మంత్రి నారా లోకేశ్ పై మాజీ మంత్రి జోగి రమేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేేపిన సంగతి తెలిసిందే. వాడు వీడు అంటూ లోకేశ్ ను ఏకవచనంతో సంబోధించడమే కాకుండా…లోకేశ్ కు కొవ్వు తగ్గలేదు, లోకేశ్ మెదడుకు చిప్ దొబ్బింది అంటూ అసభ్యకర పదజాలంతో లోకేశ్ ను జోగి విమర్శించారు. దీంతో, ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు జోగి రమేశ్ ఇంటికి నిప్పు పెట్టి..ఇంటిని ధ్వసం చేశాయి.
అయినా సరే జోగి తీరు మారలేదు. తానేం తప్పు మాట్లాడాను? తానేం రెచ్చగొట్టాను అంటూ మీడియా ప్రతినిధులను జోగి రమేశ్ అడగడం ఆశ్చర్యకరంగా ఉంది. తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను జోగి రమేశ్ సమర్థించుకున్నారు.
ఇక, జోగి రమేశ్ పారిపోడని, మళ్లీ అరెస్టుకు సిద్ధమని పోలీసులకు పరోక్షంగా సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే జోగి రమేశ్ కు నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు షాకిచ్చారు. ఈ కేసులో జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముల బెయిల్ రద్దు చేయాలని విజయవాడ ఎక్సైజ్ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది.
జోగి రమేష్ సోదరుల కండిషనల్ బెయిల్ రద్దు చేయాలని కోరింది. ఈ కేసులో జోగి బ్రదర్స్ కీలక నిందితులని, వారికి బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని ఆ పిటిషన్ లో సిట్ పేర్కొంది. ఆ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశముంది. తాజాగా లోకేశ్ పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జోగి రమేశ్ బెయిల్ రద్దయి ఆయన మళ్లీ జైలుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…