Political News

రాజ్య‌స‌భ ఎఫెక్ట్‌: 4 మాసాల ముందే క‌ర్చీఫ్‌లు వేసేశారా.. ?

రాష్ట్రంలో ఈ ఏడాది నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మూడు వైసిపి అభ్యర్థులకు సంబంధించినవి ఉండడం విశేషం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉత్తరాది రాష్ట్రానికి చెందిన పరిమళ నత్వాని, అదేవిధంగా మంగళగిరి కి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఈ ముగ్గురు వైసీపీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. టీడీపీకి చెందిన సానా సతీష్ బాబు కూడా ఈ ఎడాది రిటైర్ కారున్నారు. మొత్తంగా ఈ నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

అయితే ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం, రాష్ట్రంలో ఉన్న అధికార కూటమిని గమనిస్తే ఈ నాలుగు స్థానాలు కూటమికే చెందుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే దాదాపు పది మంది వరకు నాయకులు ఈ సీట్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. వీటిలో బిజెపి రెండు స్థానాల కోసం పట్టుబడుతోందని, జనసేన ఒక స్థానం కోసం ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. మిగిలిన వాటిలో టిడిపి నుంచి ఎక్కువమంది పోటీలో కనిపిస్తున్నారు.

వీరిలో సీనియర్ నాయకుల నుంచి గత ఎన్నికల్లో టికెట్లు ద‌క్క‌ని నేతల వరకు ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజెపితో కలిసి ఉన్న నేపథ్యంలో పరిమళనత్వానిని తిరిగి రాజ్యసభకు పంపించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా చూసుకుంటే 4 స్థానాల్లో కేవలం మూడు మాత్రమే కూటమికి దక్కుతాయి. ఈ మూడు స్థానాల్లో ఒకటి కచ్చితంగా జనసేన కోరుకుంటుంది కాబట్టి ఆ పార్టీకి ఇవ్వాలి. మిగిలిన రెండు స్థానాల్లో బిజెపి ఒకటి.. టిడిపి ఒకటి తీసుకుంటాయా లేకపోతే టిడిపినే రెండు తీసుకుంటుందా అనేది ఇంకా చర్చకు రాలేదు.

కానీ, మరోవైపు మాజీ మంత్రుల నుంచి సీనియర్ నేతల వరకు కూడా చాలామంది తమకంటే తమకే కావాలంటూ ఇప్పటినుంచి లాబీయింగ్ ప్రారంభించారని టిడిపి వర్గాల్లో చర్చ నడుస్తోంది. చివరికి ఇది ఏం జరుగుతుంది సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారం టిడిపి వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చిత్రం ఏంటంటే ఈ పరంపరలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు, పోలిట్‌ బ్యూరో సభ్యుడుగా ఉన్న వ్యక్తి కూడా పోటీ పడుతున్నారు.

అదేవిధంగా ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు లైన్ లో ఉన్నారు. అలాగే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ నాయకుడు గతంలో అనేక పదవులు అనుభవించిన నేత కూడా రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతమంది పోటీపడుతున్న నేపథ్యంలో ఎవరికి ఇవి దక్కుతాయి అనేది చూడాలి. ఇక ఈ ఏడాది జూన్ 21 వరకు ప్రస్తుతం ఉన్న సభ్యులు కొనసాగుతారు. జూన్ 22 నుంచి కొత్త సభ్యుల ఎన్నిక జరుగుతుంది.

This post was last modified on January 7, 2026 12:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

21 minutes ago

హౌస్ ఫుల్, బ్లాక్ బస్టర్ అంతా ఉత్తిదేనా?

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…

53 minutes ago

ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…

1 hour ago

దురంధర్-2 వాయిదా పడితే..?

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…

1 hour ago

మళ్లీ థియేటర్ల హాహాకారాలు

గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…

2 hours ago

అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే.. ఆడుకున్న టీడీపీ నేతలు

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు తొలిరోజు మాత్ర‌మే వ‌చ్చిన వైసీపీ స‌భ్యులు.. త‌ర్వాత పార్టీ అధినేత జ‌గ‌న్ ఆదేశాల‌తో స‌భ‌కు…

4 hours ago