Political News

కవిత రాజీనామాకు ఆమోదం… ఇంత ఆలస్యం ఎందుకు?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ ఆమోదించలేదు.

ఈ క్రమంలోనే మండలి సమావేశాల్లో సోమవారంనాడు పాల్గొన్న కవిత..తన తండ్రి కేసీఆర్ పై, సోదరుడు కేటీఆర్ పై, బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే, మండలి సమావేశాలు ముగిసిన వెంటనే కవిత రాజీనామాను మండలి ఛైర్మన్ ఆమోదించిన వైనం చర్చనీయాంశమైంది.

గత ఏడాది సెప్టెంబరు 3వ తేదీన కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్ ను కోరారు. భావోద్వేగంతో తీసుకున్న రాజీనామా నిర్ణయంపై పునరాలోచించాలని కవితను మండలి ఛైర్మన్ కోరారు.

అయితే, తాను తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోనని ఆమె చెప్పారు. దీంతో, కవిత రాజీనామాను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.

అయితే, ఇన్నాళ్లూ కవిత రాజీనామాను ఆమోదించని ఛైర్మన్ నేడు ఆమోదించడంపై చర్చ జరుగుతోంది. మండలి సమావేశాల సందర్భంగా కవితకు మాట్లాడే ఛాన్స్ దక్కాలన్న ఉద్దేశ్యంతోనే రాజీనామాను ఆమోదించలేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో కవిత చేరతారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కవితకు మండలిలో చివరిసారిగా మాట్లాడే చాన్స్ ఇవ్వాలని ఇన్నాళ్లూ వెయిట్ చేశారని పుకార్లు వస్తున్నాయి.

This post was last modified on January 7, 2026 1:14 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Kavitha

Recent Posts

ఆ వీడియో రచ్చపై స్పందించిన జగన్

జనసేన నేత, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ప్రభుత్వ మహిళా ఉద్యోగి లైంగిక ఆరోపణలు చేసిన వైనం హాట్…

12 minutes ago

ఆ హీరోతో ఫ్లాప్ పడితే ఇక అంతే

​కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్ గ్రాఫ్ గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ సక్సెస్…

42 minutes ago

వారణాసిలో నాలుగు ఘట్టాలు… అంచనాలకు మించి

రాజమౌళి సినిమా అంటేనే విజువల్స్ కి మించి యాక్షన్ సీక్వెన్స్ లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబుతో…

1 hour ago

‘దాదా’ మృతిపై ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వార్తతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అజిత్…

3 hours ago

జేడీ సతీమణి: పోయింది 2.5 కోట్లు.. దక్కింది 45 లక్షలు!

మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సతీమణి స్టాక్ మార్కెట్ మోసానికి గురైన విషయం తెలిసిందే.…

3 hours ago

జనసేన ఎమ్మెల్యేపై యాక్షన్

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ం పై వచ్చిన లైంగిక ఆరోపణల వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.…

4 hours ago