Political News

చంద్రబాబుపై బండ్ల గణేష్ అభిమానం వెలకట్టలేనిది

చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఇటీవల దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని తన నివాసానికి ఆహ్వానించి ప్రత్యేక వేడుక నిర్వహించిన బండ్ల గణేశ్, తాజాగా మరో కీలక ప్రకటన చేశారు.

షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు ‘మహా పాదయాత్ర’ చేపట్టనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు నాయుడుపై తనకు ఉన్న అభిమానాన్ని, భక్తిని చాటుకునే భాగంగానే ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో, ఆయన ఎలాంటి మచ్చ లేకుండా విడుదల కావాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బండ్ల గణేశ్ మొక్కుకున్న విషయం తెలిసిందే. ఆ కోరిక నెరవేరిన నేపథ్యంలో, ఇప్పుడు మొక్కు తీర్చుకునే కార్యక్రమంగా ఈ పాదయాత్ర నిర్వహించనున్నట్లు సమాచారం.

ఈ నెల 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన స్వగృహం నుంచి పాదయాత్రను ప్రారంభించనున్న బండ్ల గణేశ్, కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. బండ్ల గణేశ్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుతో అనుబంధం ఉన్న కార్యక్రమం కావడంతో ఈ మహా పాదయాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

This post was last modified on January 10, 2026 6:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

4 minutes ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

45 minutes ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

1 hour ago

సింగర్ చిన్మ‌యిపై కేసు

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే త‌మిళ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యిపై కేసు న‌మోదైంది. ఎక్స్‌లో ఆమె చేసిన…

2 hours ago

అన్నయ్య రూటులోనే బేబీ హీరో రిస్కు

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ దేవరకొండని సక్సెస్ వరించడానికి టైం అయితే పట్టింది. బేబీ…

2 hours ago

ఏపీ సర్కారు వేసిన కమిషన్… దోషులను పట్టిస్తుందా?

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ఇప్ప‌టికే సీబీఐ నేతృత్వంలోని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం విచార‌ణ…

3 hours ago