ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి తన మనసు చాటుకున్నారు. లోకల్గానే కాదు… విదేశాల్లో కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే.. వెంటనే ఆయన రియాక్ట్ అవుతున్నారు. సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనేక మందిని కువైత్, దుబాయ్ సహా ఎడారి దేశాల నుంచి తీసుకువచ్చారు.
ఆయా వ్యక్తులు.. ఏదో ఒక పనిపై అక్కడకు వెళ్లడం. . ఏజెంట్ల చేతిలో నష్టపోవడం వంటివి కామన్గా మారింది. కష్టాల్లో ఉన్నతమను కాపాడాలని సెల్ఫీ వీడియోలు, సమాచారం వారు లోకేష్కు పంచుకోవడంతో వెంటనే ఆయన రంగంలోకి దిగి వారిని సురక్షితంగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి కష్టమే ప్రస్తుతం ట్రైనింగ్లో ఓ కానిస్టేబుల్కు ఎదురైంది. గత నెలలో జరిగిన కానిస్టేబుల్ నియామకాల్లో ఉద్యోగం సంపాయించిన సాయి అనే యువకుడు.. కువైత్లో తన మాతృమూర్తి పడుతున్న ఇబ్బందులను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అక్కడ తన తల్లిని కొందరు హింసిస్తున్నారని.. ఆమెను కాపాడాలని వేడుకున్నారు. అంతేకాదు.. తనకు తల్లి తప్ప.. మరెవరూ లేరని కూడా వాపోయారు. మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని తన తల్లిని వెనక్కి తీసుకురావాలని కోరుకున్నారు. ఈ వీడియో పై నారా లోకేష్ ఇమ్మీడియెట్గా స్పందించారు.
శిక్షణలో ఉన్న కానిస్టేబుల్కు భరోసా ఇచ్చారు. మీ అమ్మను కాపాడేందుకు.. ఆమెను సురక్షితంగా తీసుకువచ్చేందుకు లేదా.. అక్కడే సరైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే కువైత్లోని తన బృందం(ఎన్నారై టీడీపీ) వివరాలు సేకరించిందని.. సంబంధిత అధికారులతో కూడా ఈ బృందంచర్చిస్తోందని తెలిపారు.
ధైర్యంగా ఉండాలని సూచించారు. తాను ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని సమీక్షిస్తానని కూడా నారా లోకేష్ సదరు కానిస్టేబుల్కు ధైర్యం చెప్పారు. దీంతో కానిస్టేబుల్ విన్నపాన్ని ఆయన సంబంధిత అధికారులకు.. చేరవేశారు. ఈ విషయాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలన్నారు.
This post was last modified on January 6, 2026 9:18 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…