Political News

నేనే త‌ప్పుచేసి… నేనే కోర్టుకెళ్లానా?: సుబ్బారెడ్డి

“నేనే త‌ప్పు చేసి.. నేనే కోర్టుకువెళ్తానా?“ అని టీటీడీ మాజీ చైర్మ‌న్‌, వైసీపీ నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి ప్ర‌శ్నించారు. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయంగా చూస్తున్నార‌ని విమ‌ర్శించారు. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించిన ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప‌ర‌కామ‌ణి దొంగ‌త‌నం కేసు విష‌యంలో విచార‌ణ నిమిత్తం విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన సుబ్బారెడ్డి .. అధికారుల ముందు హాజ‌ర‌య్యారు. అనంత‌రం.. బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ప‌ర‌కామ‌ణి కేసు గురించి కాకుండా.. క‌ల్తీ నెయ్యి గురించి మాట్లాడారు. త‌న హ‌యాంలో క‌ల్తీ నెయ్యి స‌ర‌ఫ‌రా అయింద‌న్న ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు తెలిపారు. తిరుమల లడ్డూలలో ఉపయోగించే నెయ్యి కల్తీపై ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. తప్పుడు సమాచారంతో  ప్రచారం చేస్తున్నార‌ని అన్నారు. తిరుమలను రాజకీయ వివాదాలలోకి లాగకూడ‌దంటూ.. సుప్రీంకోర్టు హెచ్చరిక చేసినప్పటికీ ఈ అంశాన్ని కొంద‌రు రాజ‌కీయంగానే వాడుకుంటున్నార‌ని తెలిపారు.

కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు ఉన్న‌ట్టు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు ఎటువంటి శాస్త్రీయ ధృవీకరణ లేద‌న్నారు.  “నేను తప్పు చేసి ఉంటే, నేను సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఎందుకు దాఖలు చేస్తాను?” అని ఆయన ప్రశ్నించారు, అటువంటి ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రజా ప్రయోజనాల కోసం తాను కోర్టును ఆశ్రయించానని సుబ్బారెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశించిన త‌ర్వాత ఏర్పాటైన‌ సిట్ దర్యాప్తు ఇంకా పురోగతిలో ఉందని, సిట్ ద‌ర్యాప్తు పూర్తికాకుండానే.. మీడియాలో సంచ‌ల‌నాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

“రెండు ప్రాథమిక ప్రశ్నలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. అనుమానిత నెయ్యి ట్యాంకర్ల ద్వారా వ‌చ్చిన నెయ్యిని ఎప్పుడైనా లడ్డూల‌లో ఉప‌యోగించారా? జంతువుల కొవ్వు ఉందా లేదా? అనే విష‌యాలు ఇప్ప‌టికీ సందేహంగానే ఉన్నాయ‌ని.. ఎటూ తెల‌లేదు.“ అని సుబ్బారెడ్డి చెప్పారు. దీనిపై టిటిడి స్పష్టమైన అధికారిక ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెయ్యి ట్యాంకర్ తప్పనిసరిగా ప్రయోగశాలకు వెళ్తుంద‌ని.. అనుమానాస్పద ట్యాంకర్లను వెన‌క్కి పంపేస్తార‌ని చెప్పారు.  అయినా.. త‌మ‌పై అభాండాలు వేస్తున్నారని అన్నారు. వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రైన చ‌ర్య అవుతుంద‌న్నారు.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

6 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

7 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

9 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

9 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

10 hours ago