Political News

అమరావతిపై పార్లమెంట్‌లో జగన్‌ వ్యూహం ఏంటి?

మరో ఆరు రోజుల్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలకంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత అంశం ముందుకు రానుంది. అమరావతిని రాజధానిగా ప్రకటించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. కూటమి ప్రభుత్వానికి ఇది రాజకీయంగా కీలక మైలురాయిగా మారనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ వైఖరి ఏంటన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఈ రోజు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీలతో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత వంటి అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అమరావతి అంశంపై జగన్‌ ఎలాంటి సూచనలు ఇస్తారన్నది మాత్రం ఉత్కంఠగా మారింది.

అమరావతి రాజధాని నిర్మాణంపై జగన్‌ మొదటి నుంచీ వ్యతిరేక వైఖరినే అవలంబించారు. ఇప్పుడు అదే అంశంపై చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంట్‌ ముందుకు రానున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలు దాన్ని అడ్డుకుంటారా? లేక పార్లమెంట్‌ సాక్షిగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారా అన్నది చూడాల్సి ఉంది. రాజ్యాంగంలో ‘రాజధాని’ అనే పదమే లేదని, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధానిగా గతంలో వైసీపీ వాదించిన సంగతి తెలిసిందే. ఈ వాదననే మళ్లీ పార్లమెంట్‌లో వినిపిస్తారా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.

అమరావతిని ఐదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిన వైసీపీ పాపం వల్లే ఇప్పుడు చట్టబద్ధత అవసరం వచ్చిందని టీడీపీ విమర్శిస్తోంది. సాధారణంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు వైసీపీ పార్లమెంట్‌లో బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తోంది. అమరావతి విషయంలో కూడా అదే ధోరణి కొనసాగుతుందా? లేక వ్యతిరేక వైఖరి తీసుకుంటుందా అన్నది రాజకీయంగా కీలకం కానుంది. స్పష్టమైన వైఖరి తీసుకోకుండా మధ్యస్థంగా ఉంటే అది వైసీపీకి మరింత నష్టం చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on January 22, 2026 11:09 am

Share

Recent Posts

స్పైడర్ మ్యాన్ సక్సెస్… ఏ పాఠం నేర్చుకోవాలి

సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…

43 minutes ago

టాక్సిక్ ట్రైలర్ మీద కోట్ల కళ్లున్నాయి

కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…

1 hour ago

ఎదిగే స్టేజిలో అలాంటి ఆలోచనలే రిస్కు

హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…

2 hours ago

సందీప్ కిషన్ మూవీకి టెన్షన్ లేదు

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…

3 hours ago

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

4 hours ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

6 hours ago