ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లోనే విచారించాలన్న కేసీఆర్ విజ్ ఒప్తిని ప్రత్యేక విచారణ బృందం (సిట్) అంగీకరించలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని గురువారమే సిట్ నోటీసులు ఇచ్చింది. దీనికి కేసీఆర్ వెంటనే స్పందించారు.
తాను మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో తలమునకలై ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కోరారు. అందుకు సిట్ సుముఖత వ్యక్తం చేసింది. అయితే తాజాగా కేసీఆర్ మరో విన్నపాన్ని సిట్ అధికారుల ముందు ఉంచారు. తనను ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లోనే విచారించాలని కోరారు. అందుకు నిరాకరించిన అధికారులు.. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఆయన్ని విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు 160 సీఆర్పీసీ కింద మరోసారి నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్ విచారణ జరగొచ్చని భావిస్తున్నారు. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్. ఇంకో ఐదేళ్ల తర్వాత రెండో పర్యాయం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వ ప్రోద్బలంతో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఫిలిం సెలబ్రెటీలు, ఇంకా వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. రెండేళ్ల కిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారం మీద ప్రత్యేకంగా దృష్టిసారించింది.
కేసీఆర్, కేటీఆర్ సహా అనేక మంది నాయకులు.. అప్పటి అధికారుల మీద కేసులు పెట్టింది. సుదీర్ఘ కాలంగా ఈ కేసు విచారణ జరుగుతోంది. అనేక మంది నాయకులు, అధికారులను సిట్ బృందం విచారించింది. ఇప్పుడు తొలిసారి కేసీఆర్ ఈ కేసులో విచారణకు హాజరు కాబోతున్నారు.
This post was last modified on January 30, 2026 10:03 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…