తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ ఆమోదించలేదు.
ఈ క్రమంలోనే మండలి సమావేశాల్లో సోమవారంనాడు పాల్గొన్న కవిత..తన తండ్రి కేసీఆర్ పై, సోదరుడు కేటీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే, మండలి సమావేశాలు ముగిసిన వెంటనే కవిత రాజీనామాను మండలి ఛైర్మన్ ఆమోదించిన వైనం చర్చనీయాంశమైంది.
గత ఏడాది సెప్టెంబరు 3వ తేదీన కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్ ను కోరారు. భావోద్వేగంతో తీసుకున్న రాజీనామా నిర్ణయంపై పునరాలోచించాలని కవితను మండలి ఛైర్మన్ కోరారు.
అయితే, తాను తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోనని ఆమె చెప్పారు. దీంతో, కవిత రాజీనామాను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.
అయితే, ఇన్నాళ్లూ కవిత రాజీనామాను ఆమోదించని ఛైర్మన్ నేడు ఆమోదించడంపై చర్చ జరుగుతోంది. మండలి సమావేశాల సందర్భంగా కవితకు మాట్లాడే ఛాన్స్ దక్కాలన్న ఉద్దేశ్యంతోనే రాజీనామాను ఆమోదించలేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో కవిత చేరతారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కవితకు మండలిలో చివరిసారిగా మాట్లాడే చాన్స్ ఇవ్వాలని ఇన్నాళ్లూ వెయిట్ చేశారని పుకార్లు వస్తున్నాయి.
This post was last modified on January 7, 2026 1:14 pm
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…