Political News

జగన్ ఫోటో తియ్యడానికి 50 కోట్లు

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త వైసీపీ హ‌యాంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో భూములు రీస‌ర్వే చేసి.. రైతుల‌కు ప‌ట్టాదారు పాసుపుస్త‌కాలు ఇచ్చారు. అయితే.. ఈ పుస్త‌కాల‌పై అప్ప‌టి సీఎం జ‌గ‌న్ ఫొటోల‌ను ముద్రించారు. ఇది పెద్ద వివాదంగా మారిన విష‌యం తెలిసిందే.

వాస్త‌వానికి ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఏదైనా వెన‌క్కి త‌గ్గాలి. కానీ.. అప్ప‌టి సీఎం జ‌గ‌న్ స‌హా మంత్రులు.. ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌పై జ‌గ‌న్ ఫొటోల‌ను ముద్రించ‌డాన్ని స‌మ‌ర్థించుకున్నారు. ఇది ఎన్నిక‌ల స‌మయంలో వైసీపీ గ్రామ‌స్థాయి ఓటు బ్యాంకును తుడిచి పెట్టేసింది.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌ల నాడినితెలుసుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. తాము అధికారంలోకి వ‌స్తే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ను ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదేవిధంగా ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌పై జ‌గ‌న్ ఫొటోల‌ను తీసేస్తామ‌ని కూడా చెప్పారు. ఆ స్థానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ రాజ‌ముద్ర‌ను ముద్రిస్తామ‌న్నారు.

దీనిపై కొన్నాళ్లుగా గ్రామ‌స్థాయిలో రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌.. 18 నెల‌ల త‌ర్వాత కూడా ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని మీడియాలోనూ వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిని గ‌మ‌నించిన ప్ర‌భుత్వం గ‌త మూడు మాసాలుగా తీవ్ర క‌స‌ర‌త్తు చేసింది.

ముఖ్యంగా న్యాయ‌ప‌ర‌మైన వివాదాలు రాకుండా.. రైతుల‌కు న‌ష్టం రాకుండా కూడా స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుని తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సోమ‌వారం జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఇచ్చిన ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల‌పై జ‌గ‌న్ ఫొటోల‌ను తొల‌గించాల‌ని.. సీఎం చంద్ర‌బాబు, మంత్రివ‌ర్గం కూడా తీర్మానించింది.

దీని ప్ర‌కారం.. రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి ఇచ్చిన పాసు పుస్త‌కాల‌ను వెన‌క్కి తీసుకుని వాటి స్థానంలో కొత్త‌గా పాసుపుస్త‌కాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. అదేవిధంగా రీస‌ర్వేను తిరిగి కొన‌సాగించాల‌ని కూడా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

కొత్త పాస్ పుస్త‌కాలు ఇచ్చేందుకు.. ముఖ్యంగా జ‌గ‌న్ ఫొటోలు తీసేసేందుకు సుమారు 50-70 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంద‌ని ప్రాధ‌మికంగా నిర్ణ‌యించారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు స్పందిస్తూ.. ఎంత ఖ‌ర్చ‌యినా.. ఫ‌ర్వాలేద‌న్నారు. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దృష్టిలో పెట్టుకుని ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌పై జ‌గ‌న్ ఫోటోల‌ను తొల‌గిస్తామ‌న్నారు.

భూముల‌కు-ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉంటుంద‌ని.. ఆ సెంటిమెంటు త‌న‌కు తెలుసున‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో ఖ‌ర్చుకు వెనుకాడ‌వ‌ద్ద‌ని తెలిపారు. వ‌చ్చే మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ రాజ‌ముద్ర‌తో కూడిన ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌ను రైతుల‌కు అందించ‌నున్నారు.

This post was last modified on December 30, 2025 10:16 am

Share

Recent Posts

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

50 minutes ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

1 hour ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

2 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

3 hours ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

3 hours ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

3 hours ago