Political News

జగన్ ఫోటో తియ్యడానికి 50 కోట్లు

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త వైసీపీ హ‌యాంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో భూములు రీస‌ర్వే చేసి.. రైతుల‌కు ప‌ట్టాదారు పాసుపుస్త‌కాలు ఇచ్చారు. అయితే.. ఈ పుస్త‌కాల‌పై అప్ప‌టి సీఎం జ‌గ‌న్ ఫొటోల‌ను ముద్రించారు. ఇది పెద్ద వివాదంగా మారిన విష‌యం తెలిసిందే.

వాస్త‌వానికి ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఏదైనా వెన‌క్కి త‌గ్గాలి. కానీ.. అప్ప‌టి సీఎం జ‌గ‌న్ స‌హా మంత్రులు.. ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌పై జ‌గ‌న్ ఫొటోల‌ను ముద్రించ‌డాన్ని స‌మ‌ర్థించుకున్నారు. ఇది ఎన్నిక‌ల స‌మయంలో వైసీపీ గ్రామ‌స్థాయి ఓటు బ్యాంకును తుడిచి పెట్టేసింది.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌ల నాడినితెలుసుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. తాము అధికారంలోకి వ‌స్తే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ను ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదేవిధంగా ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌పై జ‌గ‌న్ ఫొటోల‌ను తీసేస్తామ‌ని కూడా చెప్పారు. ఆ స్థానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ రాజ‌ముద్ర‌ను ముద్రిస్తామ‌న్నారు.

దీనిపై కొన్నాళ్లుగా గ్రామ‌స్థాయిలో రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌.. 18 నెల‌ల త‌ర్వాత కూడా ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని మీడియాలోనూ వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిని గ‌మ‌నించిన ప్ర‌భుత్వం గ‌త మూడు మాసాలుగా తీవ్ర క‌స‌ర‌త్తు చేసింది.

ముఖ్యంగా న్యాయ‌ప‌ర‌మైన వివాదాలు రాకుండా.. రైతుల‌కు న‌ష్టం రాకుండా కూడా స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుని తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సోమ‌వారం జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఇచ్చిన ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల‌పై జ‌గ‌న్ ఫొటోల‌ను తొల‌గించాల‌ని.. సీఎం చంద్ర‌బాబు, మంత్రివ‌ర్గం కూడా తీర్మానించింది.

దీని ప్ర‌కారం.. రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి ఇచ్చిన పాసు పుస్త‌కాల‌ను వెన‌క్కి తీసుకుని వాటి స్థానంలో కొత్త‌గా పాసుపుస్త‌కాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. అదేవిధంగా రీస‌ర్వేను తిరిగి కొన‌సాగించాల‌ని కూడా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

కొత్త పాస్ పుస్త‌కాలు ఇచ్చేందుకు.. ముఖ్యంగా జ‌గ‌న్ ఫొటోలు తీసేసేందుకు సుమారు 50-70 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంద‌ని ప్రాధ‌మికంగా నిర్ణ‌యించారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు స్పందిస్తూ.. ఎంత ఖ‌ర్చ‌యినా.. ఫ‌ర్వాలేద‌న్నారు. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దృష్టిలో పెట్టుకుని ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌పై జ‌గ‌న్ ఫోటోల‌ను తొల‌గిస్తామ‌న్నారు.

భూముల‌కు-ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉంటుంద‌ని.. ఆ సెంటిమెంటు త‌న‌కు తెలుసున‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో ఖ‌ర్చుకు వెనుకాడ‌వ‌ద్ద‌ని తెలిపారు. వ‌చ్చే మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ రాజ‌ముద్ర‌తో కూడిన ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌ను రైతుల‌కు అందించ‌నున్నారు.

This post was last modified on December 30, 2025 10:16 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే..…

1 hour ago

ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…

2 hours ago

విజ‌య్‌ని డీగ్రేడ్ చేసేలా పొలిటిక‌ల్ మూవీ?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నపుడు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలివేష‌న్లు ఇస్తూ సినిమాలు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రు నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ మూవీస్…

2 hours ago

రాజ‌ధానిపై చంద్ర‌బాబు ముందు చూపు… ఇవే కీల‌కం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజ‌ధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.…

2 hours ago

రేసు గుర్రం కొంచెం తొందరపడిందేమో

ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళ – తెలంగాణ మధ్య నిప్పు రాజుకుంది

కేర‌ళ రాష్ట్రంలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫు స్టార్ క్యాంపెయిన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…

4 hours ago