Political News

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “అన్నీ గుర్తుంచుకున్నా. ఎవ‌రికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు“ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాజాగా శుక్ర‌వారం రాజ‌మండ్రిలో ప‌ర్య‌టించిన లోకేష్‌.. స్థానిక పార్టీ కేడ‌ర్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు వైసీపీ హ‌యాంలో ప‌డిన ఇబ్బందుల‌ను.. అవ‌మానాల‌ను ఆయ‌న దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అన్నీ నాకు బాగానే గుర్తున్నాయ‌ని తెలిపారు. బ‌దులుకు-బ‌దులు ఘాటుగా ఉంటుంద‌న్నారు.

అయితే.. ఎవ‌రికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసున‌ని, కొంత సంయ‌మ‌నం పాటించాల‌ని లోకేష్ సూచించారు. రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఆదిరెడ్డి భ‌వానీ(ఎర్ర‌న్నాయుడి కుమార్తె)ని వైసీపీ స‌భ్యులు అప్ప‌ట్లో వేధించార‌ని.. అదేవిథంగా త‌న త‌ల్లి భువ‌నేశ్వ‌రిని కూడా స‌భ‌లో దుర్భాష‌లాడార‌ని.. అన్నీగుర్తున్నాయ‌ని లోకేష్ చెప్పారు. అయితే.. కొంత స‌మ‌యం వేచి చూడాలన్నారు. వైసీపీ హ‌యాంలో వేధింపుల‌కు గురైన వారికి అంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌ని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. చ‌ట్టాన్ని త‌మ చుట్టంగా మార్చుకుని అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిని వ‌దిలేది లేద‌న్నారు.

మ‌రో 100 ఏళ్లు టీడీపీ స‌జీవం

“తెలుగుదేశం పార్టీని మా తాత ఎన్టీఆర్ స్థాపించారు. ఇది పేద‌ల ప‌క్షపాత పార్టీ. దీనిని అంతం చేయాల‌ని, భూస్థాపితం చేయాలని చాలా మంది ప్ర‌య‌త్నించారు. కానీ, వారి ఆశ‌లు నెర‌వేర‌లేదు. అంతేకాదు.. ఎప్ప‌టికీ నెర‌వేర‌వు. మ‌రో 100 ఏళ్ల పాటు టీడీపీ బ‌లంగా ఉంటుంది. మ‌రింత‌గా విస్త‌రిస్తుంది.“ అని నారా లోకేష్ చెప్పారు. కార్య‌క‌ర్త‌లే పార్టీకి బ‌ల‌మ‌ని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు సైతం కార్య‌కర్త‌ల‌ను క‌లుపుకొని ముందుకు సాగాల‌న్నారు. చంద్ర‌బాబును అరెస్టు చేసిన‌ప్పుడు రాజ‌మండ్రి కార్య‌క‌ర్త‌లు ఉప్పెన‌లా త‌ర‌లి వ‌చ్చార‌ని.. ఆ సంగ‌తులు త‌న‌కు ఇప్ప‌టికీ గుర్తున్నాయ‌ని చెప్పారు.

ఏదున్నా.. నాలుగు గోడ‌ల మ‌ధ్యే..

పార్టీలో అల‌క‌లు.. బుజ్జ‌గింపులు ఉంటాయ‌ని.. అల‌క‌లు లేకుండా.. ఏ పార్టీ కూడా ఉండ‌ద‌ని, టీడీపీ వంటి భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు పెద్ద‌పీట వేసే పార్టీలో అల‌క‌లు ఒక జ‌బ్బుగా మారాయ‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. అయితే..ఏదున్నా కూడా.. రోడ్డున ప‌డితే తీవ్రంగా ప‌రిగ‌ణిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఎమ్మెల్యేల‌పైనా, ఎంపీల‌పైనా అల‌గ‌డం కంటే.. వారితో నేరుగా చ‌ర్చించి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. నాలుగు గోడ‌ల మ‌ధ్యే స‌మ‌స్య‌-ప‌రిష్కారం రెండూ కావాల‌ని .. ఎవ‌రూ మీడియా ముందుకు వ‌చ్చి.. ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగ‌డం స‌రికాద‌ని నారా లోకేష్ సూచించారు.

This post was last modified on December 19, 2025 10:23 pm

Share

Recent Posts

వరుణ్ తేజ్ నమ్మలేని నిజం ఇది

వరుణ్ తేజ్ గత సినిమాల ఓపెనింగ్స్ ఒకసారి తవ్వి తీస్తే రిలీజ్ రోజు మార్నింగ్ షోకు చాలా చోట్ల ఫుల్స్…

45 minutes ago

జడల్ జమానా మీద మిశ్రమ స్పందనా

న్యాచురల్ స్టార్ నాని అభిమానుల విపరీతమైన ఎదురు చూపులకు చెక్ పెడుతూ ది ప్యారడైజ్ టీజర్ వచ్చేసింది. నిమిషంన్నర లోపే…

3 hours ago

వింక్ భామకు పిచ్చి ప్రశ్న

సోషల్ మీడియా ఎప్పుడు ఎవరికి ఎలా ఫేమ్ తెచ్చిపెడుతుందో ఊహించలేం. మలయాళ అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్ అనుకోకుండా అలాగే…

6 hours ago

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…

11 hours ago

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

12 hours ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

13 hours ago