ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లోనే విచారించాలన్న కేసీఆర్ విజ్ ఒప్తిని ప్రత్యేక విచారణ బృందం (సిట్) అంగీకరించలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని గురువారమే సిట్ నోటీసులు ఇచ్చింది. దీనికి కేసీఆర్ వెంటనే స్పందించారు.
తాను మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో తలమునకలై ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కోరారు. అందుకు సిట్ సుముఖత వ్యక్తం చేసింది. అయితే తాజాగా కేసీఆర్ మరో విన్నపాన్ని సిట్ అధికారుల ముందు ఉంచారు. తనను ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లోనే విచారించాలని కోరారు. అందుకు నిరాకరించిన అధికారులు.. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఆయన్ని విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు 160 సీఆర్పీసీ కింద మరోసారి నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్ విచారణ జరగొచ్చని భావిస్తున్నారు. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్. ఇంకో ఐదేళ్ల తర్వాత రెండో పర్యాయం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వ ప్రోద్బలంతో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఫిలిం సెలబ్రెటీలు, ఇంకా వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. రెండేళ్ల కిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారం మీద ప్రత్యేకంగా దృష్టిసారించింది.
కేసీఆర్, కేటీఆర్ సహా అనేక మంది నాయకులు.. అప్పటి అధికారుల మీద కేసులు పెట్టింది. సుదీర్ఘ కాలంగా ఈ కేసు విచారణ జరుగుతోంది. అనేక మంది నాయకులు, అధికారులను సిట్ బృందం విచారించింది. ఇప్పుడు తొలిసారి కేసీఆర్ ఈ కేసులో విచారణకు హాజరు కాబోతున్నారు.
This post was last modified on January 30, 2026 10:03 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…