Political News

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు చేస్తోందని ఆరోపించారు. ఇటీవల కాలంలో తిరుమల, ఇతర దేవాలయాలకు సంబంధించిన ఘటనలు తరచూ వివాదాస్పదంగా మారాయి. గతంలో పరకామణి చోరీ, లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలు, తాజాగా మద్యం బాటిళ్ల వ్యవహారం వంటి అంశాలు భక్తుల్లో ఆందోళనను కలిగించాయి.

ఇవన్నీ సహజ సంఘటనలేనా? లేక రాజకీయ లెక్కలతో సాగుతున్న కుట్రలేనా? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపధ్యంలో హిందూ మతంపై వైసీపీ దాడి చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో దేవాలయాలపై దాడులను ప్రేరేపించడమే కాకుండా, వాటిపై చులకన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పరకామణి చోరీ ఘటనను కూడా చిన్నపాటి దొంగతనంగా అభివర్ణించడమే జగన్‌ హిందూ మతంపై ఉన్న దృష్టిని స్పష్టంగా చూపుతోందని పలువురు మంత్రులు అన్నారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం వచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు, ఆఫీస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ రాజకీయ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అమరావతి రాజధానిపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.

నదీ తీరానికి, నదీ పరీవాహక ప్రాంతానికి మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి రాజధానిపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సింధు నాగరికత ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకుంటే అమరావతిపై ఈ స్థాయి వ్యాఖ్యలు చేసేవారు కాదని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా నదుల వెంబడి నాగరికతలు, నగరాలు వికసించాయని ఆయన గుర్తు చేశారు.

This post was last modified on January 11, 2026 11:53 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

2 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

7 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

8 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

9 hours ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

9 hours ago

సింగర్ చిన్మ‌యిపై కేసు

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే త‌మిళ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యిపై కేసు న‌మోదైంది. ఎక్స్‌లో ఆమె చేసిన…

10 hours ago