తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ లను సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అయితే, రెండేళ్ల నుంచి ఈ కేసును కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని, ఎటూ తేల్చడం లేదని కేటీఆర్, హరీశ్ రావు విమర్శిస్తున్నారు.
సింగరేణి బొగ్గు టెండర్లలో అవకతవకలను కప్పిబుచ్చేందుకే ఈ సిట్ విచారణ పేరుతో తమను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో బీఆర్ఎస్ నేతకు సిట్ అధికారులు నోటీసులిచ్చారు.
బీఆర్ఎస్ మాజీ ఎంపీ, కేసీఆర్ బంధువు, కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన సంతోష్ రావుకు సిట్ అధికారులు సీఆర్పీసీ 160 కింద నోటీసులిచ్చిన వైనం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సిట్ నోటీసులపై సంతోష్ రావు స్పందించారు. రేపు సిట్ విచారణకు హాజరై పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పారు.
కాగా, బీఆర్ఎస్ హయాంలో డీఐజీ హోదాలో ఉన్న టీ.ప్రభాకర రావును 2016లో ఎస్ఐబీ చీఫ్ గా కావాలనే నియమించారని సిట్ ఆరోపిస్తోంది. ఈ కేసులో ప్రభాకర్ రావు ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే.
రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని, రేవంత్ రెడ్డి చూపిన బాటలోనే తాము కూడా పయనిస్తామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు నడుచుకునే అధికారులను వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.
This post was last modified on January 26, 2026 7:15 pm
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…