Political News

జ‌గ‌న్‌ నిర్ణ‌యానికి చెక్‌, వారికి చంద్ర‌బాబు చ‌ల్ల‌ని క‌బురు!

గ‌త రెండు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్న వేలాది మందికి సీఎం చంద్ర‌బాబు తాజాగా చ‌ల్ల‌ని క‌బురు అందించారు. త‌మ భూముల‌ను వైసీపీ హ‌యాంలో `ఏ-22`లో చేర్చ‌డంతో వాటిపై హ‌క్కులు కోల్పోయిన వేలాది మందికి ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తూ.. తాజాగా నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయా భూముల‌ను ప‌రిశీలించి.. వాటిని `ఏ-22` జాబితా నుంచి తొల‌గించాల‌ని ఆదేశించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి ల‌బ్ధి చూకూర‌డంతోపాటు.. ఇన్నాళ్లుగా వారి ఆవేద‌న కూడా తీరిపోనుంది.

ఏంటీ `ఏ-22`

జ‌గ‌న్ పాల‌నాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 5.74 ల‌క్ష‌ల ఎక‌రాల అసైన్డ్ భూముల‌ను ఏ-22లో చేర్చారు. త‌ద్వారా ఆయా భూములు క‌లిగిన వారికి ఎలాంటి హ‌క్కులు లేక‌పోగా, ప్ర‌భుత్వానికి వారు వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది. దీనిపై అప్ప‌ట్లోనే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు, వివాదాలు వ‌చ్చాయి. అంతేకాదు.. వైసీపీ నాయ‌కులు కొంద‌రు ఈ భూముల‌పై క‌న్నేశార‌ని.. వాటిని స్వాధీనం కూడా చేసుకున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల‌కు ముందు ఈ వ్య‌వ‌హారం కూడా వివాదంగా మారింది.

తాజాగా ఈ 5.74 ల‌క్ష‌ల ఎక‌రాల భూముల‌పై దృష్టి పెట్టిన సీఎం చంద్ర‌బాబు.. ఆయా భూముల వివ‌రాల‌ను మ‌రోసారి ప‌రిశీలించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. “ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున ఈ భూముల‌పై విన్న‌పాలు వ‌చ్చాయి. స్వ‌యంగా నేను కూడా విన్నాను. ప్ర‌జ‌లు తీవ్ర ఆవేద‌న‌తో ఉన్నారు. ఫ్రీహోల్డ్‌లో ఉంచిన అసైన్డ్ భూముల‌ను.. రిస‌ర్వే చేసి.. ఆయా య‌జ‌మానుల‌కు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోండి.“ అని చంద్ర‌బాబు ఆదేశించారు. గతేడాది జూన్ 15 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు 5.28 ల‌క్ష‌ల ఫిర్యాదులు కేవ‌లం ఏ-22పైనే రావ‌డం గ‌మ‌నార్హ‌మ‌ని కూడా సీఎం అన్నారు.

దీంతో మాజీ సైనికోద్యోగులు, వైసీపీ హ‌యాంలో క‌క్ష‌పూరితంగా భూములు లాక్కున్న వారికి తాజాగా న్యాయం జ‌ర‌గ‌నుంది. అదేవిధంగా ఆరు వేల‌కు పైగా గ్రామాల్లో రీస‌ర్వే చేసి.. త‌ప్పులు లేకుండా ఆయారికార్డుల‌ను అప్ గ్రేడ్ చేయాల‌ని కూడా సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. తాజా నిర్ణ‌యాల‌తో వేలాది మందికి మేలు జ‌ర‌గ‌నుంది.

This post was last modified on December 10, 2025 8:42 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

3 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

20 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

1 hour ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago