Political News

కేసీఆర్ కు వత్తాసు పలికిన వైసీపీ మాజీ మంత్రి

ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెట్టుబడుల విషయంలో చంద్రబాబు అతిగా పబ్లిసిటీ చేశారని, అది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాపీ కొట్టారని సెటైర్లు వేశారు.

చంద్రబాబు చెప్పే లెక్కల ప్రకారం ఆయన ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూలు సక్సెస్ అయితే ఏపీలో 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేవని అన్నారు. సీఎం చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా అదే మాదిరిగా తెలంగాణకు భారీ పెట్టుబడులు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు సమర్థిస్తున్నారు. కేసీఆర్ కామెంట్లకు వైసీపీ నేత, మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వత్తాసు పలికారు. పబ్లిసిటీ, మార్కెటింగ్, వైసీపీపై విమర్శలు చేయడం తప్ప ఏపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించారు.

ఆ విషయాన్నే కేసీఆర్ స్పష్టం చేశారని, తాను ఆయన వ్యాఖ్యలతో వ్యక్తిగతంగా తాను 100 శాతం ఏకీభవిస్తానని అన్నారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పడం తాను చూడలేదని, అందుకే ఆయన అంత పెద్ద నాయకుడయ్యాడని కితాబిచ్చారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకోవాలని హితవు పలికారు.

ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు కేసీఆర్ అంతటి సత్యహరిశ్చంద్రుడు లేడు అని గుడివాడ అమర్నాథ్ సర్టిఫై చేయడం విడ్డూరంగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తా అన్న కేసీఆర్…పదేళ్ల ఆ కుర్చీ పట్టుకొని వేలాడిన విషయం అమర్నాథ్ మరిచిపోయారని గుర్తు చేస్తున్నారు. ఇంతకన్నా పెద్ద అబద్ధాలు కేసీఆర్ ఎన్నో చెప్పారని, వాటి గురించి అమర్నాథ్ తెలుసుకోవాలని చురకలంటిస్తున్నారు.

This post was last modified on December 22, 2025 9:44 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

20 minutes ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

26 minutes ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

37 minutes ago

రెండు విషయాల్లో ఉస్తాదే కరెక్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…

1 hour ago

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

4 hours ago

వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!

వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…

5 hours ago