మాజీ మంత్రి కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గుంటూరులో చదువుకున్న కేటీఆర్ కు తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసని రేవంత్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రేవంత్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
తాను ఉమ్మడి ఏపీలోని గుంటూరులో చదువుకుంటే రేవంత్ రెడ్డికి నొప్పెందుకు అని కేటీఆర్ అన్నారు. ఆ తర్వాత హైదరాబాద్, పుణె, అమెరికాలో చదివానని..రేవంత్ మాదిరి చదువు, సంధ్య లేనివాడిని కాదని చురకలంటించారు.
రేవంత్ రెడ్డిని ఆయన తల్లిదండ్రులు సరైన మార్గంలో నడపలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఇంగ్లిషు మాట్లాడుతున్నా రేవంత్ ఓర్వలేకపోతున్నారని, తనకు హిందీ, ఉర్దూ కూడా వచ్చని, తనను చూసి ఏడ్వడం మానేసి ఆయన కూడా ఇంగ్లిషు నేర్చుకోవచ్చని సెటైర్లు వేశారు.
ఉమ్మడి ఏపీలో తాను చదివితే తప్పుబట్టిన రేవంత్…ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత భీమవరం వెళ్లి అల్లుడిని తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. అందుకే, ఇక నుంచి రేవంత్ పేరు చిట్టినాయుడు కాదని… భీమవరం బుల్లోడని సెటైర్లు వేశారు.
తన తండ్రి తెలంగాణ తెచ్చిన మగోడు, మొనగాడు అని.. కాబట్టి ఆయన పేరు తాను చెప్పుకుంటానని అన్నారు. అదే మాదిరిగా రేవంత్ కూడా మంచి పనులు చేస్తే ఆయన మనవడు ఆయన పేరు చెప్పుకుంటాడని హితవు పలికారు. బ్యాగులు మోయడం, ఢిల్లీకి పేమెంట్ కోటాలో పైసలు పంపడం తమ వల్ల కాదని, మొనగాళ్ల మాదిరి తెలంగాణ పౌరుషంతో తాము బ్రతుకుతామని అన్నారు.
రేవంత్ రోజూ అరుస్తున్నడని, ఆయన ఎవరినైనా కరుస్తడేమో అని భయంగా ఉందని రేవంత్ భార్య గీతమ్మకు ఆయన్ని కట్టేయమని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఏనుగు పోతుంటే కుక్కలు, నక్కలు మొరుగుతుంటాయని, పట్టించుకోవాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు.
This post was last modified on December 26, 2025 3:47 pm
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…