కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్, బీజేపీలపై నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ హైకమాండ్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీయగా, మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై చేసిన ప్రశంసలు పార్టీలో అసంతృప్తిని పెంచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర చర్చకు దారి తీసింది. గుజరాత్లో గతంలో జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించిన ఫొటోను ఆయన షేర్ చేశారు. అందులో ఎల్ కె అద్వాణీతో పాటు నరేంద్ర మోదీని ప్రస్తావించారు. ఒక సాధారణ కార్యకర్త దేశ ప్రధానిగా ఎదగడం వెనుక ఆర్ఎస్ఎస్కు ఉన్న సంస్థాగత బలమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పోస్టులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేయడంతో రాజకీయ వర్గాల్లో మరింత కలకలం రేగింది.
అయితే ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో దిగ్విజయ్ సింగ్ వెంటనే స్పందించారు. తాను ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని గానీ, ప్రధాని మోదీ పాలనా విధానాలను గానీ సమర్థించడం లేదని స్పష్టం చేశారు. కేవలం ఆ సంస్థకు ఉన్న సంఘటనా సామర్థ్యాన్ని మాత్రమే ప్రస్తావించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి బలమైన సంస్థాగత వ్యవస్థ, అధికార వికేంద్రీకరణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
This post was last modified on December 27, 2025 9:58 pm
Rare & Unexpected:Probably for the first time, PM #Modi Addresses Nation Through a Selfie Video,…
అగ్రశ్రేణి కథానాయకులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులతో.. కొత్తవాళ్లు, పెద్దగా అనుభవం లేని డైరెక్టర్లతో పని చేయడం…
రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను ఎలా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి…
సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…
ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…
ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్కు చెందిన…