Political News

అంజ‌న్న‌ సన్నిధిలో పవన్ – ధర్మశాలకు శంకుస్థాపన

తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లాలో ఉన్న‌ ప్ర‌సిద్ధ‌.. కొండ‌గ‌ట్టు ఆంద‌జ‌నేయ‌స్వామి(అంజ‌న్న‌)ని ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌ర్శించుకున్నారు. శ‌నివారం.. ఉద‌యం.. మంగ‌ళగిరి నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జ‌గిత్యాల జిల్లాలోని కొండ‌గ‌ట్టుకు చేరుకున్నారు.

ఆల‌య అధికారులు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న వెంట‌..ఏపీకి చెందిన ప‌లువురు నాయ‌కులు కూడా పాల్గొన్నారు. అనంత‌రం.. అంజ‌న్న‌ను ద‌ర్శించుకున్న డిప్యూటీ సీఎం.. ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. స్వామివారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

అనంతరం.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆర్థిక స‌హ‌కారంతో నిర్మిస్తున్న ధ‌ర్మ‌శాల‌, దీక్షా మండ‌పాల నిర్మాణానికి.. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ శంకు స్థాప‌న చేశారు. వీటి నిర్మాణాల‌ను 35 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చుకానున్నాయి. ఈసొమ్మును తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం స‌మ‌కూర్చ‌నుంది.

గ‌తంలో కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌ప్పుడు.. ప‌లువురు భక్తులు.. త‌న‌ను ఈసౌక‌ర్యాలు ఏర్పాటు చేయాల‌ని కోరుకున్నార‌ని.. ఈ నేప‌థ్యంలోనే వాటి నిర్మాణానికి.. టీటీడీతో చ‌ర్చించిన‌ట్టు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవల వెల్ల‌డించారు. తాజాగా ఆయా నిర్మాణాల‌కు స్వ‌యంగా ఆయ‌నే శంకుస్థాప‌న చేశారు.

ఆది నుంచి అనుబంధం..

కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆది నుంచి అనుబంధం ఉంది. ఆయ‌న పార్టీ పెట్టిన త‌ర్వాత‌.. అనేక ప‌ర్యాయాలు.. అక్కడ ప‌ర్య‌టించారు. స్వామిని ద‌ర్శించుకున్నారు. వారాహి యాత్ర‌ను ఏపీలో ప్రారంభించ‌డానికి ముందు కూడా.. ఆయ‌న కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి ఆల‌యానికి వెళ్లి.. వారాహి ర‌థానికి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. త‌ర్వాత కూడా ఆయ‌న అనేక ప‌ర్యాయాలు కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌ను ద‌ర్శించుకున్నారు. 

1 / 13

This post was last modified on January 3, 2026 2:47 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 minute ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

16 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

17 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

1 hour ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago