మంత్రి నారా లోకేశ్ పై మాజీ మంత్రి జోగి రమేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేేపిన సంగతి తెలిసిందే. వాడు వీడు అంటూ లోకేశ్ ను ఏకవచనంతో సంబోధించడమే కాకుండా…లోకేశ్ కు కొవ్వు తగ్గలేదు, లోకేశ్ మెదడుకు చిప్ దొబ్బింది అంటూ అసభ్యకర పదజాలంతో లోకేశ్ ను జోగి విమర్శించారు. దీంతో, ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు జోగి రమేశ్ ఇంటికి నిప్పు పెట్టి..ఇంటిని ధ్వసం చేశాయి.
అయినా సరే జోగి తీరు మారలేదు. తానేం తప్పు మాట్లాడాను? తానేం రెచ్చగొట్టాను అంటూ మీడియా ప్రతినిధులను జోగి రమేశ్ అడగడం ఆశ్చర్యకరంగా ఉంది. తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను జోగి రమేశ్ సమర్థించుకున్నారు.
ఇక, జోగి రమేశ్ పారిపోడని, మళ్లీ అరెస్టుకు సిద్ధమని పోలీసులకు పరోక్షంగా సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే జోగి రమేశ్ కు నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు షాకిచ్చారు. ఈ కేసులో జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముల బెయిల్ రద్దు చేయాలని విజయవాడ ఎక్సైజ్ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది.
జోగి రమేష్ సోదరుల కండిషనల్ బెయిల్ రద్దు చేయాలని కోరింది. ఈ కేసులో జోగి బ్రదర్స్ కీలక నిందితులని, వారికి బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని ఆ పిటిషన్ లో సిట్ పేర్కొంది. ఆ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశముంది. తాజాగా లోకేశ్ పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జోగి రమేశ్ బెయిల్ రద్దయి ఆయన మళ్లీ జైలుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on February 2, 2026 6:40 pm
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…