వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య.. ఉరఫ్ నానిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. గత 18 నెలల కాలంలో పేర్నిపై నమోదైన కేసుల్లో ఇది 6వది కావడం గమనార్హం. గతంలో బియ్యం అక్రమ నిల్వ, విక్రయాలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి.
తర్వాత.. పోలీసులపై దురుసుగా వ్యవహరించిన కేసులు రెండు ఉన్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరో కేసు నమోదైంది. ఈ క్రమంలో విచారణకు పిలిచే అవకాశం ఉంది.
ఏం జరిగింది..?
ఉమ్మడి కృష్నాజిల్లాలోని మచిలీపట్నంలోని ఇనకుదురు సర్కిల్లో ఇటీవల దివంగత వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి పేర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాజశేఖరరెడ్డి మృతి చెందితే.. విగ్రహాలు పెట్టారని.. ఆయన ప్రజలకు దేవుడని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేసి చనిపోయాడని అన్నారు. అందుకే ఇంటింటా కూడా ఆయన ఫొటోలు.. వీధి వీధికీ ఆయన విగ్రహాలు పెట్టారని తెలిపారు. ఇదే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లకు భవిష్యత్తులో ఎవరూ విగ్రహాలు కూడా పెట్టరని అన్నారు.
అంతేకాదు.. అసలు వారిని ఎవరూ తలుచుకోను కూడా తలుచుకోరని పేర్ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కూటమి పార్టీల్లో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై అప్పట్లోనే మచిలీపట్నం టీడీపీ నాయకుడు, జనసేన నాయకులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు.. మాజీ మంత్రి పేర్నిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఇనకుదురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పేర్నిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉంది. కాగా.. ఈ వ్యవహారంపై జనసేన నాయకులు స్పందిస్తూ.. పేర్ని లాంటి వారు సమాజానికి చీడ పురుగులని వ్యాఖ్యానించారు. మచిలీపట్నంలో ఉండే అర్హత కూడా పేర్నికి లేదన్నారు.
This post was last modified on January 28, 2026 7:40 am
దర్శకుడు గుణశేఖర్ అంటే మూవీ లవర్స్ కు వెంటనే గుర్తొచ్చే పేర్లు ఒక్కడు, చూడాలని ఉంది. భారీతనానికి కేరాఫ్ అడ్రెస్…
‘పుష్ప-2’ తర్వాత బన్నీ నుంచి వస్తుందనుకున్న సినిమా వేరు. అతను ఎంచుకున్న సినిమా వేరు. త్రివిక్రమ్తో కొన్నేళ్ల నుంచి ప్లానింగ్లో…
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను…
అడవుల మధ్యలో నుంచి పాములాగా మెలికలు తిరిగిన రోడ్డు మీదుగా వందల కోట్ల రూపాయల లోడ్ తో వెళుతున్న 2…
మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. పుణెలోని…
తెలుగు సినిమాపై బలమైన ముద్ర వేసిన రామ్ గోపాల్ వర్మ శిష్యుల్లో గుణశేఖర్ కూడా ఒకడు. తొలి చిత్రం ‘సొగసు…