“ఆయనే నా బాస్. పార్టీలో నేను ఆయన కింద పనిచేస్తాను.“ అంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్కు చెందిన నితన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారికంగా బీజేపీ ఈ ప్రకటన చేసింది. అనంతరం.. నితిన్.. ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లి.. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ నితిన్ను అభినందించారు.
ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ.. తన బాస్.. నితిన్ నబీనేనని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ అగ్రనాయకులు.. చప్పట్లతో అభినందనలు తెలిపారు. తాను సాధారణ బీజేపీ కార్యకర్తనేనని.. ఇక నుంచి నితిన్ ఆధ్వర్యంలోనే తాను రాజకీయంగా అడుగులు వేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, బీజేపీ గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్పై పరోక్షంగా చురకలు అంటించారు.
బీజేపీ విధానాలు ప్రజాస్వామ్య యుతంగా ఉంటాయని.. ఎక్కడా ఎవరి పెత్తనమూ ఉండదని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ ఎంపిక.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువుటద్దమని మోడీ అన్నారు. ఒక చిన్న, సాధారణ స్థాయి కార్యకర్త కూడా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు కావడం.. బీజేపీకే సొంతమని తెలిపారు. ఇది మరో పార్టీలో మనకు కనిపించదన్నారు. కులాలు.. మతాలకు అతీతంగా.. రాజకీయ వారసత్వానికి కూడా వ్యతిరేకంగా ఈ ఎంపిక జరిగిందన్నారు.
కాగా.. 45 ఏళ్ల నితిన్.. ప్రస్తుతం బీహార్ మంత్రిగా ఉన్నారు. మూడు సార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యా రు. అంతేకాదు.. బీహార్ నుంచి తొలిసారి.. బీజేపీ పగ్గాలు చేపట్టిన నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.
పిన్నవయసులోనే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరో రికార్డు ను కూడా సొంతం చేసుకున్నారు. అయితే.. ఈయన కూడా వారసత్వంగానే రాజకీయాల్లోకి రావడం గమనార్హం. ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే. ఆయన మరణానంతరం.. నితిన్ రాజకీయాల్లోకి వచ్చారు.
This post was last modified on January 20, 2026 6:17 pm
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…