Political News

‘రుషికొండ ప్యాలెస్ డబ్బుతో రెండు మెడికల్ కాలేజీలు కట్టొచ్చు’

వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కోటి సంతకాల సేకరణ చేసి, వాటిని గవర్నర్ కు సమర్పించి పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలను అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.

దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, పీపీపీ విధానంపై స్పష్టత ఇచ్చారు. పీపీపీ ద్వారా మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. కొందరు మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారని, అది పూర్తిగా రాజకీయ విమర్శ మాత్రమేనని అన్నారు. పీపీపీ విధానంలో నిర్మించినా అవి ప్రభుత్వ మెడికల్ కాలేజీల పేరుతోనే నడుస్తాయని, నిబంధనలన్నీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు.

జగన్ హయాంలో ప్రజాధనాన్ని భారీగా వృథా చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఆ డబ్బు సక్రమంగా ఉపయోగించి ఉంటే, ఇప్పుడు పీపీపీకి వెళ్లాల్సిన అవసరమే ఉండేదని అన్నారు. ముఖ్యంగా విశాఖ రుషికొండపై 550 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్యాలెస్ నిర్మించారని విమర్శించారు. ఆ మొత్తంతో రెండు నుంచి మూడు మెడికల్ కాలేజీలు నిర్మించవచ్చని తెలిపారు. అందుకే పీపీపీ అవసరం వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం రుషికొండ ప్యాలెస్ తెల్ల ఏనుగులా మారిందని వ్యాఖ్యానించారు.

పీపీపీ విధానంతో ప్రజలకు మేలు జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయా మెడికల్ కాలేజీలలో 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు అందుతాయని, సీట్ల సంఖ్య కూడా పెరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ విధానంలో ప్రాజెక్టులు చేపడుతోందని గుర్తు చేశారు.

విమర్శలకు భయపడాల్సిన అవసరం లేదని, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ బాధ్యత అధికారులు కూడా తీసుకోవాలని, తమ స్థాయిలో ప్రజలకు స్పష్టంగా వివరించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

This post was last modified on December 17, 2025 2:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మీ దగ్గర పనిచేస్తా – రాజమౌళితో క్యామరూన్

ప్రపంచం మొత్తంలో ఉన్న ఫిలిం మేకర్స్ ఆరాధనాభావంతో చూసే దర్శకుడు జేమ్స్ క్యామరూన్. అవతార్ అనే ఊహాతీత లోకాన్ని సృష్టించి…

52 minutes ago

‘దురంధర్’లో పాకిస్థాన్ సీన్లు ఎలా తీశారు?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో…

1 hour ago

షాకింగ్… నాగ్ దర్శకుడి మృతి

తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన పేరు కిరణ్…

2 hours ago

అవతార్-3 రివ్యూలు వచ్చేశాయ్

2009లో ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘అవతార్’. ఆ సినిమాకు కొనసాగింపుగా ఏకంగా…

4 hours ago

బ్లాక్ బస్టర్ సీక్వెల్ మీద అనుమానాలు

1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…

4 hours ago

ప్రభాస్ కోసం బాస్ వస్తారా

జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…

5 hours ago