Political News

అమరావతిపై పార్లమెంట్‌లో జగన్‌ వ్యూహం ఏంటి?

మరో ఆరు రోజుల్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలకంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత అంశం ముందుకు రానుంది. అమరావతిని రాజధానిగా ప్రకటించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. కూటమి ప్రభుత్వానికి ఇది రాజకీయంగా కీలక మైలురాయిగా మారనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ వైఖరి ఏంటన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఈ రోజు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీలతో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత వంటి అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అమరావతి అంశంపై జగన్‌ ఎలాంటి సూచనలు ఇస్తారన్నది మాత్రం ఉత్కంఠగా మారింది.

అమరావతి రాజధాని నిర్మాణంపై జగన్‌ మొదటి నుంచీ వ్యతిరేక వైఖరినే అవలంబించారు. ఇప్పుడు అదే అంశంపై చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంట్‌ ముందుకు రానున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలు దాన్ని అడ్డుకుంటారా? లేక పార్లమెంట్‌ సాక్షిగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారా అన్నది చూడాల్సి ఉంది. రాజ్యాంగంలో ‘రాజధాని’ అనే పదమే లేదని, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధానిగా గతంలో వైసీపీ వాదించిన సంగతి తెలిసిందే. ఈ వాదననే మళ్లీ పార్లమెంట్‌లో వినిపిస్తారా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.

అమరావతిని ఐదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిన వైసీపీ పాపం వల్లే ఇప్పుడు చట్టబద్ధత అవసరం వచ్చిందని టీడీపీ విమర్శిస్తోంది. సాధారణంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు వైసీపీ పార్లమెంట్‌లో బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తోంది. అమరావతి విషయంలో కూడా అదే ధోరణి కొనసాగుతుందా? లేక వ్యతిరేక వైఖరి తీసుకుంటుందా అన్నది రాజకీయంగా కీలకం కానుంది. స్పష్టమైన వైఖరి తీసుకోకుండా మధ్యస్థంగా ఉంటే అది వైసీపీకి మరింత నష్టం చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on January 22, 2026 11:09 am

Share

Recent Posts

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

2 minutes ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

2 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

3 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

4 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

4 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

4 hours ago