తాను మరో పాదయాత్ర చేయబోతున్నానని ఏపీ మాజీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి పాదయాత్రపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర సమయంలో ప్రతి 3 రోజులకు ఒక సారి ఏదో ఒక నియోజకవర్గంలో, మండలంలో బహిరంగ సభ పెడతానని, అందులో చంద్రబాబును కడిగేస్తానని అన్నారు.
చూస్తూ చూస్తూ కూటమి పాలనలో రెండేళ్లయిపోయిందని, కళ్లు మూసి తెరిచే లోపు ఇంకో 3 ఏళ్లు పూర్తవుతాయని తాడేపల్లిలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో జగన్ వ్యాఖ్యానించారు.
ఈ మూడేళ్లలో ఏడాదిన్నర ఓపిక పడితే చాలని, చివరి ఏడాదిన్నర తన పాదయాత్ర ఉంటుందని చెప్పారు. ఒకటిన్నర సంవత్సరం పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని, 150కి పైగా నియోజకవర్గాల్లో తిరుగుతానని అన్నారు.
ప్రజల ఉప్పెనను చూపిస్తూ, ప్రజా సమస్యలను లేవనెత్తి కూటమి పాలనను ఎండగడతామని అన్నారు. ప్రతి మూడు రోజులకు ఒకసారి సభ ఉంటుందని వెల్లడించారు.
అయితే, రెండోసారి కూడా జగన్ పాదయాత్రను నమ్ముకుంటున్నారు. కానీ, గత పాదయాత్ర నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు జనం కూడా జగన్ కు ఒక్క చాన్స్ ఇద్దామని ఫిక్సయ్యారు. కానీ, ఆల్రెడీ ఒకసారి జగన్ పాలనను చూసిన జనం…ఇంకో చాన్స్ ఇస్తారా అన్నది అనుమానమే.
వైఎస్సార్, చంద్రబాబు, జగన్, లోకేశ్…ఇలా అందరికీ పాదయాత్ర సెంటిమెంట్ ఒకసారి వర్కవుట్ అయింది. మరి, మరోసారి వర్కవుట్ అవుతుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ అయితే, రెండోసారి పాదయాత్ర చేసి అధికారం చేపట్టిన మొదటి నేతగా జగన్ నిలుస్తారు.
This post was last modified on January 28, 2026 8:54 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…