Political News

బీజేపీ ద‌య‌వ‌ల్ల నా ఇమేజ్ నార్త్‌లోనూ పెరిగింది: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ ద‌య‌వ‌ల్ల త‌న ఇమేజ్ నార్త్ వ‌ర‌కు పాకింద‌ని.. ఒక‌ప్పుడు తానెవ‌రో.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు తెలియ‌ద‌ని… కానీ.. బీజేపీ నాయ‌కు లు ఇప్పుడు చేస్తున్న అతి ప్ర‌చారం కార‌ణంగా.. త‌న పేరు ఇప్పుడు ఉత్త‌రాది రాష్ట్రాల్లోనూ వినిపిస్తున్న‌ట్టు తెలిపారు. తాజాగా ఢిల్లీకి వెళ్లిన ముఖ్య‌మంత్రి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇత‌ర కేంద్ర మంత్రుల‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారికి ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న స‌ద‌స్సుకు రావాల‌ని ఆహ్వానం ప‌లికా రు.

అనంత‌రం.. మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో అనేక సంద‌ర్భాల్లో అంతర్గతంగా చ‌ర్చ‌లు జ‌రిపాన‌ని.. అయితే.. ఆ స‌మ‌యంలో మాట్లాడిన మాట‌ల‌ను బీజేపీ నాయ‌కులు ఎడిట్ చేసి.. ప్ర‌చారం చేస్తున్నార‌ని చెప్పారు. “ఇది వారి బుద్ధికి నిద‌ర్శ‌నం. దీనివ‌ల్ల నేనేంటో ఉత్త‌రాదికి కూడా తెలుస్తోంది.” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కూడా హిందూ స‌మాజం వంటిదేన‌ని తాను చెప్పాన‌ని అయితే.. దీనిని ఎడిట్ చేసి.. తానే త‌ప్పు మాట్లాడిన‌ట్టు ప్ర‌చారం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా ద‌క్క‌లేద‌ని.. ఆ అక్క‌సుతో త‌న‌పై ప్ర‌చారం చేస్తున్నార‌ని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. ఇక‌, ఈ నెల 8, 9 తేదీల్లోఫ్యూచ‌ర్ సిటీలో నిర్వ‌హించ‌నున్న తెలంగాణ రైజింగ్‌-2047 స‌ద‌స్సుకు వివిధ దేశాల నుంచి కూడా ప్ర‌తినిధులు వ‌స్తున్నార‌ని సీఎం తెలిపారు. దేశ‌వ్యాప్తంగా అంద‌రు సీఎంల‌కు ఆహ్వానాలు పంపుతున్నామ‌ని.. ఈ స‌ద‌స్సుకు రావాల‌ని ఆహ్వానిస్తున్నామ‌న్నారు. భ‌విష్య‌త్తు తెలంగాణను ఈ స‌ద‌స్సు వేదిక‌గా ఆవిష్క‌రించ‌నున్న‌ట్టు చెప్పారు.

This post was last modified on December 3, 2025 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

20 minutes ago

హౌస్ ఫుల్, బ్లాక్ బస్టర్ అంతా ఉత్తిదేనా?

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…

52 minutes ago

ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…

1 hour ago

దురంధర్-2 వాయిదా పడితే..?

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…

1 hour ago

మళ్లీ థియేటర్ల హాహాకారాలు

గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…

2 hours ago

అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే.. ఆడుకున్న టీడీపీ నేతలు

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు తొలిరోజు మాత్ర‌మే వ‌చ్చిన వైసీపీ స‌భ్యులు.. త‌ర్వాత పార్టీ అధినేత జ‌గ‌న్ ఆదేశాల‌తో స‌భ‌కు…

4 hours ago