Political News

‘ఈసారి తెలంగాణలో వచ్చేది జాగృతి ప్రభుత్వమే’

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తన సోదరుడు కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలపై, సీఎం రేవంత్ రెడ్డిపై కవిత కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో కవిత చేరతారని ప్రచారం జరుగుతున్నా…అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అని, కానీ, తాను వ్యతిరేకిస్తున్నానని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేసినట్టు తిరిగిన వార్తలు డిబేట్ కు దారి తీసాయి.

ఈ క్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్ కు కవిత కౌంటరిచ్చారు. ఓ చిట్ చాట్ సందర్భంగా తాను కాంగ్రెస్ లోకి వస్తానంటే మహేష్ కుమార్ వద్దన్నారని ప్రచారం జరుగుతోందని, దానిని ఖండించారు. తాను కాంగ్రెస్‌లో చేరనని, అసలు ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదని కవిత జోస్యం చెప్పారు.

అంతేకాదు, మహేష్ అన్న జాగృతి పార్టీలో చేరాలని, భవిష్యత్తులో తాను స్థాపించే పార్టీనే అధికారంలోకి వస్తుందని అన్నారు. మహేష్ గౌడ్‌ కు జాతీయ కన్వీనర్ గా తన పార్టీలో కీలక పదవి ఇస్తానని కవిత చెప్పారు. తన పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతేగానీ, తనను బద్నాం చేయొద్దని కోరారు. ఒకవేళ తాను కాంగ్రెస్ లోకి వస్తానని మహేషన్నకు కల వచ్చిందేమోనని, ఎవరికైనా చూపించుకోవాలని సెటైర్లు వేశారు. తన కొత్త పార్టీకి సంబంధించి కమిటీల నియామకం వంటి ప్రక్రియలో బాగా బిజీగా ఉన్నామని, పకడ్బందీగా పార్టీని సెట్ చేసుకునే పనిలో ఉన్నామని చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ముందడుగు వేస్తామని, అప్పటి వరకు ఇటువంటి ప్రకటనలు, ప్రయత్నాలు చేయొద్దని కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు.

This post was last modified on January 25, 2026 4:14 pm

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

49 minutes ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

1 hour ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

3 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

3 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

3 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

3 hours ago