తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దయవల్ల తన ఇమేజ్ నార్త్ వరకు పాకిందని.. ఒకప్పుడు తానెవరో.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలకు తెలియదని… కానీ.. బీజేపీ నాయకు లు ఇప్పుడు చేస్తున్న అతి ప్రచారం కారణంగా.. తన పేరు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వినిపిస్తున్నట్టు తెలిపారు. తాజాగా ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి.. ప్రధాని నరేంద్ర మోడీ.. ఇతర కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా వారికి ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న సదస్సుకు రావాలని ఆహ్వానం పలికా రు.
అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ కార్యకర్తలు, నాయకులతో అనేక సందర్భాల్లో అంతర్గతంగా చర్చలు జరిపానని.. అయితే.. ఆ సమయంలో మాట్లాడిన మాటలను బీజేపీ నాయకులు ఎడిట్ చేసి.. ప్రచారం చేస్తున్నారని చెప్పారు. “ఇది వారి బుద్ధికి నిదర్శనం. దీనివల్ల నేనేంటో ఉత్తరాదికి కూడా తెలుస్తోంది.” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కూడా హిందూ సమాజం వంటిదేనని తాను చెప్పానని అయితే.. దీనిని ఎడిట్ చేసి.. తానే తప్పు మాట్లాడినట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదని.. ఆ అక్కసుతో తనపై ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇక, ఈ నెల 8, 9 తేదీల్లోఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్-2047 సదస్సుకు వివిధ దేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారని సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా అందరు సీఎంలకు ఆహ్వానాలు పంపుతున్నామని.. ఈ సదస్సుకు రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. భవిష్యత్తు తెలంగాణను ఈ సదస్సు వేదికగా ఆవిష్కరించనున్నట్టు చెప్పారు.
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…