వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్ అధికారులు విచారణ జరిపారు. అయితే, ఆ లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదనని సీబీఐ తాజాగా చార్జి షీట్ దాఖలు చేసింది. అయితే, అసలు పాలతో తయారు చేసిన నెయ్యి కాకుండా కెమికల్స్ తో తయారైన నెయ్యి వాడారని కూడా అదే రిపోర్ట్ లో ఉంది. ఈ క్రమంలోనే లడ్డూ వ్యవహారంపై పవన్ తాజాగా స్పందించారు.
లడ్డూ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చిద్దామని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన ఎమ్మెల్యేలతో సమావేశం సందర్భంగా పవన్ ఈ కామెంట్లు చేశారు. గత పాలకులు రసాయనాలతో లడ్డూ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని పవన్ ఫైర్ అయ్యారు.
భక్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీసిన వైసీపీ నేతలు అరాచకాలను ప్రజలకు చెబుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా క్షేమమే ధ్యేయంగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని తన పార్టీ ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం చేశారు.
అయితే, జగన్ ను అసెంబ్లీకి రప్పించడానికి పవన్ ఈ తరహా కామెంట్లు చేసినట్లు కనిపిస్తోంది. ఎటూ జగన్ శాసన సభకు డుమ్మా కొడుతున్నారు కాబట్టి ఈ విషయంపై చర్చించేందుకైనా అసెంబ్లీకి వస్తారేమోనని పవన్ ఆ కామెంట్లు చేశారనిపిస్తోంది.
కెమికల్స్ వాడి లడ్డూ తయారు చేసిన వైనంపై జగన్ ను అసెంబ్లీలో పవన్ ఎండగట్టాలని ప్లాన్ చేసినట్లుంది. మరి, పవన్ వ్యాఖ్యలపై జగన్ స్పందించి సభలో ఆ విషయంపై చర్చకు వస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
This post was last modified on January 30, 2026 11:36 am
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో ఎంత తలనొప్పి ఎదురైందో…
టాలీవుడ్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నాని, విజయ్…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…
ఏపీ సీఎం చంద్రబాబు గత 2024లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత..…
బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…