తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏడాదిన్నరగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు అసెంబ్లీకి, అటు జనంలోకి రాకుండా కేసీఆర్ కేవలం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారని రేవంత్ పలుమార్లు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ గోడకి వేలాడదీసిన తుపాకీలా సైలెంట్ గా ఉంటారని, కానీ ఆ తుపాకీకి ఎప్పుడు ఎలా పేలాలో బాగా తెలుసని కేటీఆర్ అన్నారు. అవసరమైనప్పుడు, సమయం రాగానే ఆ తుపాకీ పేలుతుందని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి గత రెండేళ్లలో ఇచ్చిన స్పీచ్ లలో కేసీఆర్ పేరెత్తకుండా ఒక్క స్పీచ్ లేదని, కానీ కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా రేవంత్ పేరెత్తలేదని ఎద్దేవా చేశారు.
అది కేసీఆర్ స్థాయి అని, రేవంత్ స్థాయి ఏంటో ఆయన తెలుసుకోవాలని కేటీఆర్ అన్నారు. నాయకుడికి, అర్భకుడికి ఉన్న తేడా ఇదేనని చురకలు అంటించారు. కేసీఆర్ మాట్లాడినా సంచలనమేనని, మాట్లాడకపోయినా సంచలనమేనని వ్యాఖ్యానించారు. తీస్ మార్ ఖాన్ లా రేవంత్ పెద్ద పెద్ద మాటలు మాత్రమే మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు.
సరిగ్గా 16 ఏళ్ల క్రితం నవంబరు 29న ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా నేడు దీక్షా దివస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ త్యాగాన్ని, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను బీఆర్ఎస్ నేతలు స్మరించారు.
This post was last modified on November 29, 2025 6:32 pm
గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా…
ఒక భారీ చిత్రం విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం గత కొద్ది కాలంలో తొలిసారిగా…
గాడ్ ఆఫ్ వార్.. ఏడాది కిందట్నుంచి టాలీవుడ్లో విపరీతంగా చర్చనీయాంశం అవుతున్న ప్రాజెక్టు. ఇప్పటిదాకా ఎక్కువగా ఫ్యామిలీ, మాస్, యాక్షన్…
సినిమాల్లో పాత్రలను కొంతమంది నిజ జీవితంలో కూడా ఎంతో ఓన్ చేసుకుంటారు. తెరపై వారికి అన్యాయం జరిగితే నిజంగానే వారికేదో నష్టం…
పార్లమెంటులో డీలిమిటేషన్ సహా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు.. ఎంతసమయమైనా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ వ్యవహారంపై…
అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై…