Political News

నేనే త‌ప్పుచేసి… నేనే కోర్టుకెళ్లానా?: సుబ్బారెడ్డి

“నేనే త‌ప్పు చేసి.. నేనే కోర్టుకువెళ్తానా?“ అని టీటీడీ మాజీ చైర్మ‌న్‌, వైసీపీ నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి ప్ర‌శ్నించారు. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయంగా చూస్తున్నార‌ని విమ‌ర్శించారు. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించిన ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప‌ర‌కామ‌ణి దొంగ‌త‌నం కేసు విష‌యంలో విచార‌ణ నిమిత్తం విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన సుబ్బారెడ్డి .. అధికారుల ముందు హాజ‌ర‌య్యారు. అనంత‌రం.. బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ప‌ర‌కామ‌ణి కేసు గురించి కాకుండా.. క‌ల్తీ నెయ్యి గురించి మాట్లాడారు. త‌న హ‌యాంలో క‌ల్తీ నెయ్యి స‌ర‌ఫ‌రా అయింద‌న్న ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు తెలిపారు. తిరుమల లడ్డూలలో ఉపయోగించే నెయ్యి కల్తీపై ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. తప్పుడు సమాచారంతో  ప్రచారం చేస్తున్నార‌ని అన్నారు. తిరుమలను రాజకీయ వివాదాలలోకి లాగకూడ‌దంటూ.. సుప్రీంకోర్టు హెచ్చరిక చేసినప్పటికీ ఈ అంశాన్ని కొంద‌రు రాజ‌కీయంగానే వాడుకుంటున్నార‌ని తెలిపారు.

కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు ఉన్న‌ట్టు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు ఎటువంటి శాస్త్రీయ ధృవీకరణ లేద‌న్నారు.  “నేను తప్పు చేసి ఉంటే, నేను సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఎందుకు దాఖలు చేస్తాను?” అని ఆయన ప్రశ్నించారు, అటువంటి ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రజా ప్రయోజనాల కోసం తాను కోర్టును ఆశ్రయించానని సుబ్బారెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశించిన త‌ర్వాత ఏర్పాటైన‌ సిట్ దర్యాప్తు ఇంకా పురోగతిలో ఉందని, సిట్ ద‌ర్యాప్తు పూర్తికాకుండానే.. మీడియాలో సంచ‌ల‌నాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

“రెండు ప్రాథమిక ప్రశ్నలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. అనుమానిత నెయ్యి ట్యాంకర్ల ద్వారా వ‌చ్చిన నెయ్యిని ఎప్పుడైనా లడ్డూల‌లో ఉప‌యోగించారా? జంతువుల కొవ్వు ఉందా లేదా? అనే విష‌యాలు ఇప్ప‌టికీ సందేహంగానే ఉన్నాయ‌ని.. ఎటూ తెల‌లేదు.“ అని సుబ్బారెడ్డి చెప్పారు. దీనిపై టిటిడి స్పష్టమైన అధికారిక ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెయ్యి ట్యాంకర్ తప్పనిసరిగా ప్రయోగశాలకు వెళ్తుంద‌ని.. అనుమానాస్పద ట్యాంకర్లను వెన‌క్కి పంపేస్తార‌ని చెప్పారు.  అయినా.. త‌మ‌పై అభాండాలు వేస్తున్నారని అన్నారు. వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రైన చ‌ర్య అవుతుంద‌న్నారు.

This post was last modified on November 29, 2025 10:52 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

36 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

52 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago