Political News

కూట‌మికి భ‌రోసా: 2025 విశేషాలు ఇవే.. !

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? అంటే ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన పరిణామాలు గమనిస్తే కూటమిలోని మూడు పార్టీలు బలోపేతం దిశ‌గా అడుగులు వేస్తున్నాయని చెప్పాలి. పార్టీ పరంగా పెట్టుకుంటున్న కార్యక్రమాలు భిన్నంగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని కీలక అంశాల విష‌యంలో మాత్రం మూడు పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. మూడు పార్టీలది ఒకే మాట అన్నట్టుగా అడుగులు వేస్తున్నాయి. ఇది కూటమి బలోపేతానికి ప్రధానంగా పని చేస్తోంది. అదేవిధంగా పై స్థాయిలో నాయకుల మధ్య అవగాహన సమన్వయం స్పష్టంగా కనిపించింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచుగా టిడిపి అధినేత చంద్రబాబును ప్రశంసించడం అదేవిధంగా టిడిపి అధినేత చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్న మెచ్చుకోవడం వంటివి ఈ ఏడాది కనిపించాయి. ఇక, బిజెపి రాష్ట్రస్థాయి నాయకులకంటే కూడా జాతీయస్థాయి నాయకులను రాష్ట్రంలో హైలెట్ చేస్తూ వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నాయకత్వాన్ని కూడా సీఎం చంద్రబాబు తరచుగా ప్రశంసిస్తున్నారు. ప్రధానమంత్రిని అనేక సందర్భాల్లో ఆకాశానికి ఎత్తేసారు.

తద్వారా కూటమిలో బిజెపి రాష్ట్రస్థాయి నాయకత్వం ఎలా ఉన్నప్పటికీ జాతీయస్థాయి నాయకత్వాన్ని కలుపుకొని అడుగులు వేస్తున్నారు. ఇది, భవిష్యత్తు రాజకీయాల‌ను బ‌లోపేతం చేస్తుందని ముఖ్యంగా కూటమి రాజకీయాలను బలోపేతం చేస్తుందని సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోందిజ‌ ఇక రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడంతో పాటు కేంద్రం నుంచి సహకారం తీసుకువచ్చే విషయంలో కూడా చంద్రబాబు తరచుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సక్సెస్ కూడా అవుతున్నారు.

అదే సమయంలో కూటమి నాయకులకు నామినేటెడ్ పదవులు, మంత్రివర్గం విషయంలోనూ చేసిన ప్రయత్నాలు వంటివి సంతృప్తిని మిగులుస్తున్నాయి. ఇటు బిజెపికి అటు జనసేనకు సమన్వయంగా నామినేటెడ్ పదవులు సీఎం చంద్రబాబు ఇస్తున్నారు. తద్వారా అసంతృప్తి లేకుండా కూటమిలో సమన్వయాన్ని పెంచే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఇది కూటమిని బలోపేతం చేసేందుకు భరోసా కల్పించేందుకు అవకాశంగా మారింది.

ఇక క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని జిల్లాల్లో విభేదాలు ఉన్నప్పటికీ వాటి విషయంలో సీరియస్ గా చర్యలు తీసుకోకుండా కేవలం హెచ్చరికలు చేసి సరిపెడుతుండడం ద్వారా నాయకత్వం… బెసిగిపోకుండా చూసుకుంటున్నారు. మొత్తంగా ఈ పరిణామాలు కూటమిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయ‌నే చర్చ నడుస్తోంది. ఎలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కూటమి కార్యకలాపాలు సజావుగానే సాగుతున్నాయి.

ముఖ్యంగా ఇటీవల చేపట్టిన అటల్ -మోడీ సుపరిపాలన యాత్రలు మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించడం వంటివి బిజెపిని సంతృప్తి పరుస్తున్నాయి. ఇక జనసేన విషయానికి వస్తే ఇప్పటికే ప్రకటించిన నామినేటెడ్ పదవులు కూడా ఆ పార్టీలో జోష్‌ను నింపుతున్నాయి. మొత్తంగా కూటమి ఈ ఏడాది కాలంలో బలంగా ఉందనే వాదన వినిపిస్తోంది.

This post was last modified on December 27, 2025 12:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొరటాల మాస్… బాలయ్య కార్పెంటర్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…

4 hours ago

సువేందు అధికారి ఆనే నేను..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో బెంగాల్‌ సీఎంగా సువేందు…

4 hours ago

వీరభద్రుడికి ముందు నుయ్యి వెనుక గొయ్యి

ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…

4 hours ago

పవన్ అభిమానులు… కొత్త ట్రాప్ లో పడొద్దు…

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…

5 hours ago

సుమంత్ పేరు వెనుక‌ ప్ర‌భాస్ ఎందుకు?

మేం ఫేమ‌స్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ న‌టుడు సుమంత్ ప్ర‌భాస్. షార్ట్ ఫిలిమ్స్ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ఈ…

6 hours ago

ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ మార‌బోతున్నాడా?

సూర్య‌కుమార్ యాద‌వ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎందుకు లేడు? భార‌త టీ20 జ‌ట్టు విష‌యంలో చాలా రోజులుగా అభిమానుల‌ను…

8 hours ago