ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత ఉద్ధృతం చేసింది. ఇప్పటికే వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ, తాజాగా ఆ పార్టీ ఎంపీ మిథున్రెడ్డికీ నోటీసులు పంపింది.
ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అంతకుముందు 22న విజయసాయిరెడ్డి విచారణకు రావాలని కోరిన ఈడీ, వరుసగా మిథున్రెడ్డిని పిలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ పాలనలో లిక్కర్ విధాన రూపకల్పన, అమలులో విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి కీలకంగా వ్యవహరించాలని దర్యాప్తు వర్గాలు ఆరోపిస్తున్నాయి.
లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి ఏ5 నిందితుడిగా ఉన్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు సహకరిస్తున్న కారణంగా ఆయనను అరెస్టు చేయలేదని తెలుస్తోంది. మరోవైపు, మిథున్రెడ్డి మాత్రం సిట్ విచారణలో కీలక నిందితుడిగా మారారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఉపశమనం లభించక, ఆయనను సిట్ అరెస్టు చేసింది.
అనంతరం ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. 2025లో వెలుగుచూసిన ఈ కుంభకోణంలో మిథున్రెడ్డి పాత్ర, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని సిట్ ఆరోపించింది. అధికారులను ప్రభావితం చేయడం, కీలక సమావేశాల్లో పాల్గొనడం, రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం అయ్యారన్న అభియోగాలు నమోదు చేసింది.
లిక్కర్ స్కాం డబ్బుల మనీలాండరింగ్లో మిథున్రెడ్డి కీలక పాత్ర పోషించారన్న అంశంపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. స్కాం డబ్బుల సేకరణ, వాటి రూటింగ్, పైస్థాయికి లెక్కలు చేరవేయడంలో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణలను ఈడీ విచారణలో వెలికితీయనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు, వరుసగా ఇద్దరు కీలక నేతలను విచారణకు పిలవడంతో లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు మరింత వేడెక్కిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on January 19, 2026 10:52 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…