Political News

కేసీఆర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక, కేసీఆర్ చావును రేవంత్ కోరుకుంటున్నారని, పదే పదే ఆ తరహా విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు కూడా విమర్శించారు.

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నడుము విరిగి కింద పడ్డారని, ఆయన తనకు శత్రువేంటి అని ప్రశ్నించారు రేవంత్.

ఫాం హౌస్ లో కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని, ఆయన లేచి నిలబడ్డప్పుడు కదా తాను మాట్లాడేది అని అన్నారు. తనకు శత్రువులెవరూ లేరని చెప్పారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు కూడా కాలేదని, దిగిపో అంటూ తనను డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు.

అయితే, దిగిపోమని చెప్పడానికి ఇదేమన్నా నీ అయ్య జాగీరా, నీ తాత ఆస్తా అని రేవంత్ ప్రశ్నించారు. నాలుగున్నర కోట్ల ప్రజలు గెలిపిస్తే ఇక్కడకి వచ్చానని అన్నారు. పాలమూరోళ్లంటే కేసీఆర్ కు చిన్నచూపని, తమ మంచితనాన్ని చేతగానితనం అనుకోవద్దని హెచ్చరించారు.

ఇక, బతుకమ్మ చీరల్లోనూ బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకున్నారని రేవంత్ ఆరోపించారు. పదేళ్లలో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని ఎద్దేవా చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని, తొలి ఏడాదిలోనే తాము 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని చెప్పారు.

ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ కు చేతనైతే ఆశీర్వదించాలని, లేదంటే ఫాం హౌస్ లో కూర్చోవాలని చురకలంటించారు. అలాకాకుండా మారువేషాలలో మారీచులను పంపితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

This post was last modified on January 17, 2026 10:04 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కార్తీ ఎందుకు వెనుకబడాల్సి వచ్చింది

కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఇటీవలే తమిళంలో విడుదలయ్యింది. జన నాయకుడు వాయిదాని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఆఘమేఘాల…

6 minutes ago

రామ్ చరణ్ అదిరిపోయాడు కదూ

రామ్ చరణ్ తాజా జిమ్ లుక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పూర్తిగా వర్కౌట్…

20 minutes ago

అమ‌రావతిపై సుజ‌నా మంత్రాంగం… !

రాజధాని అమ‌రావ‌తి విష‌యంలో రెండో ద‌శ భూ స‌మీక‌ర‌ణ వ్య‌వ‌హారం ఒకింత ఇబ్బందిగా మారింది. కొంద‌రు గ‌తంలో భూములు ఇచ్చిన…

25 minutes ago

సంగారెడ్డికి జగ్గారెడ్డి గుడ్ బై!

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు…

4 hours ago

ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించారు

తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు సింగిల్ స్క్రీన్ల మనుగడే ప్రమాదంలో పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేరున్న ఒక్కో సింగిల్ స్క్రీన్ మూత…

6 hours ago

చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి కొలువు

కృష్ణా జలాల పంపకం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.…

6 hours ago