రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్న మహిళానాయకురాలు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత.. సుంకర పద్మశ్రీ.. జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమెకు జనసేన నుంచి కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెబుతున్నారు.
వాస్తవానికి ఆది నుంచి కూడా కాంగ్రెస్లో ఉన్న సుంకర పద్మశ్రీ.. ఇటీవల కాలంలో ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పద్మశ్రీకి ప్రాధాన్యం తగ్గింది. తనకు రాష్ట్ర పార్టీ చీఫ్ పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నా.. పద్మశ్రీకి అవకాశం దక్కలేదు. దీనికితోడు.. ఆమెకు ప్రాధాన్యం తగ్గించారన్న వాదనతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరోవైపు.. షర్మిల, మాణిక్కం ఠాకూర్లు.. టికెట్లు అమ్ముకున్నారని.. గత ఎన్నికలకు ముంద ఆరోపించారు. దీంతో సుంకర వివాదం తారస్తాయికి చేరడంతో పద్మశ్రీ సహా పలువురిపై పార్టీ సస్పెన్షన్ విధించింది.
ఇలా.. అనేక పరిణామాల నేపథ్యంలో సుంకర పద్మశ్రీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి ఆమె టీడీపీలో చేరతారన్న ప్రచారం కూడా తెరమీదికి వచ్చింది. ఇదిలావుంటే.. తాజాగా జనసేన పార్టీలోకి ఆమె చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి.. గన్నవరం నుంచి పోటీ చేయాలని ఉత్సాహంగా ఉన్న పద్మశ్రీ.. తరచుగా నియోజకవర్గం సమస్యలపైనా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె గత ఎన్నికల్లోనే పోటీకి ప్రయత్నించారు. వచ్చే ఎన్నికల నాటికి.. ఆమె ఎట్టి పరిస్తితిలోనూ పోటీ చేయాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం జనసేన కూడా మహిళా నాయకులకు పెద్ద పీట వేయాలని భావిస్తోంది. వచ్చే రెండు మూడు మాసాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నిర్ణయించుకున్న దరిమిలా.. చేరికలకు అవకాశం కల్పిస్తోంది. అయితే.. వైసీపీ కంటే కూడా.. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సుంకరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. అన్నీ అనుకున్నట్టు జరిగితే..సుంకర పద్మశ్రీ.. పార్టీ మార్పు ఈ నెలలోనే ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
This post was last modified on December 19, 2025 10:43 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…