Political News

టీడీపీ @ 2025 : ప్ల‌స్‌లు – మైన‌స్‌ల లెక్క‌లు ఎలా ఉన్నాయ్‌…?

కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టిడిపిలో 2025 సంవత్సరం ఏవిధంగా గడిచింది? నాయకులు ఏ విధంగా వ్యవహరించారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అయితే జిల్లాకు ఒక రకంగా నాయకులు అడుగులు వేశారు. రాయలసీమ ప్రాంతాన్ని తీసుకుంటే నాయకుల దూకుడు పెరిగింది. గత ఎన్నికల్లో వైసిపి ఇక్కడ బలమైన ప్రాతినిథ్యం సంపాదించుకోలేని కారణంతో టిడిపి విజయం దక్కించుకుంది. దీంతో టిడిపి నాయకులు రెచ్చిపోయారని చెప్పాలి. వాస్తవానికి ఒక ఎన్నికల్లో విజయమే ప్రామాణికంగా తీసుకోవడం సరికాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే.

వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మార‌ద‌ని ఎవరూ చెప్పలేరు. దీనిని బట్టి ప్రజలకు చేరువ కావాలి. ప్రజల్లో మంచిని సంపాదించుకోవాలి. ప్రభుత్వ పథకాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలి. అయితే, ఈ విషయంలో టిడిపి నాయకులు ఒకింత‌ వెనకబడ్డారని చెప్పాలి. చంద్రబాబు వచ్చినప్పుడు చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మాత్రమే వారు ప్రజల మధ్యకు వచ్చారు… తప్ప వ్యక్తిగతంగా ప్రజల మధ్యకు వెళ్ళిన రాయలసీమ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు.

ఇక ఉమ్మడి ప్రకాశంలో నాయకత్వం అంతర్గత విభేదాలు వివాదాలతో ముందుకు సాగింది. ముఖ్యంగా కూటమిలోనే కొంతమంది నాయకులతో టిడిపి నాయకులు విభేదించారు. కొందరు సర్దుకు పోయారు. దీంతో గ్యాప్ అయితే కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లే విషయంలోనూ ప్రకాశం నెల్లూరు జిల్లాలో నాయకులు వెనుకబడ్డారు అన్నది ప్రభుత్వమే చెప్పిన మాట.

ఉభ‌య గోదావ‌రి జిల్లాల విషయానికి వస్తే ఇక్కడ నాయకుల మధ్య సమన్వయం ఉన్నప్పటికీ చిన్న చిన్న వివాదాలు కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున అయితే టిడిపికి డామేజ్ అయ్యే పరిస్థితి లేదు. ఉత్తరాంధ్రలోనూ నాయకుల మధ్య సమన్వయం ఉంది. కాకపోతే అక్కడ కొద్దిపాటి ఆరోపణలు, ముఖ్యంగా ఇసుక వంటి విషయాల్లో నాయకుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇక అన్నిటికన్నా ప్రధానమైన విజయవాడలో ఎంపీ-తిరువూరు ఎమ్మెల్యే మధ్య నెలకొన్న వివాదం టీడీపీని కుదిపేసింది.

అదేవిధంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి -కడప బీజేపీ నేత‌, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య కొనసాగుతున్న వివాదాలు టిడిపిని ఇరుకున పెట్టాయి. మొత్తంగా చూస్తే 2025లో టిడిపి చిన్న చిన్న వివాదాలు తప్ప మిగిలిన విషయాల్లో కలిసిమెలిసి ఉందనే చెప్పాలి. అదేవిధంగా బలమైన పార్టీగా పుంజుకుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Satya

Recent Posts

వారణాసి సెట్… 7 గంటలకు షూటింగ్ అంటే

కెరీర్లో ఒక ద‌శ వ‌ర‌కు మామూలు మాస్ మ‌సాలా సినిమాలే తీశాడు రాజ‌మౌళి. మ‌గ‌ధీర నుంచి ఆయ‌నలోని మ‌రో కోణం…

1 hour ago

సైలెంటుగా పరుగులు పెడుతున్న బంగారం

సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…

4 hours ago

దీదీ వర్సెస్ రీతబ్రత… అసలైన తృణమూల్ ఎవరిది?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…

6 hours ago

ఆచార్య దర్శకుడితో రామ్ చరణ్…

కొన్ని డిజాస్ట‌ర్లు ఇండ‌స్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో ప‌నిచేసిన వాళ్లంద‌రినీ జీవిత కాల చేదు జ్ఞాప‌కాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…

7 hours ago

అఫిషియల్… తల్లి కాబోతున్న సమంత

మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…

8 hours ago

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్‌లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌తో…

9 hours ago