ఎస్! నిజమే. ఇప్పటి వరకు దాగుడుమూతలుగా ఉన్న ఈ కీలక కేసులో రెండు వారాల్లో కీలక నిర్ణయం వెలుగు చూడనుంది. వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసు విచారణ అనేక మలుపుల తర్వాత.. సీబీఐ చేపట్టింది. అయితే.. విచారణ పూర్తయినట్టుగా కొన్నాళ్ల కిందటే సిబీఐ కోర్టు.. తెలంగాణ హైకోర్టుకు విన్నవించింది.
కానీ, తమకు అనుమానాలు ఉన్న వ్యక్తులను విచారించకుండానే.. కేసు విచారణ ఎలా పూర్తి చేస్తారంటూ.. వివేకానందరెడ్డి కుమార్తె సునీత మళ్లీ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లో ప్రధానంగా వైసీపీ అధినేత జగన్, ఆయన సతీమణి భారతిలను పేర్కొన్నారు. వివేకా మృతి చెందిన రోజు వారికి మాత్రమే ఫోన్లు ఎందుకు వచ్చాయని.. అది కూడా ముందే వారికి ఎలా తెలిసిందని దీనిపై విచారణ చేయాలని సునీత కోరుతున్నారు.
దీనిని పక్కన పెట్టిన సీబీఐ కోర్టు.. ఇతర విషయాలు విచారించాలని కోరింది. బంధువులు అన్నాక.. ఫోన్లు రాకుండా ఉంటాయా? ఎవరికి ముందు తెలిస్తే..ఏంటి? అని కోర్టు అప్పట్లో వ్యాఖ్యానించింది. దీంతో సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మంగళవారం ఈ పిటిషన్పై విచారణ జరిగింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. వివేకా హత్య కేసులో ఎవరినైనా విచారించాల్సింది ఉందా? అంటూ.. సీబీఐని ప్రశ్నించింది.
అంతేకాదు.. సునీత చెబుతున్న విషయంపై మీకు క్లారిటీ ఉందా అని సీబీఐ అధికారులను కోరింది. విచారణ మరోసారి చేయాలని అనుకుంటే.. ఎవరినైనా కస్టడీలోకి తీసుకుని విచారించాలని అనుకుంటే చెప్పాలని.. దానికి తాము సంపూర్ణంగా సహకరిస్తామని కూడా కోర్టు స్పష్టం చేసింది.
అయితే.. దీనిపై స్పందించిన సీబీఐ.. రెండు వారాల్లో అన్ని వివరాలను కోర్టుకు చెబుతామని తెలిపింది. సో.. రెండు వారాల్లో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇతరులను విచారించాలా..? లేక.. ఇక్కడతో ముగించాలా? అనేది సీబీఐ తేల్చనుంది.
This post was last modified on January 20, 2026 6:31 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…