వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్ అధికారులు విచారణ జరిపారు. అయితే, ఆ లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదనని సీబీఐ తాజాగా చార్జి షీట్ దాఖలు చేసింది. అయితే, అసలు పాలతో తయారు చేసిన నెయ్యి కాకుండా కెమికల్స్ తో తయారైన నెయ్యి వాడారని కూడా అదే రిపోర్ట్ లో ఉంది. ఈ క్రమంలోనే లడ్డూ వ్యవహారంపై పవన్ తాజాగా స్పందించారు.
లడ్డూ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చిద్దామని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన ఎమ్మెల్యేలతో సమావేశం సందర్భంగా పవన్ ఈ కామెంట్లు చేశారు. గత పాలకులు రసాయనాలతో లడ్డూ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని పవన్ ఫైర్ అయ్యారు.
భక్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీసిన వైసీపీ నేతలు అరాచకాలను ప్రజలకు చెబుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా క్షేమమే ధ్యేయంగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని తన పార్టీ ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం చేశారు.
అయితే, జగన్ ను అసెంబ్లీకి రప్పించడానికి పవన్ ఈ తరహా కామెంట్లు చేసినట్లు కనిపిస్తోంది. ఎటూ జగన్ శాసన సభకు డుమ్మా కొడుతున్నారు కాబట్టి ఈ విషయంపై చర్చించేందుకైనా అసెంబ్లీకి వస్తారేమోనని పవన్ ఆ కామెంట్లు చేశారనిపిస్తోంది.
కెమికల్స్ వాడి లడ్డూ తయారు చేసిన వైనంపై జగన్ ను అసెంబ్లీలో పవన్ ఎండగట్టాలని ప్లాన్ చేసినట్లుంది. మరి, పవన్ వ్యాఖ్యలపై జగన్ స్పందించి సభలో ఆ విషయంపై చర్చకు వస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
This post was last modified on January 30, 2026 11:36 am
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…