ఈ ఏడాది చివరి వీకెండ్లో ఏకంగా అరడజను సినిమాలు రిలీజయ్యాయి. క్రిస్మస్ వీకెండ్ కావడంతో పోటీ ఉన్నా పర్వాలేదని ఒకేసారి అన్ని సినిమాలనూ రిలీజ్ చేసేశారు. ఈ చిత్రాలన్నీ చిన్న, మిడ్ రేంజివే. ఐతే ఈ అరడజను సినిమాల్లో దేనికీ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. డబ్బింగ్ సినిమా అయిన ‘వృషభ’ ఔట్ రైట్ డిజాస్టర్ అని ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే తేలిపోయింది.
మిగతా అయిదు తెలుగు చిత్రాల్లో ‘శంబాల’ బెటర్ టాక్ తెచ్చుకుని ఆ టాక్కు తగ్గట్లే వసూళ్లు రాబడుతూ ముందుకు సాగుతోంది. ‘ఛాంపియన్’కు బిలో యావరేజ్ టాక్ రాగా.. వసూళ్లు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. రిలీజ్ ముంగిట అస్సలు సౌండ్ చేయని ‘పతంగ్’ అనే చిన్న సినిమాకు మంచి టాకే వచ్చింది. వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నాయి. మిగతా రెండు చిత్రాల బాక్సాఫీస్ రన్ మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
శివాజీ ముఖ్య పాత్ర పోషించిన ‘దండోరా’ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. వాస్తవ ఘటనల ఆధారంగా కులం సమస్య చుట్టూ హార్డ్ హిట్టింగ్ డ్రామాగా ‘దండోరా’ను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఐతే చూసిన వాళ్లంతా మంచి సినిమా అంటున్నా.. వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఇలాంటి సినిమా వేరే భాషలో వస్తే మన వాళ్లు ఆహా ఓహా అంటారని, తెలుగులో వస్తే మాత్రం ఆదరించడం లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇంత పోటీ మధ్య రావడం ఈ సినిమాకు చేటు చేసిందని అంటున్నారు. సీరియస్ సినిమా కావడం మైనస్ అయిందనే వాదనా వినిపిస్తోంది. డీసెంట్ టాక్, రివ్యూలు తెచ్చుకున్న సినిమా పరిస్థితి ఇలా ఉంటే.. బ్యాడ్ టాక్, నెగెటివ్ రివ్యూలతో మొదలైన ‘ఈషా’ సినిమాకు మాత్రం అంచనాలకు మించే వసూళ్లు వస్తున్నాయి.
రిలీజ్ డే నుంచి ప్రతి రోజూ కొన్ని షోల వరకు ఈ సినిమాకు ఫుల్స్ పడుతున్నాయి. చాలా షోలకు మంచి ఆక్యుపెన్సీలే కనిపిస్తున్నాయి. ఆదివారం కూడా పరిస్థితి మెరుగ్గానే ఉంది. చిన్న బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కావడంతో వీకెండ్ లోపలే సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోవడం విశేషం. ఈ రెండు చిత్రాల ఫలితాలు చూసి.. ప్రేక్షకులు ఎప్పుడు ఏ సినిమాను ఎలా ఆదరిస్తారో అర్థం కాదని ఫిలిం మేకర్స్ తలలు పట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది.
This post was last modified on December 28, 2025 6:19 pm
మాములుగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఓటిటిలో వచ్చినప్పుడు సోషల్ మీడియాలో మంచి హడావిడి ఉంటుంది. కానీ మన శంకరవరప్రసాద్…
ఇంకా ఏడాది సమయం ఉండగానే టాలీవుడ్ సంక్రాంతి మీద విపరీతమైన హైప్ నెలకొంది. షూటింగులు మొదలుపెట్టకుండా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్,…
ఇండియాలో వెబ్ సిరీస్లు చేయడంలో బాలీవుడ్ స్టార్లు ముందు నుంచి చురకే. ట్రెండును అందిపుచ్చుకుంటూ సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్,…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించిన వ్యవహారం రాజకీయంగా రచ్చ రేపిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు…
వైసీపీ నేతలు, ఆ పార్టీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా రెండు…
‘బాహుబలి’తో ప్రభాస్ ఎంత పెద్ద స్టార్గా ఎదిగాడో.. ఒకేసారి తన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఎన్ని రెట్లయిందో కొత్తగా చెప్పాల్సిన…