ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ (వ్యాపార సంస్కర్త-2025)కు ఆయన ఎంపికయ్యారు. ఈ అవార్డును ఏటా ప్రముఖ ఇంగ్లీష్ డైలీ.. ఎకనమిక్ టైమ్స్ ఇస్తుంది. ఈ ఏడాది సీఎం చంద్రబాబును ఈ అత్యుత్తమ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేయడం విశేషం. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ వెల్లడించడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు ఈ అవార్డు రావడం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇక, కుటుంబ పరంగా ఆనందానికి అవధులు లేవన్నారు. వ్యాపార సంస్కరణల విషయంలో సీఎం చంద్రబాబు రాజకీయాలకు అతీతంగా చాలా ధైర్యసాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్టు ఎకనమిక్ టైమ్స్ పత్రిక కొనియాడింది. పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసనీయత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు సీఎం చంద్రబాబు సరిగ్గా ఆ లక్షణాలను పొదివి పట్టుకున్నట్టు పేర్కొంది.
పెట్టుబడుల ఆకర్షణ, కేవలం 17 మాసాల్లోనే 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం తోపాటు అమరావతి రాజధానిని అభివృద్ధి చేయడం వంటి విషయాలను పత్రిక పేర్కొంది. అదేసమయంలో ఇప్పటి వరకు దేశంలో ఎవరూ చేయని విధంగా రైతుల నుంచి వేల ఎకరాలను భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్) రూపంలో తీసుకుని.. సంస్కరణలకు పునాదులు వేశారని తెలిపింది.
ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక.. ఆయనకు వ్యాపార సంస్కర్త-2025 అవార్డును ప్రదానం చేయనునట్టు తెలిపింది. `స్టేట్ ఆఫ్ దిమేటర్: నాయుడుగిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ బిగ్ బిజినెస్` శీర్షికతో పెద్ద కథనాన్ని ప్రచురించిన ఎకనమిక్స్ టైమ్స్.. ఆయన సాధించిన విజయాలు.. దీనికి గాను ఆయన పడిన కష్టాన్ని ప్రధానంగా ప్రస్తావించింది.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…