టైం వస్తే ఆంధ్రోళ్ల విగ్రహాలు తీయొచ్చన్న కవిత

తన సోదరుడు కేటీఆర్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. సికింద్రాబాద్ ను ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గా చేయాలని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేటీఆర్ కు కవిత కౌంటర్ ఇచ్చారు.

కేటీఆర్ గారు వచ్చి సికింద్రాబాద్ ను ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్.. జిల్లా చేయాలని మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కేటీఆర్ ఈ రోజు ఈ మాట అనడం హాస్యాస్పదమని అన్నారు.

ఇక, ట్యాంక్ బండ్ పై ఆంధ్రావాళ్ళ విగ్రహాలు తీసేయాలంటూ చాలాకాలంగా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ వ్యవహారంపై కూడా కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్యాంక్ బండ్ పై ఆంధ్రవాళ్ల విగ్రహాలు తీసివేయాలని తాను చెప్పడం లేదని, కానీ సమయం వచ్చినప్పుడు ఆ పని చేయవచ్చని కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు పెట్టాలని, తెలంగాణకు చెందిన మహనీయుల విగ్రహాలు అక్కడ ఉండాలని అన్నారు.

ఇక, ఫోన్ ట్యాపింగ్ విచారణ నేపథ్యంలో హరీశ్ రావు సిట్ విచారణకు హాజరైన విషయంపై కూడా కవిత పరోక్షంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గుంపు మేస్త్రి గారు, గుంటనక్క గారు కలిసి ఆడుతున్న నాటకం అని పరోక్షంగా రేవంత్ రెడ్డిని, హరీశ్ రావును ఉద్దేశించి చురకలంటించారు.

ఆ విచారణ వల్ల తనవంటి బాధితులకు న్యాయం జరగదని కవిత అన్నారు. ట్యాంక్ బండ్ పై ఆంధ్రావాళ్ల విగ్రహాలు తీసేయాలని కవిత చేసిన కామెంట్లపై ఆంధ్రా నాయకుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే, కవిత వ్యాఖ్యలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదే ట్యాంక్ బండ్ పై ఆంధ్రా నాయకుల విగ్రహాలు తీసేయకుండా తెలంగాణ నాయకుల విగ్రహాలు కూడా పెట్టవచ్చని అంటున్నారు. మనసుంటే మార్గం ఉంటుందని, ఎన్నో ఏళ్లుగా ఉంటున్న విగ్రహాలు తీసి విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని చెబుతున్నారు.

Share
Show comments
Published by
Kumar
Tags: Kavitha

Recent Posts

విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…

56 minutes ago

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

7 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

8 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

9 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

10 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

11 hours ago