“ఆయనే నా బాస్. పార్టీలో నేను ఆయన కింద పనిచేస్తాను.“ అంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్కు చెందిన నితన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారికంగా బీజేపీ ఈ ప్రకటన చేసింది. అనంతరం.. నితిన్.. ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లి.. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ నితిన్ను అభినందించారు.
ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ.. తన బాస్.. నితిన్ నబీనేనని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ అగ్రనాయకులు.. చప్పట్లతో అభినందనలు తెలిపారు. తాను సాధారణ బీజేపీ కార్యకర్తనేనని.. ఇక నుంచి నితిన్ ఆధ్వర్యంలోనే తాను రాజకీయంగా అడుగులు వేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, బీజేపీ గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్పై పరోక్షంగా చురకలు అంటించారు.
బీజేపీ విధానాలు ప్రజాస్వామ్య యుతంగా ఉంటాయని.. ఎక్కడా ఎవరి పెత్తనమూ ఉండదని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ ఎంపిక.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువుటద్దమని మోడీ అన్నారు. ఒక చిన్న, సాధారణ స్థాయి కార్యకర్త కూడా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు కావడం.. బీజేపీకే సొంతమని తెలిపారు. ఇది మరో పార్టీలో మనకు కనిపించదన్నారు. కులాలు.. మతాలకు అతీతంగా.. రాజకీయ వారసత్వానికి కూడా వ్యతిరేకంగా ఈ ఎంపిక జరిగిందన్నారు.
కాగా.. 45 ఏళ్ల నితిన్.. ప్రస్తుతం బీహార్ మంత్రిగా ఉన్నారు. మూడు సార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యా రు. అంతేకాదు.. బీహార్ నుంచి తొలిసారి.. బీజేపీ పగ్గాలు చేపట్టిన నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.
పిన్నవయసులోనే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరో రికార్డు ను కూడా సొంతం చేసుకున్నారు. అయితే.. ఈయన కూడా వారసత్వంగానే రాజకీయాల్లోకి రావడం గమనార్హం. ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే. ఆయన మరణానంతరం.. నితిన్ రాజకీయాల్లోకి వచ్చారు.
This post was last modified on January 20, 2026 6:17 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…