Political News

నిన్న విజయ సాయి రెడ్డి… ఈరోజు మిథున్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత ఉద్ధృతం చేసింది. ఇప్పటికే వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ, తాజాగా ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డికీ నోటీసులు పంపింది.

ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అంతకుముందు 22న విజయసాయిరెడ్డి విచారణకు రావాలని కోరిన ఈడీ, వరుసగా మిథున్‌రెడ్డిని పిలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ పాలనలో లిక్కర్ విధాన రూపకల్పన, అమలులో విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి కీలకంగా వ్యవహరించాలని దర్యాప్తు వర్గాలు ఆరోపిస్తున్నాయి. 

లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి ఏ5 నిందితుడిగా ఉన్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు సహకరిస్తున్న కారణంగా ఆయనను అరెస్టు చేయలేదని తెలుస్తోంది. మరోవైపు, మిథున్‌రెడ్డి మాత్రం సిట్ విచారణలో కీలక నిందితుడిగా మారారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఉపశమనం లభించక, ఆయనను సిట్ అరెస్టు చేసింది.

అనంతరం ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. 2025లో వెలుగుచూసిన ఈ కుంభకోణంలో మిథున్‌రెడ్డి పాత్ర, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని సిట్ ఆరోపించింది. అధికారులను ప్రభావితం చేయడం, కీలక సమావేశాల్లో పాల్గొనడం, రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం అయ్యారన్న అభియోగాలు నమోదు చేసింది.

లిక్కర్ స్కాం డబ్బుల మనీలాండరింగ్‌లో మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషించారన్న అంశంపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. స్కాం డబ్బుల సేకరణ, వాటి రూటింగ్, పైస్థాయికి లెక్కలు చేరవేయడంలో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణలను ఈడీ విచారణలో వెలికితీయనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు, వరుసగా ఇద్దరు కీలక నేతలను విచారణకు పిలవడంతో లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు మరింత వేడెక్కిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on January 19, 2026 10:52 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

1 hour ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

6 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

6 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

7 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

7 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

8 hours ago