Political News

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “అన్నీ గుర్తుంచుకున్నా. ఎవ‌రికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు“ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాజాగా శుక్ర‌వారం రాజ‌మండ్రిలో ప‌ర్య‌టించిన లోకేష్‌.. స్థానిక పార్టీ కేడ‌ర్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు వైసీపీ హ‌యాంలో ప‌డిన ఇబ్బందుల‌ను.. అవ‌మానాల‌ను ఆయ‌న దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అన్నీ నాకు బాగానే గుర్తున్నాయ‌ని తెలిపారు. బ‌దులుకు-బ‌దులు ఘాటుగా ఉంటుంద‌న్నారు.

అయితే.. ఎవ‌రికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసున‌ని, కొంత సంయ‌మ‌నం పాటించాల‌ని లోకేష్ సూచించారు. రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఆదిరెడ్డి భ‌వానీ(ఎర్ర‌న్నాయుడి కుమార్తె)ని వైసీపీ స‌భ్యులు అప్ప‌ట్లో వేధించార‌ని.. అదేవిథంగా త‌న త‌ల్లి భువ‌నేశ్వ‌రిని కూడా స‌భ‌లో దుర్భాష‌లాడార‌ని.. అన్నీగుర్తున్నాయ‌ని లోకేష్ చెప్పారు. అయితే.. కొంత స‌మ‌యం వేచి చూడాలన్నారు. వైసీపీ హ‌యాంలో వేధింపుల‌కు గురైన వారికి అంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌ని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. చ‌ట్టాన్ని త‌మ చుట్టంగా మార్చుకుని అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిని వ‌దిలేది లేద‌న్నారు.

మ‌రో 100 ఏళ్లు టీడీపీ స‌జీవం

“తెలుగుదేశం పార్టీని మా తాత ఎన్టీఆర్ స్థాపించారు. ఇది పేద‌ల ప‌క్షపాత పార్టీ. దీనిని అంతం చేయాల‌ని, భూస్థాపితం చేయాలని చాలా మంది ప్ర‌య‌త్నించారు. కానీ, వారి ఆశ‌లు నెర‌వేర‌లేదు. అంతేకాదు.. ఎప్ప‌టికీ నెర‌వేర‌వు. మ‌రో 100 ఏళ్ల పాటు టీడీపీ బ‌లంగా ఉంటుంది. మ‌రింత‌గా విస్త‌రిస్తుంది.“ అని నారా లోకేష్ చెప్పారు. కార్య‌క‌ర్త‌లే పార్టీకి బ‌ల‌మ‌ని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు సైతం కార్య‌కర్త‌ల‌ను క‌లుపుకొని ముందుకు సాగాల‌న్నారు. చంద్ర‌బాబును అరెస్టు చేసిన‌ప్పుడు రాజ‌మండ్రి కార్య‌క‌ర్త‌లు ఉప్పెన‌లా త‌ర‌లి వ‌చ్చార‌ని.. ఆ సంగ‌తులు త‌న‌కు ఇప్ప‌టికీ గుర్తున్నాయ‌ని చెప్పారు.

ఏదున్నా.. నాలుగు గోడ‌ల మ‌ధ్యే..

పార్టీలో అల‌క‌లు.. బుజ్జ‌గింపులు ఉంటాయ‌ని.. అల‌క‌లు లేకుండా.. ఏ పార్టీ కూడా ఉండ‌ద‌ని, టీడీపీ వంటి భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు పెద్ద‌పీట వేసే పార్టీలో అల‌క‌లు ఒక జ‌బ్బుగా మారాయ‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. అయితే..ఏదున్నా కూడా.. రోడ్డున ప‌డితే తీవ్రంగా ప‌రిగ‌ణిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఎమ్మెల్యేల‌పైనా, ఎంపీల‌పైనా అల‌గ‌డం కంటే.. వారితో నేరుగా చ‌ర్చించి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. నాలుగు గోడ‌ల మ‌ధ్యే స‌మ‌స్య‌-ప‌రిష్కారం రెండూ కావాల‌ని .. ఎవ‌రూ మీడియా ముందుకు వ‌చ్చి.. ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగ‌డం స‌రికాద‌ని నారా లోకేష్ సూచించారు.

This post was last modified on December 19, 2025 10:23 pm

Share

Recent Posts

పంజా మీద ఇంత ప్రేమ దాచుకున్నారా

ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…

1 hour ago

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

3 hours ago

తమిళనాడులో అప్పుడే పెడాకులా…

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…

3 hours ago

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

3 hours ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

5 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

6 hours ago