Political News

కేసీఆర్ కు వత్తాసు పలికిన వైసీపీ మాజీ మంత్రి

ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెట్టుబడుల విషయంలో చంద్రబాబు అతిగా పబ్లిసిటీ చేశారని, అది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాపీ కొట్టారని సెటైర్లు వేశారు.

చంద్రబాబు చెప్పే లెక్కల ప్రకారం ఆయన ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూలు సక్సెస్ అయితే ఏపీలో 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేవని అన్నారు. సీఎం చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా అదే మాదిరిగా తెలంగాణకు భారీ పెట్టుబడులు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు సమర్థిస్తున్నారు. కేసీఆర్ కామెంట్లకు వైసీపీ నేత, మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వత్తాసు పలికారు. పబ్లిసిటీ, మార్కెటింగ్, వైసీపీపై విమర్శలు చేయడం తప్ప ఏపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించారు.

ఆ విషయాన్నే కేసీఆర్ స్పష్టం చేశారని, తాను ఆయన వ్యాఖ్యలతో వ్యక్తిగతంగా తాను 100 శాతం ఏకీభవిస్తానని అన్నారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పడం తాను చూడలేదని, అందుకే ఆయన అంత పెద్ద నాయకుడయ్యాడని కితాబిచ్చారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకోవాలని హితవు పలికారు.

ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు కేసీఆర్ అంతటి సత్యహరిశ్చంద్రుడు లేడు అని గుడివాడ అమర్నాథ్ సర్టిఫై చేయడం విడ్డూరంగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తా అన్న కేసీఆర్…పదేళ్ల ఆ కుర్చీ పట్టుకొని వేలాడిన విషయం అమర్నాథ్ మరిచిపోయారని గుర్తు చేస్తున్నారు. ఇంతకన్నా పెద్ద అబద్ధాలు కేసీఆర్ ఎన్నో చెప్పారని, వాటి గురించి అమర్నాథ్ తెలుసుకోవాలని చురకలంటిస్తున్నారు.

This post was last modified on December 22, 2025 9:44 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘దాదా’ మృతిపై ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వార్తతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అజిత్…

1 hour ago

జేడీ సతీమణి: పోయింది 2.5 కోట్లు.. దక్కింది 45 లక్షలు!

మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సతీమణి స్టాక్ మార్కెట్ మోసానికి గురైన విషయం తెలిసిందే.…

2 hours ago

జనసేన ఎమ్మెల్యేపై యాక్షన్

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ం పై వచ్చిన లైంగిక ఆరోపణల వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.…

2 hours ago

50 కోట్ల నష్టం నుండి 50 కోట్ల లాభం వరకు!

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కోసారి ఫలితం అటు ఇటు అయినా, కమ్ బ్యాక్ ఇస్తే…

3 hours ago

‘కూటమిలో ఇబ్బందులు సరే.. అయినా కలిసి ఉండాల్సిందే’

పార్టీ అధినేత ఒక లక్ష్యం నిర్దేశించుకున్నారు. దానిని ముందుకు తీసుకువెళ్లడం మనందరి బాధ్యత. ఈ క్రమంలో అనేక ఇబ్బందులు వస్తాయి.…

3 hours ago

రిటైర్మెంట్‌ పై సింగర్ మరింత క్లారిటీ

చాలా తక్కువ సమయంలో దేశంలోనే టాప్ సింగర్లలో ఒకడిగా ఎదిగిన బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్.. కేవలం 38 ఏళ్ల…

3 hours ago