మాజీ మంత్రి కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గుంటూరులో చదువుకున్న కేటీఆర్ కు తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసని రేవంత్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రేవంత్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
తాను ఉమ్మడి ఏపీలోని గుంటూరులో చదువుకుంటే రేవంత్ రెడ్డికి నొప్పెందుకు అని కేటీఆర్ అన్నారు. ఆ తర్వాత హైదరాబాద్, పుణె, అమెరికాలో చదివానని..రేవంత్ మాదిరి చదువు, సంధ్య లేనివాడిని కాదని చురకలంటించారు.
రేవంత్ రెడ్డిని ఆయన తల్లిదండ్రులు సరైన మార్గంలో నడపలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఇంగ్లిషు మాట్లాడుతున్నా రేవంత్ ఓర్వలేకపోతున్నారని, తనకు హిందీ, ఉర్దూ కూడా వచ్చని, తనను చూసి ఏడ్వడం మానేసి ఆయన కూడా ఇంగ్లిషు నేర్చుకోవచ్చని సెటైర్లు వేశారు.
ఉమ్మడి ఏపీలో తాను చదివితే తప్పుబట్టిన రేవంత్…ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత భీమవరం వెళ్లి అల్లుడిని తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. అందుకే, ఇక నుంచి రేవంత్ పేరు చిట్టినాయుడు కాదని… భీమవరం బుల్లోడని సెటైర్లు వేశారు.
తన తండ్రి తెలంగాణ తెచ్చిన మగోడు, మొనగాడు అని.. కాబట్టి ఆయన పేరు తాను చెప్పుకుంటానని అన్నారు. అదే మాదిరిగా రేవంత్ కూడా మంచి పనులు చేస్తే ఆయన మనవడు ఆయన పేరు చెప్పుకుంటాడని హితవు పలికారు. బ్యాగులు మోయడం, ఢిల్లీకి పేమెంట్ కోటాలో పైసలు పంపడం తమ వల్ల కాదని, మొనగాళ్ల మాదిరి తెలంగాణ పౌరుషంతో తాము బ్రతుకుతామని అన్నారు.
రేవంత్ రోజూ అరుస్తున్నడని, ఆయన ఎవరినైనా కరుస్తడేమో అని భయంగా ఉందని రేవంత్ భార్య గీతమ్మకు ఆయన్ని కట్టేయమని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఏనుగు పోతుంటే కుక్కలు, నక్కలు మొరుగుతుంటాయని, పట్టించుకోవాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు.
This post was last modified on December 26, 2025 3:47 pm
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. సమావేశాలను వారు ప్రత్యక్షంగా…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…