పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్ తో చెప్పారు. అయినా.. ఒక ఛాన్స్ ఇవ్వండి నేను నిరూపించుకుంటాను అని ఆ కలెక్టర్ అన్నారు. చివరకు ఆ ఉన్నతాధికారిని సీఎం భేష్ అంటూ ప్రశంసించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీ సచివాలయంలో ఈరోజు రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు తమ బెస్ట్ ప్రాక్టీసెస్ను ప్రజెంట్ చేయగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి అమలు చేస్తున్న ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని వివరించారు. ప్రభాకర్ రెడ్డి వివరించిన ముస్తాబు కార్యక్రమం తనను ఎంతగానో ఆకర్షించిందని సీఎం తెలిపారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారని, ఇది సామాజిక మార్పుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రభాకర్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ పోస్టింగ్ సమయంలో సీనియర్ అధికారుల నుంచి ఆయనపై సానుకూల అభిప్రాయాలు రాలేదని, ఎవరూ సిఫార్సు చేయలేదని తెలిపారు. అయినప్పటికీ ఒక్క అవకాశం ఇవ్వమని ప్రభాకర్ రెడ్డి తనను కోరగా, అవకాశం ఇచ్చానని, ఇప్పుడు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. పట్టుదల ఉంటే పనితీరుతోనే నిరూపించవచ్చు అని సీఎం వ్యాఖ్యానించారు.
ముస్తాబు కార్యక్రమం కింద పాఠశాలల్లో విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుక్కొని, సక్రమంగా సిద్ధమై తరగతుల్లోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. దీని వల్ల విద్యార్థులే కాకుండా వారి కుటుంబాల్లో కూడా వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుపడిందన్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నిటిలో అమలు చేయాలని సీఎం ఆదేశించారు. 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 79 లక్షల మంది విద్యార్థులతో పాటు దాదాపు 2 కోట్ల మందిపై ఈ కార్యక్రమం ప్రభావం చూపుతుందని సీఎం తెలిపారు.
This post was last modified on December 18, 2025 2:23 pm
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…