ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ (వ్యాపార సంస్కర్త-2025)కు ఆయన ఎంపికయ్యారు. ఈ అవార్డును ఏటా ప్రముఖ ఇంగ్లీష్ డైలీ.. ఎకనమిక్ టైమ్స్ ఇస్తుంది. ఈ ఏడాది సీఎం చంద్రబాబును ఈ అత్యుత్తమ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేయడం విశేషం. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ వెల్లడించడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు ఈ అవార్డు రావడం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇక, కుటుంబ పరంగా ఆనందానికి అవధులు లేవన్నారు. వ్యాపార సంస్కరణల విషయంలో సీఎం చంద్రబాబు రాజకీయాలకు అతీతంగా చాలా ధైర్యసాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్టు ఎకనమిక్ టైమ్స్ పత్రిక కొనియాడింది. పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసనీయత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు సీఎం చంద్రబాబు సరిగ్గా ఆ లక్షణాలను పొదివి పట్టుకున్నట్టు పేర్కొంది.
పెట్టుబడుల ఆకర్షణ, కేవలం 17 మాసాల్లోనే 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం తోపాటు అమరావతి రాజధానిని అభివృద్ధి చేయడం వంటి విషయాలను పత్రిక పేర్కొంది. అదేసమయంలో ఇప్పటి వరకు దేశంలో ఎవరూ చేయని విధంగా రైతుల నుంచి వేల ఎకరాలను భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్) రూపంలో తీసుకుని.. సంస్కరణలకు పునాదులు వేశారని తెలిపింది.
ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక.. ఆయనకు వ్యాపార సంస్కర్త-2025 అవార్డును ప్రదానం చేయనునట్టు తెలిపింది. `స్టేట్ ఆఫ్ దిమేటర్: నాయుడుగిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ బిగ్ బిజినెస్` శీర్షికతో పెద్ద కథనాన్ని ప్రచురించిన ఎకనమిక్స్ టైమ్స్.. ఆయన సాధించిన విజయాలు.. దీనికి గాను ఆయన పడిన కష్టాన్ని ప్రధానంగా ప్రస్తావించింది.
This post was last modified on December 18, 2025 2:19 pm
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…