ఏపీ సీఐడీ చీఫ్గా పనిచేసి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై సస్పెన్షన్ వేటు వేయాలని కోరుతూ.. టీడీపీ నేత, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే, అసెంబ్లీ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు కోరారు. సునీల్ పనిగట్టుకుని కులాలనురెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్(డీవోపీటీ)కి లేఖ రాశారు. ఈ లేఖలో తాజాగా సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.
ఐపీఎస్ అధికారిగా ఉన్న సునీల్కుమార్కు డిపార్ట్మెంటు రూల్స్ వర్తిస్తాయని, దీని ప్రచారం పదవుల్లో ఉండి.. రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయడం తప్పని రఘురామ పేర్కొన్నారు. పైగా రాజకీయపరమైన కార్యక్రమాలు, సభలు, సమావేశాలలో పాల్గొనడంపై అధికారులకు నిషేధం ఉంటుందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని తెలిసి కూడా సీనియర్ ఐపీఎస్ అదికారి అయిన సునీల్ తప్పు చేశారని రఘురామ పేర్కొన్నారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీవోపీటీకి ఫిర్యాదు చేశారు. కాపులు, అదేసమయంలో దళితులను కూడా ఆయన రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు.
మరోవైపు.. సునీల్పైకేసులు ఉన్నాయని తెలిపిన రఘురామ.. దీనిపై విచారణ కూడాజరుగుతోందన్నారు. ఇప్పటికే ఏపీ పోలీసులు ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారని తెలిపారు. విచారణకు హాజరు కావాల్సిన సునీల్ ఇలా రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాపులు, దళితులు కలిస్తే రాజ్యాధికారం మనదేనని సునీల్ చేసిన వ్యాఖ్యలను రఘురామ ఉటంకించారు. ఈ వ్యాఖ్యలు అఖిల భారత సర్వీసు రూల్స్కు విరుద్ధమని, కాబట్టి కఠిన చర్యలు తీసుకుని.. భవిష్యత్తులో ఎవరూ ఇలా వ్యాఖ్యానించకుండా.. ఆదర్శంగా నిలవాలని సూచించారు. సునీల్ను సర్వీసు నుంచి తొలగించాలని కోరారు.
సునీల్ ఏమన్నారు?
గుంటూరులో నిర్వహించిన దళిత బహుజనుల సమావేశంలో ఆదివారం పాల్గొన్న సునీల్.. దళితులు-కాపులు రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. వీరి మద్దతు అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ఒక పార్టీకి మద్దతు తెలిపే బదులు దళితులు-కాపులు ఏకమై కూటమిగా నిలిస్తే.. రాజ్యాధికారం దక్కుతుందని చెప్పారు. అనంతరం కాపులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నముఖ్యమంత్రిపదవిని పొందవచ్చన్నారు. దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని పేర్కొన్నారు. తద్వారా.. దళితులు తమ సమస్యలు తాము పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ వ్యాఖ్యలపైనే రఘురామ ఇప్పుడు ఫిర్యాదు చేశారు.
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…