కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్, బీజేపీలపై నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ హైకమాండ్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీయగా, మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై చేసిన ప్రశంసలు పార్టీలో అసంతృప్తిని పెంచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర చర్చకు దారి తీసింది. గుజరాత్లో గతంలో జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించిన ఫొటోను ఆయన షేర్ చేశారు. అందులో ఎల్ కె అద్వాణీతో పాటు నరేంద్ర మోదీని ప్రస్తావించారు. ఒక సాధారణ కార్యకర్త దేశ ప్రధానిగా ఎదగడం వెనుక ఆర్ఎస్ఎస్కు ఉన్న సంస్థాగత బలమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పోస్టులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేయడంతో రాజకీయ వర్గాల్లో మరింత కలకలం రేగింది.
అయితే ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో దిగ్విజయ్ సింగ్ వెంటనే స్పందించారు. తాను ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని గానీ, ప్రధాని మోదీ పాలనా విధానాలను గానీ సమర్థించడం లేదని స్పష్టం చేశారు. కేవలం ఆ సంస్థకు ఉన్న సంఘటనా సామర్థ్యాన్ని మాత్రమే ప్రస్తావించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి బలమైన సంస్థాగత వ్యవస్థ, అధికార వికేంద్రీకరణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
గత ఏడాది బాహుబలి రెండు భాగాలను సింగల్ పార్ట్ గా మార్చి బాహుబలి ది ఎపిక్ పేరుతో విడుదల చేసిన…
90వ దశకంలో మనసిచ్చి చూడు.. చాలాబాగుంది సహా పలు ఫ్యామిలీ సినిమాలతో ఆకట్టుకున్న నటుడు వడ్డే నవీన్. జగపతిబాబు, శ్రీకాంత్ల…
టాలీవుడ్ లో ఉన్న చాలా అగ్ర నిర్మాణ సంస్థలు బిజినెస్ లెక్కల ఆధారంగానే సినిమాలు తీస్తున్న మాట వాస్తవం. హీరో…
మనం తమిళ హీరోలు రజనీకాంత్, విజయ్, సూర్య లాంటి వాళ్ళను నెత్తినబెట్టుకుని చూస్తాం కానీ మనోళ్ళను వాళ్ళు పిచ్చ లైట్…
మొన్నటిదాకా జూన్ 26 రావడం పక్కాని పదే పదే ప్రమోషన్లలో ఊదరగొట్టిన లెనిన్ మళ్ళీ వాయిదా పడిందనే వార్త అభిమానుల్లో…
తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు తక్కువ అని… కొత్త కథలు ప్రయత్నించరని.. ఎప్పుడూ మాస్ మంత్రమే పఠిస్తుంటారని.. కథలన్నీ హీరోల చుట్టూనే…