Political News

అమెరికా నుంచి వచ్చేస్తున్నారు.. మంచిదేనా?

వృత్తి నిపుణులు, దేశంలో నైపుణ్య కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పడిన తర్వాత నైపుణ్య కేంద్రాలకు ప్రాధాన్యం పెరిగింది. తద్వారా వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకుని సమర్థవంతమైన ఉత్పత్తులకు అవకాశాలు కల్పించారు.

అయితే చిత్రంగా గత రెండు ఏళ్ల నుంచి వృత్తి నైపుణ్యం పొందుతున్న వారు విదేశాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు భారత్‌కు వృత్తి నిపుణుల కొరత వెంటాడుతోంది.

ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా అమెరికా నుంచి వృత్తి నిపుణులు తిరిగి భారత్‌కు వచ్చేస్తున్నారు. అమెరికాలో కఠినమైన వీసా నిబంధనలు, పెరిగిన వీసా ఫీజుల కారణంగా అక్కడ ఇమడలేని నిపుణులు భారత్ బాట పడుతున్నారు. ఇక్కడే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నారు. గత రెండు నెలల్లో 30 వేల మంది నిపుణులు తమ అర్హతలతో ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించినట్టు అసోచామ్ వెల్లడించింది. వీరి రాక మరింత పెరుగుతుందని కూడా తెలిపింది.

ఇదే విషయాన్ని లింక్‌డిన్ కూడా వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో భారత్‌కు తిరిగి వచ్చిన సాంకేతిక నిపుణుల సంఖ్య 40 శాతం పెరిగినట్టు తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా వలసలపై ఉక్కుపాదం మోపడంతో అక్కడ ఉండలేక నిపుణులు తిరిగి వస్తున్నట్టు లింక్‌డిన్ పేర్కొంది. హెచ్–1బీ వీసా నిబంధనలు, లక్ష డాలర్లకు పెరిగిన ఫీజు వంటి అంశాలు భారతీయులకు ఇబ్బందిగా మారినట్టు తెలిపింది.

మంచిదేనా?

అమెరికాను విడిచి భారత్‌కు వస్తున్న నిపుణుల సంఖ్య గణనీయంగా పెరగడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా స్వదేశీ కంపెనీల లావాదేవీలు మరింత పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో నాణ్యమైన ఉత్పత్తులకు భారత్ కేంద్రంగా మారుతుందని కూడా చెబుతున్నారు.

అయితే ఈ పరిణామంతో ఔత్సాహిక వృత్తి నిపుణులకు కొంతమేర ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. డిమాండ్ పెరగడంతో వేతనాలు, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.

This post was last modified on January 27, 2026 9:34 pm

Share
Show comments
Published by
Satya
Tags: USA

Recent Posts

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

7 minutes ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

1 hour ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

1 hour ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

4 hours ago

తమిళంలో అదరగొట్టిన చంద్రబాబు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…

4 hours ago

ధనుష్ కూడా ఇలా చేస్తే ఎలా?

పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్‌గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…

10 hours ago