Political News

అంజ‌న్న‌ సన్నిధిలో పవన్ – ధర్మశాలకు శంకుస్థాపన

తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లాలో ఉన్న‌ ప్ర‌సిద్ధ‌.. కొండ‌గ‌ట్టు ఆంద‌జ‌నేయ‌స్వామి(అంజ‌న్న‌)ని ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌ర్శించుకున్నారు. శ‌నివారం.. ఉద‌యం.. మంగ‌ళగిరి నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జ‌గిత్యాల జిల్లాలోని కొండ‌గ‌ట్టుకు చేరుకున్నారు.

ఆల‌య అధికారులు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న వెంట‌..ఏపీకి చెందిన ప‌లువురు నాయ‌కులు కూడా పాల్గొన్నారు. అనంత‌రం.. అంజ‌న్న‌ను ద‌ర్శించుకున్న డిప్యూటీ సీఎం.. ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. స్వామివారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

అనంతరం.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆర్థిక స‌హ‌కారంతో నిర్మిస్తున్న ధ‌ర్మ‌శాల‌, దీక్షా మండ‌పాల నిర్మాణానికి.. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ శంకు స్థాప‌న చేశారు. వీటి నిర్మాణాల‌ను 35 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చుకానున్నాయి. ఈసొమ్మును తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం స‌మ‌కూర్చ‌నుంది.

గ‌తంలో కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌ప్పుడు.. ప‌లువురు భక్తులు.. త‌న‌ను ఈసౌక‌ర్యాలు ఏర్పాటు చేయాల‌ని కోరుకున్నార‌ని.. ఈ నేప‌థ్యంలోనే వాటి నిర్మాణానికి.. టీటీడీతో చ‌ర్చించిన‌ట్టు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవల వెల్ల‌డించారు. తాజాగా ఆయా నిర్మాణాల‌కు స్వ‌యంగా ఆయ‌నే శంకుస్థాప‌న చేశారు.

ఆది నుంచి అనుబంధం..

కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆది నుంచి అనుబంధం ఉంది. ఆయ‌న పార్టీ పెట్టిన త‌ర్వాత‌.. అనేక ప‌ర్యాయాలు.. అక్కడ ప‌ర్య‌టించారు. స్వామిని ద‌ర్శించుకున్నారు. వారాహి యాత్ర‌ను ఏపీలో ప్రారంభించ‌డానికి ముందు కూడా.. ఆయ‌న కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి ఆల‌యానికి వెళ్లి.. వారాహి ర‌థానికి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. త‌ర్వాత కూడా ఆయ‌న అనేక ప‌ర్యాయాలు కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌ను ద‌ర్శించుకున్నారు. 

1 / 13

This post was last modified on January 3, 2026 2:47 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హర్మూజ్ ప్లాన్ బెడిసికొట్టిందా ట్రంప్?

అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…

39 minutes ago

ప్ర‌భాస్‌… త‌న వాళ్ల సినిమా అంటే చాలు

ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా సూప‌ర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…

1 hour ago

భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారి ‘అమరావతి’ అనుభవం

భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…

4 hours ago

బీజేపీ బాట‌లో వైసీపీ ఎంపీ?

రాజ‌కీయాల్లో జంపింగులు కొత్త‌కాదు. ఎవ‌రికి న‌చ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవ‌డ‌మూ కొత్త‌కాదు. ఎవ‌రికి అవ‌స‌రం.. అవ‌కాశం ఉన్న దిశ‌గా నాయ‌కులు,…

5 hours ago

ఎటు చూసినా… వైసీపీకి ఛాన్స్ లేదా బ్రో?

ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ క‌నిపించ‌డం లేదా? ఏ వ‌ర్గం కూడా వైసీపీకి ఆశించిన మేర‌కు చేరువ అయ్యే అవ‌కాశం…

8 hours ago

జమీల్ సాబ్ భయపడుతున్నారా?

గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…

10 hours ago