Political News

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన సీఎం చంద్ర‌బాబు.. ఇక్క‌డ టీచ‌ర్ల‌కు ఇస్తున్న శిక్ష‌ణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అంశాల‌పై మాట్లాడారు.

ఐటీ నుంచి పారిశ్రామికీక‌ర‌ణ వ‌ర‌కు ప‌లు విషయాల‌ను ప్ర‌స్తావించారు. ఏది ప్రారంభించినా ముందు.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే ప్రారంభిస్తున్న‌ట్టు చెప్పారు. అంతేకాదు.. కుప్పంలో జ‌రిగే ప్ర‌తి కార్య‌క్ర‌మాన్నీ తానే స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నాన‌న్నారు.

విద్యుత్ చార్జీల‌ను త‌గ్గిస్తున్న విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని.. వివిధ మార్గాల్లో విద్యుత్ ఉత్ప‌త్తిని పెంచుతున్నామ‌ని.. అందుకే విద్యుత్ చార్జీల‌ను త‌గ్గించ‌గ‌లుగుతున్నామ‌న్నారు. నేటి త‌రం యువ‌త‌, విద్యార్థులు సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవాల‌ని సూచించారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఐటీ, ఏఐలు వేగంగా విస్త‌రిస్తున్నాయ‌న్న ఆయ‌న‌.. దీనిని తాను 30 ఏళ్ల కింద‌టే ఊహించి.. ఉమ్మ‌డి రాష్ట్రంలో రెడ్ కార్పెట్ ప‌రిచాన‌న్నారు. వ‌చ్చే 20 ఏళ్ల త‌ర్వాత‌.. ప్ర‌పంచం పూర్తిగా మారిపోతుంద‌న్నారు. దీనిని కూడా ఇప్పుడే అంచ‌నా వేస్తున్న‌ట్టు తెలిపారు.

ఈ క్ర‌మంలోనే ఏఐకి అత్యంత ప్రాధాప‌న్యం ఇస్తున్నామ‌న్నారు. ఏఐ గురించి అందరూ ఆలోచన చేయాలని చంద్ర‌బాబు సూచించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఆవిష్క‌ర‌ణ వ‌చ్చినా.. అది కుప్పంలోనే ప్రారంభం అవుతుంద‌న్నారు.

దీనికి ర‌త‌న్ టాటా ఇన్నో వేష‌న్ హ‌బ్ స‌హ‌కారం ఉంటుంద‌న్నారు. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం అవుతుంద‌న్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను యువ‌త అందిపుచ్చుకోవాల‌ని సూచించారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలను సాధ్య‌మైనంత‌గా త‌గ్గించ గ‌ల‌గ‌డానికి కార‌ణం.. సాంకేతికతే కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించారు.  

Kumar

Recent Posts

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

23 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

2 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

7 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

11 hours ago