ఈ ఏడాది చివరి వీకెండ్లో ఏకంగా అరడజను సినిమాలు రిలీజయ్యాయి. క్రిస్మస్ వీకెండ్ కావడంతో పోటీ ఉన్నా పర్వాలేదని ఒకేసారి అన్ని సినిమాలనూ రిలీజ్ చేసేశారు. ఈ చిత్రాలన్నీ చిన్న, మిడ్ రేంజివే. ఐతే ఈ అరడజను సినిమాల్లో దేనికీ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. డబ్బింగ్ సినిమా అయిన ‘వృషభ’ ఔట్ రైట్ డిజాస్టర్ అని ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే తేలిపోయింది.
మిగతా అయిదు తెలుగు చిత్రాల్లో ‘శంబాల’ బెటర్ టాక్ తెచ్చుకుని ఆ టాక్కు తగ్గట్లే వసూళ్లు రాబడుతూ ముందుకు సాగుతోంది. ‘ఛాంపియన్’కు బిలో యావరేజ్ టాక్ రాగా.. వసూళ్లు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. రిలీజ్ ముంగిట అస్సలు సౌండ్ చేయని ‘పతంగ్’ అనే చిన్న సినిమాకు మంచి టాకే వచ్చింది. వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నాయి. మిగతా రెండు చిత్రాల బాక్సాఫీస్ రన్ మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
శివాజీ ముఖ్య పాత్ర పోషించిన ‘దండోరా’ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. వాస్తవ ఘటనల ఆధారంగా కులం సమస్య చుట్టూ హార్డ్ హిట్టింగ్ డ్రామాగా ‘దండోరా’ను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఐతే చూసిన వాళ్లంతా మంచి సినిమా అంటున్నా.. వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఇలాంటి సినిమా వేరే భాషలో వస్తే మన వాళ్లు ఆహా ఓహా అంటారని, తెలుగులో వస్తే మాత్రం ఆదరించడం లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇంత పోటీ మధ్య రావడం ఈ సినిమాకు చేటు చేసిందని అంటున్నారు. సీరియస్ సినిమా కావడం మైనస్ అయిందనే వాదనా వినిపిస్తోంది. డీసెంట్ టాక్, రివ్యూలు తెచ్చుకున్న సినిమా పరిస్థితి ఇలా ఉంటే.. బ్యాడ్ టాక్, నెగెటివ్ రివ్యూలతో మొదలైన ‘ఈషా’ సినిమాకు మాత్రం అంచనాలకు మించే వసూళ్లు వస్తున్నాయి.
రిలీజ్ డే నుంచి ప్రతి రోజూ కొన్ని షోల వరకు ఈ సినిమాకు ఫుల్స్ పడుతున్నాయి. చాలా షోలకు మంచి ఆక్యుపెన్సీలే కనిపిస్తున్నాయి. ఆదివారం కూడా పరిస్థితి మెరుగ్గానే ఉంది. చిన్న బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కావడంతో వీకెండ్ లోపలే సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోవడం విశేషం. ఈ రెండు చిత్రాల ఫలితాలు చూసి.. ప్రేక్షకులు ఎప్పుడు ఏ సినిమాను ఎలా ఆదరిస్తారో అర్థం కాదని ఫిలిం మేకర్స్ తలలు పట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది.
This post was last modified on December 28, 2025 6:19 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…