తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ ఆమోదించలేదు.
ఈ క్రమంలోనే మండలి సమావేశాల్లో సోమవారంనాడు పాల్గొన్న కవిత..తన తండ్రి కేసీఆర్ పై, సోదరుడు కేటీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే, మండలి సమావేశాలు ముగిసిన వెంటనే కవిత రాజీనామాను మండలి ఛైర్మన్ ఆమోదించిన వైనం చర్చనీయాంశమైంది.
గత ఏడాది సెప్టెంబరు 3వ తేదీన కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్ ను కోరారు. భావోద్వేగంతో తీసుకున్న రాజీనామా నిర్ణయంపై పునరాలోచించాలని కవితను మండలి ఛైర్మన్ కోరారు.
అయితే, తాను తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోనని ఆమె చెప్పారు. దీంతో, కవిత రాజీనామాను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.
అయితే, ఇన్నాళ్లూ కవిత రాజీనామాను ఆమోదించని ఛైర్మన్ నేడు ఆమోదించడంపై చర్చ జరుగుతోంది. మండలి సమావేశాల సందర్భంగా కవితకు మాట్లాడే ఛాన్స్ దక్కాలన్న ఉద్దేశ్యంతోనే రాజీనామాను ఆమోదించలేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో కవిత చేరతారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కవితకు మండలిలో చివరిసారిగా మాట్లాడే చాన్స్ ఇవ్వాలని ఇన్నాళ్లూ వెయిట్ చేశారని పుకార్లు వస్తున్నాయి.
This post was last modified on January 7, 2026 1:14 pm
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…