ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి తన మనసు చాటుకున్నారు. లోకల్గానే కాదు… విదేశాల్లో కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే.. వెంటనే ఆయన రియాక్ట్ అవుతున్నారు. సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనేక మందిని కువైత్, దుబాయ్ సహా ఎడారి దేశాల నుంచి తీసుకువచ్చారు.
ఆయా వ్యక్తులు.. ఏదో ఒక పనిపై అక్కడకు వెళ్లడం. . ఏజెంట్ల చేతిలో నష్టపోవడం వంటివి కామన్గా మారింది. కష్టాల్లో ఉన్నతమను కాపాడాలని సెల్ఫీ వీడియోలు, సమాచారం వారు లోకేష్కు పంచుకోవడంతో వెంటనే ఆయన రంగంలోకి దిగి వారిని సురక్షితంగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి కష్టమే ప్రస్తుతం ట్రైనింగ్లో ఓ కానిస్టేబుల్కు ఎదురైంది. గత నెలలో జరిగిన కానిస్టేబుల్ నియామకాల్లో ఉద్యోగం సంపాయించిన సాయి అనే యువకుడు.. కువైత్లో తన మాతృమూర్తి పడుతున్న ఇబ్బందులను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అక్కడ తన తల్లిని కొందరు హింసిస్తున్నారని.. ఆమెను కాపాడాలని వేడుకున్నారు. అంతేకాదు.. తనకు తల్లి తప్ప.. మరెవరూ లేరని కూడా వాపోయారు. మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని తన తల్లిని వెనక్కి తీసుకురావాలని కోరుకున్నారు. ఈ వీడియో పై నారా లోకేష్ ఇమ్మీడియెట్గా స్పందించారు.
శిక్షణలో ఉన్న కానిస్టేబుల్కు భరోసా ఇచ్చారు. మీ అమ్మను కాపాడేందుకు.. ఆమెను సురక్షితంగా తీసుకువచ్చేందుకు లేదా.. అక్కడే సరైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే కువైత్లోని తన బృందం(ఎన్నారై టీడీపీ) వివరాలు సేకరించిందని.. సంబంధిత అధికారులతో కూడా ఈ బృందంచర్చిస్తోందని తెలిపారు.
ధైర్యంగా ఉండాలని సూచించారు. తాను ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని సమీక్షిస్తానని కూడా నారా లోకేష్ సదరు కానిస్టేబుల్కు ధైర్యం చెప్పారు. దీంతో కానిస్టేబుల్ విన్నపాన్ని ఆయన సంబంధిత అధికారులకు.. చేరవేశారు. ఈ విషయాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలన్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…
విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…
గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షెకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచనాలకు తగ్గట్లే భారీ…
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…