సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. క్షేత్ర స్థాయి పర్యటనల్లో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు సమ ప్రాధాన్యమిస్తూ.. రోజుల వ్యవధిలో పరిష్కరించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు.
గత నెలలో ఇప్పటం గ్రామ సందర్శన సందర్భంగా మార్గమధ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకం అయ్యారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ క్రమంలో వడ్డేశ్వరం యానాదుల కాలనీకి చెందిన నిర్మలమ్మ, సాంబయ్యలు తమ కాలనీకి విద్యుత్ సదుపాయం లేదన్న విషయాన్ని ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, సమస్య వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అందుకు అనుగుణంగా విద్యుత్ సిబ్బంది 260 మీటర్ల మేర 8 కొత్త స్తంభాలు వేసి, యుద్ధప్రాతిపదికన వైర్లు లాగి యానాదుల కాలనీలోని నివాస గృహాలకు విద్యుత్ సదుపాయం కల్పించారు. 15 రోజుల్లోనే నిర్మలమ్మ ఇంటితోపాటు కాలనీలోని మిగిలిన గృహాలకు సహా విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు.
అడిగిన వెంటనే స్పందించి విద్యుత్ సదుపాయం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు యానాది కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. యానాది కాలనీవాసుల సమస్యను పరిష్కరించిన జిల్లా అధికారులను, విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ సిబ్బందినీ ఉప ముఖ్యమంత్రి అభినందించారు.
This post was last modified on January 12, 2026 8:24 pm
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…