వివాదాస్పద ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ అధికారిక హోదాలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు రెండు పేజీల లేఖ రాశారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను ఆయన పెన్ డ్రైవ్లో సమర్పించారు. ఇదే లేఖను రాష్ట్ర హోం శాఖ సెక్రటరీకి కూడా పంపించారు. తక్షణమే ఐపీఎస్ సునీల్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని రఘురామ డిమాండ్ చేశారు.
ఏం జరిగింది?
వైసీపీ హయాంలో రఘురామను (అప్పటి ఎంపీ) అరెస్టు చేయడం, కస్టడీలో హింసించారన్న ఆరోపణల నేపథ్యంలో రఘురామ (ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల విచారణకు కూడా సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ కేసు నేపథ్యంలోనే ప్రభుత్వం సునీల్ కుమార్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఇదిలా ఉండగా, సునీల్ కుమార్ ఇటీవల కాలంలో రఘురామను కూడా టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
తనపై ఉన్న కేసు నేపథ్యంలో విధుల నుంచి సస్పెండ్ చేసినట్టుగానే రఘురామపై కూడా సీబీఐ కేసులు ఉన్నాయని, అందువల్ల ఆయనను రాజకీయ పదవుల నుంచి (డిప్యూటీ స్పీకర్) తొలగించాలని కోరుతూ ఇటీవల సుదీర్ఘ సెల్ఫీ వీడియోను సునీల్ కుమార్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు.
“రఘురామ ఇప్పుడు కాకపోతే మరో రెండు మూడు రోజుల్లో అరెస్టు అవుతారు. ఇది ఏపీ బ్రాండ్ ఇమేజ్కు ఇబ్బందికరం. అందుకే ఆయనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తప్పించాలి” అని సునీల్ వ్యాఖ్యానించారు.
తాజాగా రఘురామ స్పందిస్తూ, డీజీపీకి ప్రధానంగా మూడు అంశాలపై ఇంగ్లీష్లో అధికారిక లెటర్ హెడ్పై లేఖ పంపించారు.
తనపై తప్పుడు ఆరోపణలు చేయడం
న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించడం మరియు సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించడం
తనపై విచారణ కోరుతూ సీబీఐ కోర్టులో రిట్ పిటిషన్ వేస్తానని సునీల్ హెచ్చరించడం
ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐపీఎస్ సునీల్ కుమార్ను డిస్మిస్ చేయాలని రఘురామ కోరారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on December 22, 2025 11:10 pm
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…