటిషన్ లో సిట్ పేర్కొంది. ఆ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశముంది. తాజాగా లోకేశ్ పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జోగి రమేశ్ బెయిల్ రద్దయి ఆయన మళ్లీ జైలుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on February 2, 2026 6:40 pm
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…