ఎస్! నిజమే. ఇప్పటి వరకు దాగుడుమూతలుగా ఉన్న ఈ కీలక కేసులో రెండు వారాల్లో కీలక నిర్ణయం వెలుగు చూడనుంది. వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసు విచారణ అనేక మలుపుల తర్వాత.. సీబీఐ చేపట్టింది. అయితే.. విచారణ పూర్తయినట్టుగా కొన్నాళ్ల కిందటే సిబీఐ కోర్టు.. తెలంగాణ హైకోర్టుకు విన్నవించింది.
కానీ, తమకు అనుమానాలు ఉన్న వ్యక్తులను విచారించకుండానే.. కేసు విచారణ ఎలా పూర్తి చేస్తారంటూ.. వివేకానందరెడ్డి కుమార్తె సునీత మళ్లీ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లో ప్రధానంగా వైసీపీ అధినేత జగన్, ఆయన సతీమణి భారతిలను పేర్కొన్నారు. వివేకా మృతి చెందిన రోజు వారికి మాత్రమే ఫోన్లు ఎందుకు వచ్చాయని.. అది కూడా ముందే వారికి ఎలా తెలిసిందని దీనిపై విచారణ చేయాలని సునీత కోరుతున్నారు.
దీనిని పక్కన పెట్టిన సీబీఐ కోర్టు.. ఇతర విషయాలు విచారించాలని కోరింది. బంధువులు అన్నాక.. ఫోన్లు రాకుండా ఉంటాయా? ఎవరికి ముందు తెలిస్తే..ఏంటి? అని కోర్టు అప్పట్లో వ్యాఖ్యానించింది. దీంతో సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మంగళవారం ఈ పిటిషన్పై విచారణ జరిగింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. వివేకా హత్య కేసులో ఎవరినైనా విచారించాల్సింది ఉందా? అంటూ.. సీబీఐని ప్రశ్నించింది.
అంతేకాదు.. సునీత చెబుతున్న విషయంపై మీకు క్లారిటీ ఉందా అని సీబీఐ అధికారులను కోరింది. విచారణ మరోసారి చేయాలని అనుకుంటే.. ఎవరినైనా కస్టడీలోకి తీసుకుని విచారించాలని అనుకుంటే చెప్పాలని.. దానికి తాము సంపూర్ణంగా సహకరిస్తామని కూడా కోర్టు స్పష్టం చేసింది.
అయితే.. దీనిపై స్పందించిన సీబీఐ.. రెండు వారాల్లో అన్ని వివరాలను కోర్టుకు చెబుతామని తెలిపింది. సో.. రెండు వారాల్లో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇతరులను విచారించాలా..? లేక.. ఇక్కడతో ముగించాలా? అనేది సీబీఐ తేల్చనుంది.
This post was last modified on January 20, 2026 6:31 pm
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…